మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు ఎక్కువైపోతున్నాయి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా రాత్రి కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన మహిళపై నలుగురు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. నిమపరా ప్రాంతంలో ఒక మహిళ అర్ధరాత్రి బహిర్బూమికని నిర్మానుష్య ప్రదేశానికి వచ్చింది. ఆమెను గమనించిన నలుగురు వ్యక్తులు ఆమెను వెంబడించారు. అనంతరం నలుగురు ఆమెను టవల్ తో కట్టేసి సామూహిక అత్యచారానికి పాల్పడ్డారు. ఆమె ఎంత గింజుకుంటున్న వదలకుండా దారుణానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడికి పరారయ్యారు. బయటికి వెళ్లిన భార్య ఎంతసేపటికి రాకపోయేసరికి ఆమెను వెత్తుకుంటూ వెళ్లిన భర్తకు ఏడుస్తూ భార్య కనిపించడంతో ఏమైంది అని అడుగగా విషయం మొత్తం చెప్పింది. దీంతో భర్త వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.