Hotel Staff Attack: రెచ్చిపోయిన హోటల్ సిబ్బంది.. ఒకరి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో ఘోరం జరిగింది. హోటల్ సిబ్బంది రెచ్చిపోయి దాడికి పాల్పడ్డారు. మహ్మద్ హుస్సేన్ అనే బాలుడిని కర్రలతో దాడి చేశారు. హోటల్ సిబ్బంది దాడి లో తీవ్రంగా గాయపడ్డ బాలుడు అనంతరం ఆస్పత్రిలో మరణించాడు. దాడిలో గాయపడ్డ మహ్మద్ హుస్సేన్ ని హుటాహుటిన ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మహ్మద్ హుస్సేన్ మృతి చెందాడు.
మహ్మద్ హుస్సేన్ తమ్ముడిపై గంజి పోశారు హోటల్ లో పని చేసే సిబ్బంది. తమ్ముడి పై గంజి ఎందుకు పోసారని హోటల్ సిబ్బందిని నిలదీశాడు మహ్మద్ హుస్సేన్. దీంతో హోటల్ సిబ్బందికి మహ్మద్ హుస్సేన్ కు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక్కసారిగా రెచ్చిపోయిన సిబ్బంది దాడి చేశారు. మహ్మద్ హుస్సేన్ పై మూకుమ్మడిగా దాడి చేశారు సిబ్బంది. సిబ్బంది దాడిలో తీవ్రంగా గాయపడ్డ మహ్మద్ హుస్సేన్ మృతిచెందడంతో వివాదం ముదిరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. దాడికి పాల్పడ్డ వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. చిన్న గొడవలకే దాడులు చేయడం, అవతలి వ్యక్తుల మరణానికి కారణం కావడం కలకలం రేపుతోంది.
Also Read
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
- DELHI: సిగరేట్కు అగ్గిపుల్ల ఇవ్వలేదని యువకుడి దారుణహత్య..
అధిక వడ్డీల పేరుతో..
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అధిక వడ్డీలు,చిట్టీల పేరుతో ఘరానా మోసం బయటపడింది. అధిక వడ్డీలు ఆశ చూపి 3 కోట్ల వరకూ మోసం చేసింది గజ్జి సుజాత అనే మహిళ. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని బాధితులు అడుగుతుండటంతో ఆత్మహత్య చేసుకుంటానని సుజాత బెదిరింపులకు పాల్పడింది. దీంతో లబోదిబోమంటున్నారు బాధితులు. సుమారు 100 మంది వరకు బాధితులు హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో గజ్జి సుజాత మోసంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు హయత్ నగర్ పోలీసులు.
తాజావార్తలు
-
Semicon India 2026: సెమీకాన్ ఇండియా 2026 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సెమీకండక్టర్ రంగంలో భారీ సంస్కరణలు
-
CM Chandrababu: వారణాసిలో చంద్రబాబు పర్యటన.. కాశీ విశ్వనాథుడికి ప్రత్యేక పూజలు.. రాజ్నాథ్, యోగితో కలిసి..
-
Movies Postponed: చివరి నిమిషంలో టాలీవుడ్లో చిన్న సినిమాలు పోస్ట్పోన్..!
-
Prabhas-Spirit: మరింత డార్క్ అండ్ బోల్డ్.. యానిమల్కు మించి స్పిరిట్.. థియేటర్లు తగలబడిపోవడం ఖాయం!
-
Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!