Honey Trap: శృంగార వల.. 100 మంది బలి.! కరీంనగర్ దంపతుల గలీజ్ దందా.!
- సోషల్ మీడియా వలలో శృంగార ఉచ్చులు
- ఇంట్లో వీడియోలు.. తర్వాత బ్లాక్మెయిల్
- వంద మందికి పైగా బలి
- లారీ వ్యాపారి ఫిర్యాదుతో బండారం బయట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honey Trap: విలాసవంతమైన జీవితం గడపాలి.. అప్పుల నుంచి త్వరగా బయటపడాలి.. దీనికోసం ఆ దంపతులు ఎంచుకున్న మార్గం వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. సామాజిక మాధ్యమాలను అడ్డం పెట్టుకుని, శృంగారాన్ని ఎరగా వేసి, ఏకంగా వంద మందికి పైగా పురుషులను బురిడీ కొట్టించిన దంపతుల దందా వెలుగులోకి వచ్చింది. లక్షల రూపాయలు వసూలు చేస్తూ సాగుతున్న వీరి ‘బ్లాక్ మెయిల్’ పర్వానికి కరీంనగర్ పోలీసులు చెక్ పెట్టారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకటరావు పేటకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి కరీంనగర్లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ చేసేవాడు. మంచిర్యాలకే చెందిన 29 ఏళ్ల మహిళతో అతనికి వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అంతా సజావుగా సాగుతుందనుకున్న సమయంలో, వ్యాపారంలో భారీగా నష్టాలు వచ్చాయి. దీనికి తోడు అప్పు చేసి కొన్న ప్లాటు ఈఎంఐలు కట్టడం భారంగా మారింది. సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో ఈ భార్యాభర్తలు కలిసి ఒక ప్రమాదకరమైన నేరపూరిత ప్లాన్ వేశారు.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
వీరిద్దరూ కలిసి సోషల్ మీడియాను తమ వేదికగా చేసుకున్నారు. భార్య ఫోటోలను, ఆకర్షణీయమైన పోస్టులను సామాజిక మాధ్యమాల్లో పెట్టి యువకులకు, వ్యాపారులకు వల వేయడం ప్రారంభించారు. ఆమె మాటలకు ముగ్ధులైన పురుషులను కరీంనగర్లోని తమ అపార్ట్మెంట్కు పిలిపించేది. బాధితులతో ఆమె సన్నిహితంగా ఉన్న సమయంలో, భర్త అత్యంత రహస్యంగా ఆ దృశ్యాలను వీడియో తీసేవాడు.
వీడియోలు చేతికి చిక్కగానే అసలు డ్రామా మొదలయ్యేది. “మీ వీడియోలు మా దగ్గర ఉన్నాయి.. చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే సోషల్ మీడియాలో పెడతాం.. మీ కుటుంబ సభ్యులకు పంపిస్తాం” అంటూ భర్త బాధితులను బెదిరించేవాడు. పరువు పోతుందనే భయంతో బాధితులు అడిగినంత ఇచ్చేవారు. ఇలా గత మూడేళ్లలో సుమారు 100 మందికి పైగా పురుషులను ఈ జంట బ్లాక్ మెయిల్ చేసినట్లు సమాచారం.
ఇటీవల కరీంనగర్కు చెందిన ఒక లారీ వ్యాపారి వీరి వలలో చిక్కాడు. అతని నుండి ఇప్పటికే ఈ దంపతులు ఏకంగా రూ. 13 లక్షలు వసూలు చేశారు. అయినప్పటికీ వారి దాహం తీరలేదు. మరో రూ. 5 లక్షలు కావాలంటూ సదరు వ్యాపారిని వేధించడం మొదలుపెట్టారు. ఇక భరించలేకపోయిన బాధితుడు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. పక్కా ప్లాన్తో ఈ కిలాడీ దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న ఫోన్లు, వీడియో సాక్ష్యాలను పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వీరి దందాతో ఇంకెంత మంది బలైపోయారనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సోషల్ మీడియాలో తెలియని వ్యక్తుల నుండి వచ్చే పరిచయాలు, ఆహ్వానాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వేధింపులకు గురైతే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
Iran Crisis: అగ్రరాజ్యం దెబ్బకు ఇరాన్ గజగజ.. ఖమేనీ చూపు దుబాయ్ వైపు!
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..