INDIA Alliance: ఇక ఇండియా కూటమి సంగతి అంతేనా.. కాంగ్రెస్కి ‘హ్యాండ్’ ఇస్తున్న మిత్రులు..
- ఇండియా కూటమికి తీవ్ర విభేదాలు..
- కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్న మిత్రపక్షాలు..
- మమతా బెనర్జీకి నాయకత్వం అప్పచెప్పాలని డిమాండ్..
- ఒక్కొక్కరిగా చేజారిపోతున్న పార్టీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
INDIA Alliance: 2024 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ఒకింత బీజేపీని అడ్డుకోగలిగింది . కానీ, అధికారంలోకి రాకుండా ఆపలేకుండా పోయింది. కూటమిగా బీజేపీ వ్యతిరేక పక్షాలు కాస్త సక్సెస్ అయినట్లే కనిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత ప్రతిపక్ష హోదా దక్కించుకోవడం ఊరటనిచ్చే అంశం. కాంగ్రెస్ గత వైభవాన్ని దక్కించుకుంటుందని అంతా రాజకీయ విశ్లేషకులు, మీడియా కథనాలు అంచనా వేశాయి. తీరా.. షరా మమూలే అన్న రీతిలో కాంగ్రెస్ పరాజయాలు కంటిన్యూ అవుతున్నాయి. కాంగ్రెస్ తో పాటు దాని మిత్రపక్షాలు కూడా ఘోర పరాజయాలను మూటకట్టుకున్నాయి.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అంతా కాంగ్రెస్దే అనుకున్నారు. తీరా ఫలితాలు మాత్రం భిన్నంగా వచ్చాయి. వారి ఓవర్ కాన్ఫిడెన్స్ వారిని ముంచిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ మూడోసారి ఘన విజయం సాధించింది. ఇక మహారాష్ట్ర ఎన్నికల్లో అయితే, మేజర్ పార్ట్నర్గా ఉన్న కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. 288 స్థానాలు ఉన్న అసెంబ్లీలో 233 స్థానాలను బీజేపీ కూటమి గెలుచుకుంది. కాంగ్రెస్ 100కి పైగా స్థానాల్లో పోటీ చేసినా కేవలం 16 స్థానాలకు మాత్రమే సంపాదించింది. ఇక జార్ఖండ్ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిచినప్పటికీ, అది పూర్తిగా జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం), సీఎం హేమంత్ సొరెన్ ఖతాల్లో పడిపోయింది. కాంగ్రెస్ సొంత బలం కన్నా జేఎంఎం బలంలోనే గెలిచిందనేది సత్యం. ఎన్నికల్లో మేజర్ పార్టీగా ఉండీ, దానికి తగ్గట్లుగా ఫలితాలు ఉండకపోవడంపై ఇండియా కూటమిలోని మిత్రపక్షాలు కాంగ్రెస్ని విమర్శిస్తున్నాయి.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
ఇండియా కూటమిలో బీటలు..
ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ పనితనంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కొక్కరుగా మిత్రపక్షాలు ‘హ్యాండ్’ ఇస్తున్నాయి. ఇండియా కూటమి నేతృత్వాన్ని మమతా బెనర్జీ తీసుకోవాలనే ఒక వాదన వినిపిస్తోంది. ఇందుకు తాను సిద్ధమని ఆమె ఇప్పటికే ప్రకటించింది. సమాజ్వాదీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన, ఆర్జేడీ, ఎన్సీపీ శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్, ఆప్ ఇలా ప్రతీ పార్టీ కూడా కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ మాత్రం ఈ పరిణామాలను వ్యతిరేకిస్తూనే ఉంది.
పార్టీల అభిప్రాయాలు ఏంటి..?
ఆర్జేడీ:
తేజస్వీ యాదవ్ పార్టీ ఆర్జేడీ కూడా ఇండియా కూటమిలో తన అభిప్రాయాన్ని చెప్పింది. కూటమిని నడిపించే చొరవ లాలూ ప్రసాద్ యాదవ్కి ఉందని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. ఇండియా కూటమి రూపశిల్పి లాలూ అని చెప్పారు.
సమాజ్వాదీ పార్టీ:
సమాజ్ వాదీ పార్టీ ఇప్పటికే కాంగ్రెస్ తీరుపై గుర్రుగా ఉంది. ఇండియా కూటమిని నడిపించే సమర్థవంతమైన వ్యక్తి మమతా బెనర్జీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.
సీపీఐ:
కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా అన్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాల మాట విని ఉంటే, ఈ రోజు వేరే ఫలితాలు వచ్చేవని చెప్పారు.
ఎన్సీపీ శరద్ పవార్:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటనపై సుప్రియా సూలే మాట్లాడారు. మమతా బెనర్జీ ఇండియా కూటమిలో అంతర్భాగం. ఆమె దేశంలో గొప్ప నాయకురాలు. ఆమె నాయకత్వం వహించాలనునకుంటే వారికి మద్దతు ఇస్తాం.
శివసేన-ఠాక్రే:
మమతా అభిప్రాయం మాకు తెలుసు. ఆమె కూటమిలో ప్రధాన భాగస్వామి కావాలని మేము కోరుకుంటున్నాము. త్వరలో ఆమెని కలవడానికి కోల్కతా వెళ్తామని సంజయ్ రౌత్ చెప్పారు.
ఆప్:
ఆప్ ఇప్పటికే కాంగ్రెస్తో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తోంది. వచ్చే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు ఉండడని స్పష్టం చేసింది.
కాంగ్రెస్ ఏం చెబుతోంది..?
కాంగ్రెస్ ఎంపీ తారిఖ్ అన్వర్ మమతా నాయకత్వాన్ని వ్యతిరేకించారు. నాయకత్వం అనేది కూటమి ద్వారా నిర్ణయించబడుతుంది. కూటమిలో ఏ నిర్ణయమైనా ఏకగ్రీవంగా తీసుకోబడుతుంది. ఏ ఒక్క పార్టీ నిర్ణయం కాదు. కూటమిలో 17-18 పార్టీలు ఉన్నాయి. ఏ నిర్ణయమైనా ఏకాభిప్రాయంతోనే తీసుకుంటారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!