Tragedy : పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య
- గద్వాల జిల్లాలో మేఘాలయ తరహా మర్డర్
- గత నెల 17న కర్నూలుకు చెందిన యువతిని పెళ్లి చేసుకున్న తేజేశ్వర్
- తేజేశ్వర్ హత్య వెనుక భార్య ఉందని అనుమానాలు
- కర్నూలులోని ఓ బ్యాంకు మేనేజర్ పాత్ర ఉందని బంధువుల ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy : ఇటీవల మేఘాలయలో చోటు చేసుకున్న రాజా రఘువంశీ హత్య కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న హత్య కేసు సంచలనంగా మారింది. పెళ్లైన కొన్ని రోజులకే భర్తను అతి దారుణంగా హత్య చేసిన ఘటన ఈ ప్రాంతాన్ని షాక్కు గురి చేసింది. 33 ఏళ్ల తేజస్విన్ అనే సర్వేయర్ను ప్లాన్ చేసిన విధంగా కత్తులతో పొడిచి హత్య చేసిన ఘటనలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తేజస్విన్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావు ఈ ఘోర నేరం వెనుక ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
గత నెల 17న తేజస్విన్ను “భూమి కొలవాలి” అంటూ ముగ్గురు వ్యక్తులు పిలిపించారు. పూడూరు శివారులో కారులోనే అతడిని కత్తులతో దారుణంగా హతమార్చారు. అనంతరం అతడి మృతదేహాన్ని నంద్యాల జిల్లా పాణ్యం ప్రాంతంలో పడేసి పరారయ్యారు. కెనరా బ్యాంకు మేనేజర్ తిరుమల్ రావుతో తేజస్విన్ అత్త సుజాత గత కొంత కాలంగా సహజీవనం చేస్తోంది. అంతేకాకుండా.. ఐశ్వర్యతో కూడా తిరుమల్ రావుకు అక్రమ సంబంధం కొనసాగుతోంది. అయితే.. ఇద్దరి మధ్య పెరిగిన అనుబంధం నేపథ్యంలో తేజస్విన్ అడ్డంకిగా మారాడని భావించి, అతడి హత్యకు పాల్పడ్డారనే అనుమానం బలంగా వినిపిస్తోంది.
Also Read
- Chittoor Horror: అసలు తల్లివేనా..? వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఏడేళ్ల కుమారుడికి చిత్రహింసలు..!
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
Chiranjeevi : ఓటిటి ఎంట్రీపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
గతంలో ఐశ్వర్యను తిరుమల్ రావు పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. తిరుమల్ రావు భార్య నిరాకరణ కారణంగా ఐశ్వర్యను తాత్కాలికంగా వెనక్కి పంపినట్టు తెలిసింది. అయితే, ప్రస్తుతం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, అన్ని పాత్రలు బయటపడే వరకు ఈ కేసు మరింత మిస్టరీగా మారనుంది. వివాహేతర సంబంధం, ఆస్తి లావాదేవీలు, అనుభవాలు, అనుమానాలు కలిసి ఒక అమాయకుడి జీవితాన్ని బలిగొన్నాయి. మేఘాలయలో జరిగిన రాజా రఘువంశీ ఘటనను తలపించేలా, ఇది కూడా ప్రేమ పేరుతో జరిగిన పాశవిక నేరంగా మారింది.
Vijayawada: గోల్డ్ మార్కెట్లో 650గ్రా.ల బంగారంతో వ్యక్తి పరార్..!
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?