Delhi: మెట్రో పిల్లర్ను ఢీకొన్న బస్సు.. ఒకరు మృతి
- ఢిల్లీలో ఓ బస్సు బీభత్సం
- మెట్రో పిల్లర్ను ఢీకొన్న ఎలక్ట్రిక్ బస్సు.. ఒకరు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రిక్ బస్సు మెట్రో పిల్లర్ను ఢీకొట్టడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా.. మరో 24 మందికి గాయాలయ్యాయి. ఢిల్లీలోని పంజాబీ బాగ్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
పంజాబీ బాగ్లోని రోహ్తక్ రోడ్డులోని శివాజీ పార్క్ సమీపంలో ఉదయం ఈ ప్రమాదం జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. మెట్రో పిల్లర్ను ఎలక్ట్రిక్ బస్సు ఢీకొనడంతో 45 ఏళ్ల మహిళ మృతి చెందగా, మరో 24 మంది ప్రయాణికులు గాయపడ్డారని వెల్లడించారు. బస్సు ప్రమాదానికి సంబంధించి ఉదయం 7.42 గంటలకు పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్కు పీసీఆర్ కాల్ వచ్చిందని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ విచిత్ర వీర్ తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు మంగోల్పురి-ఆనంద్ విహార్ మధ్య నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సు ఆ ప్రాంతంలోని మెట్రో పిల్లర్పైకి దూసుకెళ్లినట్లు గుర్తించారు. బస్సు డ్రైవర్ సడన్గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి ఆటో రిక్షా ఢీకొట్టింది.
Also Read
- Fake Cancer Drugs: క్యాన్సర్ బాధితుల ప్రాణాలతో చెలగాటం.. నీళ్లతో నింపిన నకిలీ ఇంజెక్షన్ల విక్రయం గుట్టురట్టు
- India-China Talks: BRICS 2026కు ముందు భారత్-చైనా కీలక భేటీ.. దోవల్, వాంగ్ యీ ఏం మాట్లాడారంటే?
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
ఇది కూడా చదవండి: CM Revanth: రాహుల్ గాంధీతో ముగిసిన రేవంత్ రెడ్డి భేటీ.. ఏం చర్చించారంటే..?
ప్రమాదంలో మహిళ మృతి చెందగా, 55 ఏళ్ల వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన 24 మంది ప్రయాణికుల్లో 14 మందిని మహారాజా అగ్రసేన్ ఆసుపత్రికి, మరో 10 మందిని ఆచార్య భిక్షు ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
నిర్లక్ష్యంతో ర్యాష్ డ్రైవింగ్, ఒకరి మరణానికి కారణమైనందుకు భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేశామని, క్రైమ్ టీమ్ను సంఘటనా స్థలానికి పిలిపించి, ఫోరెన్సిక్ శాంపిల్స్ తీసుకుంటున్నామని పోలీసు అధికారి తెలిపారు. బస్సులో మెకానికల్ తనిఖీలు కూడా జరుగుతున్నాయని అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Nathanadhudu : భీముడి వారసుడు నాథనాధుడిగా శరత్ కుమార్ లుక్ చూశారా?
తాజావార్తలు
-
Lurk OTT Release: ఆ అడవిలో అసలు భయం మనుషులే.. ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. 8.8 ఐఎండీబీ రేటింగ్
-
Iran-US Ceasefire: గుడ్న్యూస్.. కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ అంగీకారం?
-
Islamabad: ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన 15 మంది నవజాత శిశువులు
-
US Visa Interview Pause: అమెరికా వీసా కోసం ఎదురుచూస్తున్నవారికి షాక్.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్వ్యూలు వాయిదా, కారణం ఇదే!
-
Ravi Teja-Irumudi: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘ఇరుముడి’.. రవితేజ @ 100 కోట్ల సినిమాల లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!