Husband Suicide: ‘‘నా చేయి పట్టుకున్న భార్యే నన్ను చంపింది’’.. సూసైడ్ వీడియోలో భర్త ఆవేదన
- భార్య హింస ముందు ఓడిపోయాను..
- చేయి పట్టుకున్న భార్య కారణంగానే మరణం..
- ఆత్మహత్య చేసుకున్న ఇంజనీర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Husband Suicide: భార్య, ఆమె కుటుంబం వేధింపుల వల్ల తనువు చాలిస్తున్న భర్తల కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఒక యువ ఇంజనీర్ భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం కుషినగర్లో ఒక చెట్టుకు ఉరి వేసుకుని మరణించారు. మరణానికి ముందు ఒక వీడియోలో తన చావుకు భార్యనే కారణమని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
వెల్వా పాలక్ధారి గ్రామానికి చెందిన 33 ఏళ్ల ప్రద్యుమ్న కుమార్ యాదవ్, మధ్యప్రదేశ్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా పని చేస్తున్నాడు. మరణించడానికి ముందు భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘ నేను చనిపోయే సమయం ఇది కాదు. కానీ నా భార్య హింసను భరిస్తూ బతకడం నాకు ఇష్టం లేదు. నేను అకాల మరణం చెందానని ఎవరూ అనుకోకూడదు. అన్నయ్యా దయచేసి తల్లిదండ్రులకు కొడుకు లేడనే భావన కలుగనివ్వకు. ప్రతీ తల్లిదండ్రులు తమ వృద్ధాప్యంలో అండగా ఉండే కొడుకును ఆశిస్తారు. కానీ నా భార్య పెడుతున్న బాధల ముందు నేను వారి దు:ఖాన్ని మరిచిపోయాను. ఇప్పుడు నాకున్న ఏకైక మార్గం ఇదే. నేను జీవితంపై ఆశ కోల్పోయాను. దీనికి కారణం మరెవరో కాదు, నేను కొత్త జీవితం ప్రారంభించినప్పుడు నా చేయి పట్టుకున్న నా భార్యే. ఆమె వరకట్నం వేధింపుల కేసు పెట్టింది, దాంతో నేను కుంగిపోయాను. ఆ కుంగుబాటుకు ఎంతగా కుంగిపోయానంటే, నా జీవితాన్ని ముగించుకున్నాను’’ అని వీడియో మెసేజ్లో చెప్పారు.
Also Read
- Uttar Pradesh: టీ-షర్ట్, ప్యాంట్ వేసుకోవడంపై గొడవ.. భార్యను చంపిన భర్త ఆత్మహత్య..
- Delhi Gang R*ape: కదులుతున్న బస్సులో మహిళపై సామూహిక అత్యాచారం.. కండక్టర్, డ్రైవర్ అరెస్ట్.!
- Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
- TCS Nashik Case: టీసీఎస్ నాసిక్ మతమార్పిడి కేసు.. నిదాఖాన్కు ఆశ్రయం ఇచ్చిన ఇంటిని కూల్చి వేస్తారా.?
2017లో కుషినగర్ సమీపంలోని సోహగ్ గ్రామానికి చెందిన అర్పిత యాదవ్ను పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత ప్రద్యుమన్తో కలిసి హర్యానాలో నివసించింది. 2020లో ఇద్దరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అర్పితా ప్రద్యుమన్పై వరకట్న వేధింపులు కేసు పెట్టింది. అప్పటి నుంచి అర్పిత తన 5 ఏళ్ల కుమార్తెతో కలిసి తల్లితో ఉంటోంది. కోర్టు కేసులు ప్రద్యుమన్ను మానసిక క్షోభకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!