Ghazipur Triple Murder: ప్రేయసి కోసం 15 ఏళ్ల బాలుడి దారుణం.. తల్లిదండ్రులతో పాటు సోదరుడి హత్య..
- ప్రేమసి కోసం 15 ఏళ్ల బాలుడు దారుణం.. తల్లిదండ్రులతో సహా సోదరుడి హత్య..
- పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కిరాతకం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghazipur Triple Murder: గత రెండేళ్లుగా ప్రేమిస్తున్న తన స్రేయసితో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో తల్లిదండ్రులను, సోదరుడిని అత్యంత దారుణంగా 15 ఏళ్ల బాలుడు హత్య చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ జిల్లాలో చోటు చేసుకుంది. హత్యలు చేసినట్లు బాలుడు అంగీకరించడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జూలై 7-8 రాత్రి ఘాజీపూర్ జిల్లాలోని నంద్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుసుమ్హికలా గ్రామాన్ని ట్రిపుల్ మర్డర్ కేసు కుదిపేసింది. గొంతుకోసం హత్యలు చేసేందుకు ఉపయోగించిన పదునైన ఆయుధాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Vijayawada: విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం రసాభాస..
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
ఘాజీపూర్ ఎస్పీ ఓంవీర్ సింగ్ మాట్లాడుతూ.. నేరస్తుడిని అరెస్ట్ చేశామని, తండ్రి మున్షి బింద్(45),తల్లి దేవంతి బింద్(40) , అతని అన్నయ్య ఆశిష్ బింద్(20) గొంతు కోయడానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నామని, చాలా రోజుల క్రితమే హత్యలు చేయాలని నిర్ణయించుకున్నట్లు, దాని కోసం వ్యవసాయ పనుల్లో గడ్డి కోసేందుకు వాడే ‘ఖుర్పా’ అనే ఆయుధాన్ని కొనుగోలు చేసినట్లు బాలుడు వెల్లడించినట్లు తెలిపారు. జూలై 7న ముగ్గురుని హత్య చేయడానికి విఫలయత్నం చేశానని, అయితే ధైర్యం రాకపోవడంతో ఆ పని చేయలేదని చెప్పాడు.
ఆదివారం రాత్రి నిందితుడైన బాలుడు తన అన్న ఆశిష్తో గ్రామంలో ప్రీ వెడ్డింగ్ ఫంక్ష,న్ ఆర్కెస్ట్రా చూసేందుకు వెళ్లాడు. మంగళవారం రాత్రి 11 ప్రాంతంలో ఇంటికి తిరిగి వచ్చారు. అంతా నిద్ర పోతున్న సమయంలో మద్యం సేవించి తండ్రి, తల్లి, సోదరుడి గొంతు కోశాడు. నేరం చేసిన తర్వాత దాడికి ఉపయోగించిన ఆయుధాన్ని దాచేసి, ఏం తెలియని విధంగా అదే ఆర్కెస్ట్రా షో చూసేందుకు వెళ్లాడు. బుధవారం తెల్లవారుజామున 1.45 గంటలకు వచ్చి తన వారిని ఎవరో చంపారని స్థానికులకు చెప్పాడు. మున్షీ సోదరుడు రామ్ ప్రకాష్ బింద్ తన గ్రామానికి చెందిన రాధే బింద్ మరియు అతని సహచరులు ముగ్గురిని హత్య చేశారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అయితే, అన్ని కోణాల్లో విచారించిన పోలీసులు, మున్షి చిన్న కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత దారుణమైన హత్యల గురించి వెల్లడించారు. బుధవారం బాలుడిని జువైనల్ కోర్టులో హాజరుపరిచారు.
తాజావార్తలు
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
-
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..