Car Sold: ఇదెక్కడి పనికిమాలిన ఐడియా రా.. అద్దెకు తీసుకున్న కారును అమ్మడం ఏంటి రా బాబు..
- ఫిబ్రవరి 25న కారు అద్దెకు తీసుకున్న దుండగులు..
- తీసుకు వెళ్లిన వ్యక్తులపై నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
- పాత కారు నెంబర్ ప్లేటుతో పాటు ఫాస్టాగ్ మార్పు..
- రూ. 2.5 లక్షలకే కారు అమ్ముకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అద్దె కారు తీసుకున్నారు.. లాంగ్ డ్రైవ్కు వెళ్లారు.. మధ్యలో ఓ కన్నింగ్ ఐడియా వచ్చింది. అక్కడే కారు రూపు రేఖలు మార్చేశారు. తక్కువ ధరకు కారు విక్రయించేసి డబ్బులు తీసుకుని చెక్కేశారు. ఇక కారు యజమాని అడిగితే.. ట్రిప్లోనే ఉన్నామని బురిడీ కొట్టించిన బే’కార్’గాళ్లను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అద్దెకు తీసుకున్న కారునే అమ్మేసుకున్నారు..
హైదరాబాద్లో కొంత మంది కేటుగాళ్లు.. జల్సాలకు అలవాటు పడి.. అద్దెకు తీసుకున్న కారునే అమ్మేసుకున్నారు. అలాంటి ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇందులో నల్లకుంట నివాసి రామలింగేశ్వర కారును ఫిబ్రవరి 25న కొంత మంది దుండగులు లాంగ్ డ్రైవ్ పేరుతో అద్దెకు తీసుకున్నారు. తర్వాత మిత్రులంతా కలిసి లాంగ్ డ్రైవ్ కోసం రాజస్థాన్ వెళ్లారు. అలా తీసుకు వెళ్లిన కారు.. చాలా రోజులైనా తిరిగి రాకపోవడంతో కారు యజమానికి డౌట్ కొట్టింది. దీంతో తీసుకు వెళ్లిన వ్యక్తులపై నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తు చేయగా.. అసలు విషయం వెలుగు చూసింది.
Also Read
- Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
- Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
Also Read:Sangareddy: బతుకుదెరువు కోసం వలస వచ్చిన భార్యాభర్తలు.. తెల్లవారుజామున దారుణం..
కారును రాజస్థాన్కు తీసుకు వెళ్లిన దుండగులు.. అక్కడే ఓ స్క్రాప్ దుకాణంలో ఉన్న మరో పాత కారు నెంబర్ ప్లేటుతో పాటు ఫాస్టాగ్ తీసి లాంగ్ డ్రైవ్కి తీసుకు వెళ్లిన కారుకు అమర్చారు. అంతే కాదు.. అంతా కరెక్ట్గా ఉందనుకున్న తర్వాత రాజస్థాన్లోనే కారును అమ్మేశారు. రూ. 2.5 లక్షలకే కారు అమ్ముకున్నారు. ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, బాబానగర్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మహీంద్రా XUV కారుతోపాటు 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..