AP Cyber Crime: రెట్టింపు డబ్బులంటూ మోసం.. మహిళ ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cyber Crime: తాము పెట్టే పెట్టుబడికి రెట్టింపు డబ్బులు వస్తాయంటే.. ఎవరైనా.. ఆలోచించకుండా ముందడుగు వేస్తారు.. కానీ, దాని మాటున మోసం ఉందేమో అని ఒక్క క్షణం ఆలోచించనవారే కంత్రీగాళ్ల బారినపడకుండా ఉంటారు.. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ.. టెలిగ్రామ్ యాప్లో మోసగాళ్ల వలలో చిక్కుకుంది.. రూ.100 ఇస్తే.. రూ.400 ఇస్తామంటూ ఆ మహిళను తమ ముగ్గులోకి దింపిన కేటుగాళ్లు.. మొదట చెప్పినట్టుగానే రూ.100కు రూ.400 ఇచ్చారు.. దీంతో.. రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మిన మహిళ.. క్రమంగా పెద్ద మొత్తంలో వారు చెప్పినట్టుగా పంపించింది.. కానీ, డబ్బులు తిరిగిరాకపోవడంతో.. చివరకు ప్రాణాలు తీసుకుంది..
Read Also: Delhi: మెట్రో పిల్లర్ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
Also Read
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై తొలిసారి స్పందించిన సీఎం ఫడ్నవిస్.. ఏమన్నారంటే..!
- Ketan Agarwal Case: కోటేశ్వరుడైన కేతన్ను సియా ఎందుకు వద్దనుకుంది? దర్యాప్తులో సంచలన విషయాలు
- Ketan Agarwal Case: కేతన్ను లోయలోకి తోసేముందు చేతన్ ఏమన్నాడో తెలుసా.. వెలుగులోకి కొత్త విషయాలు
కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన స్రవంతి అనే 25 ఏళ్ల మహిళ.. ఓ టెలిగ్రామ్ యాప్ లో మోసపోయింది.. నిన్న మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.. అది గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది.. ఆమెకు తేజ ప్రణవి (6), హర్షవర్ధన్ రామ్ ( 4) అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అయితే, రూ.100 వేస్తే 400 రూపాయలు వస్తాయని చెప్పిన యాప్ నిర్వాహకులు.. ఈ నెల 17,18 తేదీల్లో రూ.100లు డబ్బులు పంపగా.. 400 రూపాయలు సదరు మహిళకు పంపించారు.. ఇక, రూ.10,000 వేస్తే రెట్టింపు రూ.20,000 వస్తాయని ఆశ చూపారు.. నిజమేనని నమ్మి ఇలా పలు దఫాలుగా రూ.1,35చ000 పోగొట్టుకుంది ఆ మహిళ.. చివరకు మోసపోయానని గ్రహించి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!