Hotel Staff Attack: రెచ్చిపోయిన హోటల్ సిబ్బంది.. ఒకరి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో ఘోరం జరిగింది. హోటల్ సిబ్బంది రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు. మహ్మద్ హుస్సేన్ అనే బాలుడిని కర్రలతో దాడి చేశారు. హోటల్ సిబ్బంది దాడి లో తీవ్రంగా గాయపడ్డ బాలుడు అనంతరం ఆస్పత్రిలో మరణించాడు. దాడిలో గాయపడ్డ మహ్మద్ హుస్సేన్ ని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహ్మద్ హుస్సేన్ మృతి చెందాడు.
మహ్మద్ హుస్సేన్ తమ్ముడిపై గంజి పోశారు హోటల్ లో పని చేసే సిబ్బంది. తమ్ముడి పై గంజి ఎందుకు పోసారని హోటల్ సిబ్బందిని నిలదీశాడు మహ్మద్ హుస్సేన్. దీంతో హోటల్ సిబ్బందికి మహ్మద్ హుస్సేన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా రెచ్చిపోయిన సిబ్బంది దాడి చేశారు. మహ్మద్ హుస్సేన్ పై మూకుమ్మడిగా దాడి చేశారు సిబ్బంది. సిబ్బంది దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహ్మద్ హుస్సేన్ మృతిచెందడంతో వివాదం ముదిరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. దాడికి పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. చిన్న గొడవలకే దాడులు చేయడం, అవతలి వ్యక్తుల మరణానికి కారణం కావడం కలకలం రేపుతోంది.
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
అధిక వడ్డీల పేరుతో..
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధిక వడ్డీలు,చిట్టీల పేరుతో ఘరానా మోసం బయటపడింది. అధిక వడ్డీలు ఆశ చూపి 3 కోట్ల వరకూ మోసం చేసింది గజ్జి సుజాత అనే మహిళ. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని బాధితులు అడుగుతుండటంతో ఆత్మహత్య చేసుకుంటానని సుజాత బెదిరింపులకు పాల్పడింది. దీంతో లబోదిబోమంటున్నారు బాధితులు. సుమారు 100 మంది వరకు బాధితులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో గజ్జి సుజాత మోసంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు హయత్ నగర్ పోలీసులు.
తాజావార్తలు
-
Story Board : ట్రంప్ తలనొప్పిని రెండున్నరేళ్లు భరించక తప్పదా..?
-
BRICS Trade Unions Summit : హైదరాబాద్లో బ్రిక్స్ ట్రేడ్ యూనియన్స్ సమ్మిట్
-
TMC: హెడ్ క్వార్టర్స్ కోల్పోయిన మమతా బెనర్జీ.. తృణమూల్ సంక్షోభం తీవ్రం..
-
Khamenei: ఖమేనీ అంత్యక్రియల్లో హృదయ విదారక దృశ్యం.. 14 నెలల మనవరాలి పార్థివదేహం
-
OTR: తాండూరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే vs ఎమ్మెల్సీ పోరు ముదిరిందా?
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్లో లాంచ్..!