East Godavari: భార్యను కాపురానికి పంపించని అత్తమామలు.. హతమార్చిన అల్లుడు!
- తూర్పు గోదావరి జిల్లా నల్లజర్లలో దారుణం..
- భార్యను కాపురానికి పంపడం లేదని కక్షగట్టిన అల్లుడు..
- అత్తమామలపై కత్తితో దాడి చేసి హత్య చేసిన అల్లుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
East Godavari: తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఘంటావారి గూడెంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యను కాపురానికి పంపించడం లేదనే కోపంతో ఓ అల్లుడు తన అత్తమామలను దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. అయితే, నల్లజర్లకు చెందిన ఏకుల బాబురావు, ఏకుల శారద దంపతుల ఇంటికి వారి అల్లుడు రామకోటేశ్వరరావు వచ్చాడు. భార్యను తనతో పాటు పంపించాలనే విషయంపై గొడవకు దిగిన అతడు తన వెంట తెచ్చుకున్న కత్తితో వారిపై దాడికి దిగాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబురావు, శారద అక్కడికక్కడే మృతి చెందారు.
Read Also: Neha Sharma : దర్శకురాలిగా ఎంట్రీ ఇస్తున్న రామ్ చరణ్ హీరోయిన్..
Also Read
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
- Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
అయితే, రామకోటేశ్వరరావుకు 14 ఏళ్ల క్రితం వివాహం అయింది. ఇటీవల భార్యాభర్తల మధ్య విభేదాలు పెరిగి, భార్య ఆయన నుంచి దూరంగా ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రామకోటేశ్వరరావు ఆయన భార్య ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతంలో నివసిస్తున్నట్లు సమాచారం. హత్య తర్వాత రామకోటేశ్వరరావు సంఘటనా స్థలాన్ని వదిలి వెళ్లకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే సంఘటన ప్రదేశానికి చేరుకున్న నల్లజర్ల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర భయాందోళన కొనసాగుతుంది.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!