Vijayawada: నమ్మకస్థురాలే రక్తం పారించింది.. అమెరికాలోని కుమార్తె మాట్లాడుతుండగా..!
- నమ్మకస్థురాలే రక్తం పారించింది
- వివాహేతర సంబంధాన్ని మానుకోమనడమే శాపమైంది
- వీడిన కృష్ణా జిల్లా గన్నవరం మర్డర్ మిస్టరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటి పక్కనే నమ్మకంగా ఉన్నారు.. పొరుగు వారే కదా..!! అని నమ్మి ఇంట్లోకి రానిస్తే.. ఆ వృద్ధురాలినే హత్య చేశారు. డబ్బులు అప్పు అడిగితే ఇవ్వలేదన్న కారణం ఒకటైతే.. తన వివాహేతర బంధానికి అడ్డు వస్తోందనే కారణం మరొకటి. మొత్తంగా ఆ వృద్ధురాలిని.. కన్న కొడుకుతో కలిసి మరీ చంపేసింది ఓ మహిళ. ఈ ఘటన కృష్ణా జిల్లా గన్నవరంలో కలకలం సృష్టించింది. ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వృద్ధురాలి పేరు కాజ రజిత కుమారి. కృష్ణా జిల్లా గన్నవరం దావాజీ గూడెం రోడ్డులోని జీఆర్కే ప్యారడైజ్ భవనంలో ఒంటరిగా నివసిస్తున్నారు. ఆమె భర్త చనిపోగా ఇద్దరు కుమార్తెలు అమెరికాలో స్థిరపడ్డారు. రజిత శ్రీనగర్ కాలనీలో పిండి మర నడుపు కొంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదే కాలనీలో నివాసం ఉండే పోలవరపు సుష్మ, ఆమె కుమారుడు పోలవరపు అజయ్ కొంతకాలంగా రజిత వద్ద అప్పులు తీసుకొని చిట్టీలు కడుతూ సన్నిహితంగా ఉండేవారు. సుష్మ, ఆమె కుమారుడు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నామని అప్పుగా డబ్బులు కావాలని కొంతకాలంగా రజితను అడిగారు. రజిత ఇస్తానని చెబుతూ పదే పదే మాటదాటేస్తూ వచ్చింది.
Also Read
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
- HYD BOY MISSING: మిస్టరీ డెత్.. ఆత్మహత్య చేసుకున్నాడా? ప్రమాదవశాత్తు బావిలో పడ్డాడా.?
- HYD 21CR CHEATING: సైబర్ టోకరా @ 21Cr
- Shabad Serial Killer: ఆరుగురిని హత్య చేసిన షాబాద్ సైకో కిల్లర్.. కథ ఇక్కడితో ముగియలేదు!
మరోవైపు.. గన్నవరానికి చెందిన ఓ న్యాయవాదితో సుష్మకు వివాహేతర సంబంధం ఉంది. ఐతే ఈ విషయం తెలిసిన రజిత.. అది మంచిది కాదని.. ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. కానీ అదే ఆమె పాలిట శాపమైంది. రజిత.. ఆ న్యాయవాదిని సైతం హెచ్చరించింది. ఈ కారణంగా అతడు సుష్మకు దూరంగా ఉంటున్నాడనే అపోహతో ఆమెను హత్య చేయాలని సుష్మ ప్లాన్ చేసింది. ఇందుకోసం కొడుకు సాయం తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే మే 24న రాత్రి 11 గంటల సమయంలో రజిత.. అమెరికాలో ఉన్న తన కుమార్తెతో ఫోన్లో మాట్లాడుతుండగా ఎవరో కాలింగ్ బెల్ కొట్టారని ఫోన్ కట్ చేశారు. అనంతరం కూతురు తిరిగి ఫోన్ చేస్తే కలవలేదు. ఉదయాన్నే పని మనిషి వచ్చి చూస్తే బెడ్ రూమ్లో రజిత రక్తపు మడుగులో మృతి చెంది కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమార్తె, బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
రజిత మృతదేహం పైన పలు గాయాలు కనిపించాయి. అదీ కాకుండా.. ఇంట్లోని బంగారం, నగదు కనిపించలేదని పోలీసులు గుర్తించారు. అపార్ట్ మెంట్ సీసీ కెమెరాలు పరిశీలిస్తే సుష్మ, ఆమె కుమారుడు అజయ్ ప్లాట్లోకి వచ్చినట్లు కనిపించింది. దీంతో ఇద్దరినీ పట్టుకుని తమదైన శైలిలో విచారించారు. వాళ్ల అనుమానమే నిజమైంది. తల్లి, కొడుకు ఇద్దరూ కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు గుర్తించారు. నిందితుల నుంచి రూ.66 లక్షల సొత్తు రికవరీ చేశారు పోలీసులు. మృతురాలు రజితను హత్య చేసి ఆమె వద్ద ఉన్న 300 గ్రాముల బంగారం, రూ.1.90 లక్షల నగదు ఎత్తుకెళ్లినట్లు తేలింది. నిందితుల నుంచి నేరానికి వినియోగించిన ఓ స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు పోలవరపు ఆజయ్పై ఉయ్యూరు టౌన్లో సస్పెక్ట్ షీట్ ఉన్నట్లు గుర్తించారు.
మొత్తంగా తెలిసిన వ్యక్తులే కదా అని నమ్మిన పాపానికి రజిత ప్రాణాలు తీసేశారు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదోనని స్థానికులు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. సుష్మ, ఆమె కొడుకు అజయ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
El Nino: 150ఏళ్లలో తొలిసారి.. మహా విధ్వంసం తప్పదు! భయపెడుతున్న సైంటిస్టుల అంచనా
-
Star Daughters Debut : కొడుకుల టాస్క్ ఫినీష్.. ఇప్పుడు కూతుళ్ల వంతు
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
Leonardo DiCaprio: ఒక్క టిప్తో వెయిటర్ జీవితాన్ని మార్చిన ‘టైటానిక్’ హీరో… కన్నీళ్ళు పెట్టించిన ఉదారత
-
Vivo T5 Lite: వివో T5 లైట్ 44W 5G ఫోన్ రిలీజ్.. 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, MediaTek Dimensity 6300 ప్రాసెసర్
ట్రెండింగ్
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!