Serial killer: ఓరి దేవుడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సీరియల్ కిల్లర్.. 35 ట్రైన్లలో అత్యాచారాలు
- రైళ్లలో వికలాంగుల భోగీలో చొరబడి హత్య చేస్తున్న కరంవీర్..
- గుజరాత్లోని వల్సాద్లో ఈ సీరియల్ రైల్వే కిల్లర్ అరెస్ట్..
- పీటీ వారెంట్పై హైదరాబాద్ కు తీసుకురానున్న రైల్వే పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Serial killer: ఓ సైకో ట్రైన్స్ లో ప్రయాణిస్తూ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వరుస హత్యలకు పాల్పడుతున్నాడు. ఇతడు తెలివిగా రైళ్లలోని లాస్ట్ భోగీలో ఉండే వికలాంగ కంపార్ట్మెంట్లోకి ఎక్కి ప్రయాణికులపై అత్యాచారం, హత్యలు, దోపిడి చేయడానికి అలవాటు పడ్డాడు. కేవలం 35 రోజుల్లో ఎక్స్ప్రెస్ రైళ్లల్లో తిరుగుతూ.. ఐదు రాష్ట్రాల్లో ఐదు మర్డర్లు చేశాడు. గుజరాత్లోని వల్సాద్ పోలీసులు సోమవారం (నవంబర్ 26) ఎట్టకేలకు ఈ సీరియస్ కిల్లర్ ను పట్టుకున్నారు. వల్సాద్ ఎస్పీ డాక్టర్ కరణ్రాజ్ సింగ్ వాఘేలాను నిందితుడి యొక్క వివరాలను తెలిపాడు.
Read Also: Nayanthara Case: నయనతారపై సివిల్ కేసు నమోదు!
Also Read
ఈ సీరియల్ కిల్లర్ పేరు భోలో కరమ్వీర్ జాట్.. హర్యానాకు చెందిన వ్యక్తి.. గతంలో రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ల్లో అనేక నేరాలకు పాల్పడ్డాడు. ఇటీవల రైల్వేలో సీరియల్ కిల్లర్గా మారిపోయాడు. పోలీసుల విచారణలో ఇతగాడి నేరాల చిట్టా మొత్తం బయటకు వచ్చింది. ఆదివారం ఉదయం సికింద్రాబాద్లోని ఓ రైలులోని వికలాంగుల పెట్టెలో మహిళ మృతదేహం తీవ్ర కలకలం రేపింది. దీంతో సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులకు వల్సాద్ పోలీసులు సమాచారం అందజేయగా.. ఈ హత్య తానే చేసినట్లు కరమ్వీర్ ఒప్పుకున్నాడు. దీంతో నగర పోలీసులు పీటీ వారెంట్పై కరమ్వీర్ను హైదరాబాద్కి తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!