Family Su*cide: ఆర్థిక భారమే కారణమా? భయంతో ముగ్గురు సూసైడ్కు పాల్పడ్డారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Family Su*cide: కోటీశ్వరులు.. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి.. ఇక ఎన్నో ఏళ్లుగా హోటల్ బిజినెస్ చేస్తున్నారు. కానీ ఏం కష్టం వచ్చిందో తెలియదు… అర్ధాంతరంగా ఓ కుటుంబం తనువు చాలించింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. తమ మృతికి ఆర్థిక భారం కారణం అంటూ సూసైడ్ నోట్ రాశారు. నిజంగానే వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? లేక పరువు పోతుందేమోనన్న భయంతో ముగ్గురు సూసైడ్కు పాల్పడ్డారా? హైదరాబాద్ అంబర్పేట్లోని బాపూజీ నగర్లో అసలేం జరిగింది?
Rinku Singh: టీమిండియాకు బిగ్ షాక్.. జింబాబ్వే మ్యాచ్కు రింకూ సింగ్ దూరం..!
Also Read
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
- Bengaluru: కన్నడ నటి ఇంట్లో వ్యాపారవేత్త మృతి.. మిస్టరీగా మారిన కేసు
హైదరాబాద్ అంబర్ పేట్ లోని బాపూజీ నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. ల్యాండ్ మార్క్ హోటల్ యజమాని కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య పాల్పడ్డారు. మృతులను రామ్రాజ్, మాధవి, శశాంక్గా గుర్తించారు. హైదరాబాద్ అంబర్ పేట్లో ల్యాండ్మార్క్ హోటల్ యజమాని రామ్రాజ్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్న వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. రామ్ రాజ్ ఫ్యామిలీ ఎన్నో ఏళ్లుగా అంబర్పేట్లోనే నివాసం ఉంటున్నారు. సొంతిల్లు.. పెద్ద భవనం.. కోట్లలో ఆస్తులు ఉన్నాయి. కానీ ముగ్గురు సూసైడ్ చేసుకోవడంపై అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..
రామ్ రాజ్ ముందు భార్య మాధవిని చంపి, అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు రామ్రాజ్ కుమారుడు శశాంక్ తన ఎడమ చేయి కోసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కానీ అతను చనిపోకపోవడంతో ఇంట్లోనే ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి పోలీసులు సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో చనిపోతున్నట్టు రామ్రాజ్ సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. తన ఆస్తులు మొత్తం తన కూతురికేనంటూ వీలునామా కూడా రాసినట్లు సమాచారం.
VK Sasikala New Political Party: తమిళనాడులో మరో కొత్త రాజకీయ పార్టీ.. జయలలిత నెచ్చెలి శశికళ ప్రకటన..
ప్రస్తుతం రామ్రాజ్ కూతురు అమూల్య కొంపల్లిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. సూసైడ్ నోట్ ఆధారంగా విచారణ చేస్తున్నారు పోలీసులు. రామ్రాజ్ కూతురు ఏదైనా కోణంలో అనుమానం వ్యక్తం చేస్తే.. ఆ దిశగా కూడా విచారణ చేస్తామని చెప్పారు పోలీసులు. ల్యాండ్మార్క్ హోటల్ యజమాని కుటుంబం మృతిపై రామ్రాజ్ అన్న జగదీశ్ తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆర్థిక ఇబ్బందులు పెద్ద సమస్య కాదని, తమది వెల్ సెటిల్డ్ కుటుంబం అని చెప్పారు. తమకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు జగదీష్. నా తమ్ముడు ఫ్యామిలీ సూసైడ్ ఎందుకు చేసుకున్నారో.. అసలు ఏం జరిగిందో తెలియడం లేదని కంటతడి పెట్టారు.
మరోవైపు తెల్లవారు 3 గంటల 15 నిమిషాలకు రవి అనే మిత్రుడికి రామ్ రాజ్ వాట్సాప్లో సూసైడ్ చేసుకున్నామని మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన మిత్రుడు రామ్ రాజ్ ఇంటికి వచ్చి చూసేసరికి భార్యభర్తలు ఇద్దరు ఉరేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు రవి. రామ్ రాజ్.. అంబర్పేట్లో ల్యాండ్ మార్క్ హోటల్, మల్లేపల్లిలో బిరియాని సెంటర్, మల్లాపూర్లో కింగ్స్ హోటల్, చక్రిపురంలో మరొక హోటల్ నిర్వహిస్తున్నారు. ఐతే ఎవరైనా అప్పులు ఇచ్చిన వారు భయపడితే చనిపోయారా? ఎవరైనా భయపెట్టారా? ఇలా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు పోలీసులు.
తాజావార్తలు
-
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
-
Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
-
Isakapatnam Trailer: అధికారం కోసం కన్నతండ్రినే ఢీకొట్టిన కూతురు!”
-
Idupu Kayitham : ‘ఇడుపు కాయితం’ చుట్టూ కొత్త వివాదం.. అసలు ఈ పదం అర్ధమేంటి?
-
SIR Survey : మాది ఏ రాష్ట్రమో తేల్చండి.. తెలంగాణలోని ఆ గ్రామాల్లో ‘సర్’ ప్రక్రియకు బ్రేక్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!