Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
- భార్య హింస ముందు ఓడిపోయాను..
- చేయి పట్టుకున్న భార్య కారణంగానే మరణం..
- ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Suicide: భార్య, ఆమె కుటుంబం వేధింపుల వల్ల తనువు చాలిస్తున్న భర్తల కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఒక యువ ఇంజనీర్ భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం కుషినగర్లో ఒక చెట్టుకు ఉరి వేసుకుని మరణించారు. మరణానికి ముందు ఒక వీడియోలో తన చావుకు భార్యనే కారణమని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
వెల్వా పాలక్ధారి గ్రామానికి చెందిన 33 ఏళ్ల ప్రద్యుమ్న కుమార్ యాదవ్, మధ్యప్రదేశ్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా పని చేస్తున్నాడు. మరణించడానికి ముందు భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘ నేను చనిపోయే సమయం ఇది కాదు. కానీ నా భార్య హింసను భరిస్తూ బతకడం నాకు ఇష్టం లేదు. నేను అకాల మరణం చెందానని ఎవరూ అనుకోకూడదు. అన్నయ్యా దయచేసి తల్లిదండ్రులకు కొడుకు లేడనే భావన కలుగనివ్వకు. ప్రతీ తల్లిదండ్రులు తమ వృద్ధాప్యంలో అండగా ఉండే కొడుకును ఆశిస్తారు. కానీ నా భార్య పెడుతున్న బాధల ముందు నేను వారి దు:ఖాన్ని మరిచిపోయాను. ఇప్పుడు నాకున్న ఏకైక మార్గం ఇదే. నేను జీవితంపై ఆశ కోల్పోయాను. దీనికి కారణం మరెవరో కాదు, నేను కొత్త జీవితం ప్రారంభించినప్పుడు నా చేయి పట్టుకున్న నా భార్యే. ఆమె వరకట్నం వేధింపుల కేసు పెట్టింది, దాంతో నేను కుంగిపోయాను. ఆ కుంగుబాటుకు ఎంతగా కుంగిపోయానంటే, నా జీవితాన్ని ముగించుకున్నాను’’ అని వీడియో మెసేజ్లో చెప్పారు.
Also Read
- Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- Crime News: రహస్యంగా పెళ్లి.. చివరకి భార్యకు విషం తాగించి, గొంతు నులిమి చంపాడు.. భర్తను పట్టించిన ఇన్స్టా స్టోరీ!
- Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
2017లో కుషినగర్ సమీపంలోని సోహగ్ గ్రామానికి చెందిన అర్పిత యాదవ్ను పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత ప్రద్యుమన్తో కలిసి హర్యానాలో నివసించింది. 2020లో ఇద్దరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అర్పితా ప్రద్యుమన్పై వరకట్న వేధింపులు కేసు పెట్టింది. అప్పటి నుంచి అర్పిత తన 5 ఏళ్ల కుమార్తెతో కలిసి తల్లితో ఉంటోంది. కోర్టు కేసులు ప్రద్యుమన్ను మానసిక క్షోభకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Sai Krishna Incident: సాయికృష్ణ ఘటనపై సీఎం సీరియస్.. ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు
-
Vaibhav Sooryavanshi: ఫీల్డింగ్పై విమర్శలా? అయితే ఈ క్యాచ్ చూడండి.. వైభవ్ సూర్యవంశీ అద్భుతం..
-
Dhanush: తండ్రిలా తానే డైరెక్ట్ చేస్తాడా? లేదా వేరే వాళ్ళకి వదిలేస్తాడా?
-
Team India: 400 ప్లస్ స్కోర్తో మరో రికార్డు సాధించిన టీమిండియా.. ఆస్ట్రేలియా, ఇంగ్లాడ్లను వెనక్కి నెట్టి..
-
Ilhan Omar: జాతి నిర్మూలనలో 8వ దశకు చేరింది.. భారత్పై అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!