Murder for property: రూ.300 కోట్ల ఆస్తి కోసం మామని చంపేందుకు కోడలు ఎలా ప్లాన్ చేసిందంటే..
- ఆస్తి కోసం మామని హత్య చేసిన కోడలు..
- పక్కా ప్లాన్తో కుట్ర..
- రూ. 300 కోట్ల ఆస్తిపై కన్ను..
- విచారణలో విస్తూపోయే నిజాలు.
Murder for property: మహారాష్ట్ర నాగ్పూర్లో ఆస్తి కోసం ఓ కోడలు పక్కా ప్లాన్లో మామగారిని హతమార్చింది. రూ.300 కోట్ల ఆస్తి కోసం పన్నిన దారుణమై కుట్ర వెలుగులోకి వచ్చింది. టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా అర్చన మనీష్ పుట్టేవార్ గత వారం 82 ఏళ్ల తన మామా పురుషోత్తం పుట్టేవార్ని ప్లాన్ చేసి హతమార్చింది. 15 రోజుల క్రితం పురుషోత్తం కారు ఢీకొట్టడంతో మరణించారు. ఈ కేసును లోతుగా పరిశీలించిన పోలీసులకు నిజాలు వెలికి తీశారు. నిందితురాలైన అర్చనాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1 కోటి సుపారీగా ఇచ్చి ఆమె హత్య కోసం వ్యక్తుల్ని నియమించుకుంది.
Read Also: Andhra pradesh: ప్రధాని మోడీని సత్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్..(వీడియో)
Also Read
- Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
- Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
- Honeymoon Murder Case: 790 పేజీల ఛార్జిషీట్.. సోనమ్కు బెయిల్.. అసలేం జరిగిందంటే..!
- Vizag Stock Market Scam: ఫ్యామిలీ మొత్తం కంత్రీ..! స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో రూ.6.5 కోట్లు నొక్కేశారు..
అర్చన తన మామను చంపేందుకు నిందితులకు కారు కొనేందుకు డబ్బులు కూడా ఇచ్చింది. కారు ఢీకొట్టడాన్ని ప్రమాదంగా చూపించి తప్పించుకోవాలనే ప్రయత్నం చేసినట్లు విచారణలో వెల్లడైంది. పురుషోత్తంకి సంబంధించిన రూ. 300 కోట్ల విలువైన ఆస్తులపై తన పట్టును సాధించేందుకు ఇలా చేసినట్లు పోలీసులు తెలిపారు. 53 ఏళ్ల మహిళ తన భర్త డ్రైవర్ అయిన బాగ్డేతో పాటు ఇద్దరు నిందితులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్లతో కలిసి హత్యకు పథకం వేసిందిన పోలీసులు తెలిపారు. పోలీసులు హత్యతో పాటు మోటార్ వాహనాల చట్టంలోని ఇతర సెక్షన్ల కింది అభియోగాలు మోపారు. రెండు కార్లు, బంగారు నగలు, మొబైల్ ఫోన్లను నిందితుల వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఘటన జరిగిన రోజున సర్జరీ అయి కోలుకుంటున్న తన భార్య శకుంతలను కలిసేందుకు పురుషోత్తం పుట్టేవారు ఆస్పత్రికి వెళ్లినట్లు విచారణలో తేలింది. తిరిగి వస్తున్న క్రమంలో కారు అతడి పైనుంచి దూకుకెళ్లింది.పురుషోత్తం కుమారుడు, అర్చన భర్త మనీష్ డాక్టర్గా పనిచేస్తున్నారు. ఈ హత్య విచారణ సమయంలోనే అర్చనా పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ విభాగంలో స్థానిక ఎమ్మెల్యే అక్రమాలను కనుగొన్నారు. అయితే, ఆమెకు ఉన్న రాజకీయ సంబంధాల కారణంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విచారణలో తేలింది. నిబంధనలను ఉల్లంఘించిన అక్రమ లేఅవుట్లను క్లియర్ చేశారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి.
తాజావార్తలు
-
Babar Azam: టీ20 క్రికెట్లో నయా హిస్టరీ.. కోహ్లీ, డుప్లెసిస్ను వెనక్కి నెట్టేసిన బాబర్ ఆజామ్..
-
Instagram Star Murder: భర్త చేతితో ఇన్స్టా స్టార్ దారుణ హత్య.. ట్విస్ట్ ఏంటంటే..?
-
TGSRTC: రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసిన టికెట్ ఇన్ స్పెక్టర్.. చెప్పుతో దాడి చేసిన కండక్టర్, ప్రయాణికులు
-
Bhuvneshwar Kumar Record: దూసుకెళ్తున్న స్వింగ్ మాస్టర్ భువనేశ్వర్.. జస్ప్రీత్ బుమ్రా రికార్డు బ్రేక్!
-
AC Health Risks: గంటల తరబడి ఏసీలో ఉంటున్నారా..? ఈ వ్యాధులకు కారణం కావచ్చు..! ఏం చేయాలి..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!