Tragedy : పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య
- గద్వాల జిల్లాలో మేఘాలయ తరహా మర్డర్
- గత నెల 17న కర్నూలుకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్న తేజేశ్వర్
- తేజేశ్వర్ హత్య వెనుక భార్య ఉందని అనుమానాలు
- కర్నూలులోని ఓ బ్యాంకు మేనేజర్ పాత్ర ఉందని బంధువుల ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : ఇటీవల మేఘాలయలో చోటు చేసుకున్న రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న హత్య కేసు సంచలనంగా మారింది. పెళ్లైన కొన్ని రోజులకే భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఈ ప్రాంతాన్ని షాక్కు గురి చేసింది. 33 ఏళ్ల తేజస్విన్ అనే సర్వేయర్ను ప్లాన్ చేసిన విధంగా కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజస్విన్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావు ఈ ఘోర నేరం వెనుక ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
గత నెల 17న తేజస్విన్ను “భూమి కొలవాలి” అంటూ ముగ్గురు వ్యక్తులు పిలిపించారు. పూడూరు శివారులో కారులోనే అతడిని కత్తులతో దారుణంగా హతమార్చారు. అనంతరం అతడి మృతదేహాన్ని నంద్యాల జిల్లా పాణ్యం ప్రాంతంలో పడేసి పరారయ్యారు. కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావుతో తేజస్విన్ అత్త సుజాత గత కొంత కాలంగా సహజీవనం చేస్తోంది. అంతేకాకుండా.. ఐశ్వర్యతో కూడా తిరుమల్ రావుకు అక్రమ సంబంధం కొనసాగుతోంది. అయితే.. ఇద్దరి మధ్య పెరిగిన అనుబంధం నేపథ్యంలో తేజస్విన్ అడ్డంకిగా మారాడని భావించి, అతడి హత్యకు పాల్పడ్డారనే అనుమానం బలంగా వినిపిస్తోంది.
Also Read
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
Chiranjeevi : ఓటిటి ఎంట్రీపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
గతంలో ఐశ్వర్యను తిరుమల్ రావు పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. తిరుమల్ రావు భార్య నిరాకరణ కారణంగా ఐశ్వర్యను తాత్కాలికంగా వెనక్కి పంపినట్టు తెలిసింది. అయితే, ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, అన్ని పాత్రలు బయటపడే వరకు ఈ కేసు మరింత మిస్టరీగా మారనుంది. వివాహేతర సంబంధం, ఆస్తి లావాదేవీలు, అనుభవాలు, అనుమానాలు కలిసి ఒక అమాయకుడి జీవితాన్ని బలిగొన్నాయి. మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ ఘటనను తలపించేలా, ఇది కూడా ప్రేమ పేరుతో జరిగిన పాశవిక నేరంగా మారింది.
Vijayawada: గోల్డ్ మార్కెట్లో 650గ్రా.ల బంగారంతో వ్యక్తి పరార్..!
తాజావార్తలు
-
Ananya Panday: లైగర్ బ్యూటీకి కష్టకాలం.. రెండేళ్ల ప్రేమకు గుడ్బై!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Uttar Pradesh: ఘోర విమాన ప్రమాదం.. పైలట్, కో-పైలట్ మృతి
-
Nepal Floods: 175కు చేరిన మృతుల సంఖ్య.. వరదల్లో 300 మందికి పైగా భారతీయులు గల్లంతు!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
ట్రెండింగ్
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?
-
Sugar Prices: పండగ వేళ షాక్.. ఒకరికి 2 కేజీలు మాత్రమే.. చక్కెర కొనుగోళ్లపై పరిమితి!
-
Dimensity 7100 చిప్, కొత్త Colour Fusion డిజైన్తో వచ్చేస్తున్న Ai+ Nova 2 Power..!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!