AP Cyber Crime: రెట్టింపు డబ్బులంటూ మోసం.. మహిళ ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cyber Crime: తాము పెట్టే పెట్టుబడికి రెట్టింపు డబ్బులు వస్తాయంటే.. ఎవరైనా.. ఆలోచించకుండా ముందడుగు వేస్తారు.. కానీ, దాని మాటున మోసం ఉందేమో అని ఒక్క క్షణం ఆలోచించనవారే కంత్రీగాళ్ల బారినపడకుండా ఉంటారు.. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ.. టెలిగ్రామ్ యాప్లో మోసగాళ్ల వలలో చిక్కుకుంది.. రూ.100 ఇస్తే.. రూ.400 ఇస్తామంటూ ఆ మహిళను తమ ముగ్గులోకి దింపిన కేటుగాళ్లు.. మొదట చెప్పినట్టుగానే రూ.100కు రూ.400 ఇచ్చారు.. దీంతో.. రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మిన మహిళ.. క్రమంగా పెద్ద మొత్తంలో వారు చెప్పినట్టుగా పంపించింది.. కానీ, డబ్బులు తిరిగిరాకపోవడంతో.. చివరకు ప్రాణాలు తీసుకుంది..
Read Also: Delhi: మెట్రో పిల్లర్ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
Also Read
- School Van Hit by Train: ఘోర ప్రమాదం... స్కూల్ వ్యాన్ ను ఢీకొట్టిన రైలు.. ఇద్దరు చిన్నారులతో సహా ముగ్గురు మృతి
- Minor Girl Harassment: 9 ఏళ్ల బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడిపై దాడి, ఆస్పత్రిలో మృతి
- UP: ఘజియాబాద్లో దారుణం.. రూ.150 కోట్ల ఆస్తి కోసం తండ్రిని కాల్చిచంపిన కొడుకు
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన స్రవంతి అనే 25 ఏళ్ల మహిళ.. ఓ టెలిగ్రామ్ యాప్ లో మోసపోయింది.. నిన్న మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.. అది గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది.. ఆమెకు తేజ ప్రణవి (6), హర్షవర్ధన్ రామ్ ( 4) అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అయితే, రూ.100 వేస్తే 400 రూపాయలు వస్తాయని చెప్పిన యాప్ నిర్వాహకులు.. ఈ నెల 17,18 తేదీల్లో రూ.100లు డబ్బులు పంపగా.. 400 రూపాయలు సదరు మహిళకు పంపించారు.. ఇక, రూ.10,000 వేస్తే రెట్టింపు రూ.20,000 వస్తాయని ఆశ చూపారు.. నిజమేనని నమ్మి ఇలా పలు దఫాలుగా రూ.1,35చ000 పోగొట్టుకుంది ఆ మహిళ.. చివరకు మోసపోయానని గ్రహించి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
Hydrogen Fuel Cell Train: తొలి “హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్” రైలు షురూ.. రూ.14,700 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..!
-
TamannaahBhatia : బోల్డ్ హారర్ థ్రిల్లర్లో తమన్నా భాటియా.. రసహృదయాలు కాస్త జాగ్రత్త
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Lenovo Legion R9000P: ప్రపంచంలోనే తొలి IJP OLED డిస్ప్లేతో.. లెనోవో Legion R9000P రిలీజ్
-
Nadendla Manohar: స్థానిక ఎన్నికల్లో కొత్త వ్యూహం.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!