AP Cyber Crime: రెట్టింపు డబ్బులంటూ మోసం.. మహిళ ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cyber Crime: తాము పెట్టే పెట్టుబడికి రెట్టింపు డబ్బులు వస్తాయంటే.. ఎవరైనా.. ఆలోచించకుండా ముందడుగు వేస్తారు.. కానీ, దాని మాటున మోసం ఉందేమో అని ఒక్క క్షణం ఆలోచించనవారే కంత్రీగాళ్ల బారినపడకుండా ఉంటారు.. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ.. టెలిగ్రామ్ యాప్లో మోసగాళ్ల వలలో చిక్కుకుంది.. రూ.100 ఇస్తే.. రూ.400 ఇస్తామంటూ ఆ మహిళను తమ ముగ్గులోకి దింపిన కేటుగాళ్లు.. మొదట చెప్పినట్టుగానే రూ.100కు రూ.400 ఇచ్చారు.. దీంతో.. రెట్టింపు డబ్బు వస్తుందని నమ్మిన మహిళ.. క్రమంగా పెద్ద మొత్తంలో వారు చెప్పినట్టుగా పంపించింది.. కానీ, డబ్బులు తిరిగిరాకపోవడంతో.. చివరకు ప్రాణాలు తీసుకుంది..
Read Also: Delhi: మెట్రో పిల్లర్ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
కృష్ణా జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పమిడిముక్కల మండలం మంటాడకు చెందిన స్రవంతి అనే 25 ఏళ్ల మహిళ.. ఓ టెలిగ్రామ్ యాప్ లో మోసపోయింది.. నిన్న మధ్యాహ్నం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది.. అది గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఈరోజు మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది.. ఆమెకు తేజ ప్రణవి (6), హర్షవర్ధన్ రామ్ ( 4) అని ఇద్దరు పిల్లలు ఉన్నారు.. అయితే, రూ.100 వేస్తే 400 రూపాయలు వస్తాయని చెప్పిన యాప్ నిర్వాహకులు.. ఈ నెల 17,18 తేదీల్లో రూ.100లు డబ్బులు పంపగా.. 400 రూపాయలు సదరు మహిళకు పంపించారు.. ఇక, రూ.10,000 వేస్తే రెట్టింపు రూ.20,000 వస్తాయని ఆశ చూపారు.. నిజమేనని నమ్మి ఇలా పలు దఫాలుగా రూ.1,35చ000 పోగొట్టుకుంది ఆ మహిళ.. చివరకు మోసపోయానని గ్రహించి ఆత్మహత్యాయత్నం చేయగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
తాజావార్తలు
-
AP Government: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 12 నుంచి ప్రారంభం..
-
PBKS Vs RCB: కోహ్లీ, వెంకటేశ్ అయ్యర్ వీర విహారం.. భారీ స్కోర్ సాధించిన ఆర్సీబీ..
-
Taiwan: ‘‘మేము చైనా బానిసలం కాదు’’.. ట్రంప్ ప్రకటనపై తైవాన్ ఆగ్రహం..
-
Satish Kilaru: ఒకటి కాదు ఏకంగా మూడు గాయాలు.. ‘పెద్ది’ షూటింగ్లో చరణ్కు ఏమైందో చెప్పిన నిర్మాత!
-
Fire Accident : యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం..!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..