Howrah murder: జ్వరానికి క్యాన్సర్ మందులు.. ప్రియుడితో కలిసి భార్య దుర్మార్గం..
- ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య..
- సాధారణ జ్వరానికి క్యాన్సర్ మందులు..
- అవయవాల వైఫల్యంతో భర్త మృతి..
- డాక్టర్లకు అనుమానం రావడంతో వెలుగులోకి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Howrah murder: అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. చాలా వరకు కేసుల్లో భార్యలు తమ ప్రియులతో కలిసి భర్తల్ని హతమారుస్తున్నారు. క్షణకాలం సుఖాల కోసం హత్యలకు పాల్పడటం కాకుండా, పిల్లల్ని ఒంటరివాళ్లను చేస్తు్న్నారు. తాము ఎంతో తెలివిగలవారమని భావించి పక్కా ప్లాన్తో హత్యలు చేస్తున్నప్పటికీ, పోలీసుల నుంచి తప్పించుకోలేమనే నిజాన్ని మరిచిపోతున్నారు.
తాజాగా, ఇలాంటిదే మరో ఘటన జరిగింది. కోల్కతా హౌరాలో ఓ మహిళ, తన భర్తను దారుణంగా హత్య చేసింది. భర్తకు వైరల్ ఫీవర్ రావడంతో జ్వరానికి వాడాల్సిన మందులకు బదులుగా ఆమె ఏకంగా క్యాన్సర్ చికిత్సలో వినియోగించే మందులను అందించి అతను మరణించేందుకు కారణమైంది. ఈ హత్యలో ఆమె ప్రియుడు ఫార్మసిస్ట్ హస్తం ఉంది. వీరిద్దర్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
Also Read
- Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
- Shabad Murders Case: షాబాద్ హత్యల కేసులో ట్విస్ట్.. సైకో రాజ్కుమార్ మృతదేహం లభ్యం..
- Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
- Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
Read Also: Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. మరో 6 నెలల తర్వాతే భూమి పైకి..
నసీమ్ సర్దార్ అనే వస్త్ర వ్యాపారి దాదాపుగా 3 వారాలుగా వైరల్ ఫీవర్తో బాధపడుతున్నాడు. అతని భార్య సహినా పర్విన్, అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి బదులతో ఆమెతో సంబంధం ఉన్న స్థానిక ఫార్మాసిస్ట్ షేక్ మోర్సెలిమ్తో కలిసి హత్యకు ప్లాన్ చేసింది. వీరిద్దరు నసీమ్ జ్వరానికి క్యాన్సర్ చికిత్సలో వాడే కీమోథెరపీ డ్రగ్స్ ఇచ్చారు. దీంతో నసీమ్ పరిస్థితి విషమించడంతో స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అతని అవయవాలు విఫలమై మరణించారు.
సాధారణ వైరల్ జ్వరానికి అవయవాలు విఫలం కావడం ఏంటనే అనుమానంతో డాక్టర్లు అనుమానించి, అతడికి ఇచ్చిన మందులు ఏంటని ప్రశ్నించారు. అయితే, అందుకు పర్విన్ అవన్నీ ఆయన వేసుకున్నాడని చెప్పింది. ఆ తర్వాత విచారణలో ఫార్మసిస్ట్ మోర్సెలిమ్ నోటి ద్వారా తీసుకునే కీమోథెరపీ మందుల్ని ఇచ్చినట్లు తేలింది. ఈ హత్యతో ఆగ్రహంలో ఉన్న స్థానికులు సహినపై దాడి చేశారు. మోర్సెలిమ్ ఇల్లు, ఫార్మసీ మరియు మోటార్సైకిల్ను ధ్వంసం చేసి తగులబెట్టారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు, ఆర్ఏఎఫ్ సిబ్బందిని రంగంలోకి దించారు.
తాజావార్తలు
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Faridabad Mystery Death: కారులో నుంచి రక్తం.. కాలువ వద్ద దారుణం.. మహిళ చేతులు కట్టేసి..
-
TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!
-
UPSC Recruitment: అలెర్ట్..అలెర్ట్.. UPSC నుంచి జాబ్ నోటిఫికేషన్..!
-
Lenin Monday Test : అయ్యగారు ఇప్పట్లో ఆగేలా లేరు.. సోమవారం సూపర్ హోల్డ్
ట్రెండింగ్
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!