AP Cyber Crime: రెట్టింపు డబ్బులంటూ మోసం.. మహిళ ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cyber Crime: తాము పెట్టే పెట్టుబడికి రెట్టింపు డబ్బులు వస్తాయంటే.. ఎవరైనా.. ఆలోచించకుండా ముందడుగు వేస్తారు.. కానీ, దాని మాటున మోసం ఉందేమో అని ఒక్క క్షణం ఆలోచించనవారే కంత్రీగాళ్ల బారినపడకుండా ఉంటారు.. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ.. టెలిగ్రామ్ యాప్లో మోసగాళ్ల వలలో చిక్కుకుంది.. రూ.100 ఇస్తే.. రూ.400 ఇస్తామంటూ ఆ మహిళను తమ ముగ్గులోకి దింపిన కేటుగాళ్లు.. మొదట చెప్పినట్టుగానే రూ.100కు రూ.400 ఇచ్చారు.. దీంతో.. రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మిన మహిళ.. క్రమంగా పెద్ద మొత్తంలో వారు చెప్పినట్టుగా పంపించింది.. కానీ, డబ్బులు తిరిగిరాకపోవడంతో.. చివరకు ప్రాణాలు తీసుకుంది..
Read Also: Delhi: మెట్రో పిల్లర్ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన స్రవంతి అనే 25 ఏళ్ల మహిళ.. ఓ టెలిగ్రామ్ యాప్ లో మోసపోయింది.. నిన్న మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.. అది గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది.. ఆమెకు తేజ ప్రణవి (6), హర్షవర్ధన్ రామ్ ( 4) అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అయితే, రూ.100 వేస్తే 400 రూపాయలు వస్తాయని చెప్పిన యాప్ నిర్వాహకులు.. ఈ నెల 17,18 తేదీల్లో రూ.100లు డబ్బులు పంపగా.. 400 రూపాయలు సదరు మహిళకు పంపించారు.. ఇక, రూ.10,000 వేస్తే రెట్టింపు రూ.20,000 వస్తాయని ఆశ చూపారు.. నిజమేనని నమ్మి ఇలా పలు దఫాలుగా రూ.1,35చ000 పోగొట్టుకుంది ఆ మహిళ.. చివరకు మోసపోయానని గ్రహించి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?