Murder : మద్యానికి బానిసైన కొడుకు దారుణం.. తండ్రి హత్య వెనుక ఆస్తి వివాదం
- వికారాబాద్ జిల్లాలో ఆస్తి కోసం దారుణ హత్య
- మద్యానికి బానిసైన రవి తండ్రిపైనే దాడి
- సుత్తితో మోది తండ్రిని చంపిన దారుణ ఘటన
- పోలీసులకు లొంగిపోయిన నిందితుడు, హత్యాయుధం స్వాధీనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొడుకు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడు అంటారు. కానీ ఆ కొడుకు.. ఆస్తి కోసం తండ్రిని దారుణంగా చంపేశాడు. సుత్తితో బలంగా మోది చంపేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో కలకలం రేపింది. వృద్ధాప్యంలో తండ్రికి అండగా నిలవాల్సిన కొడుకే ఆ కన్న తండ్రి పట్ల కాలయముడయ్యాడు… ఆస్తి కోసం తండ్రినే హతమార్చాడు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లిలో జరిగింది.
గొట్లపల్లికి చెందిన హన్మంతు, నర్సమ్మ దంపతులకు ఐదుగురు కొడుకులు. అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. అంతా వేర్వేరుగా కాపురం పెట్టారు. వీరిలో మూడో కొడుకు రవి భార్య చనిపోయింది. అతనికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు. గతంలో మేస్త్రీ పని చేసిన రవి.. ఈ మధ్య మద్యానికి బానిసయ్యాడు. దీంతో అతని పిల్లల బాధ్యతను కూడా తల్లి నర్సమ్మే నెరవేరుస్తోంది. మద్యం తాగుతూ రోజూ ఇంటికి వచ్చి తల్లిదండ్రులను వేధిస్తున్నాడు రవి.
Also Read
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
- Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
- Uttar Pradesh Crime: నిద్రమాత్రల మత్తులోకి నెట్టేసి, చీరతో గొంతు బిగించి చంపింది.. భర్తలకు రక్షణ లేదా?
ఈ క్రమంలో తల్లి నర్సమ్మపై మద్యం మత్తులో చేయి చేసుకున్నాడు. దీంతో ఆమె చేయి విరిగిపోయింది. నర్సమ్మ ఆస్పత్రికి వెళ్లిన తర్వాత… పక్షవాతంతో బాధపడుతూ ఇంట్లోని మంచంపై ఉన్న తండ్రితో గొడవ పెట్టుకున్నాడు రవి. తండ్రి ఆస్తిలో తన వాటాకు రావాల్సిన భూమి తన పేరిట పట్టా చేయాలని వేధించాడు. కానీ అందుకు తండ్రి ససేమిరా అన్నాడు. ఐతే ఎప్పటి నుంచో అడుగుతున్నప్పటికీ.. తల్లిదండ్రులు నిరాకరిస్తూనే ఉన్నారు. మద్యం అలవాటు వల్ల భూమి ఎవరికైనా అమ్మేస్తే.. పిల్లలు ఆగమవుతారనేది ఆ తల్లిదండ్రుల అభిప్రాయం. ఇదే కారణంతో రవి పేరిట పట్టా చేసేందుకు ససేమిరా అంటున్నారు.
కానీ ఇదే విషయంలో తల్లిదండ్రులపై కోపంగా ఉన్న రవి.. తండ్రిపై దాడి చేశాడు. సుత్తితో తలపై బాదాడు. తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తర్వాత 100 నంబర్ కు డయల్ చేసిన రవి.. తన తండ్రిని హత్య చేసినట్లు పోలీసులకు చెప్పాడు. పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని చంపేందుకు ఉపయోగించిన సుత్తిను స్వాధీనం చేసుకున్నారు..
తాజావార్తలు
-
Himmat Singh: అరెరె.. ఇదేం రన్ అవుట్ భయ్యా.. ఇప్పటి వరకు చూడలే.! వీడియో వైరల్..
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
Rahul Gandhi: ఢిల్లీలో గళం.. రాంచీలో మౌనం.. విద్యార్థులపై రాహుల్ గాంధీ కపట ప్రేమ?
-
ASUS Chromebook CX15: ఆసుస్ క్రోమ్బుక్ CX15 భారత్లో లాంచ్.. Google AI ఫీచర్లు, మిలిటరీ-గ్రేడ్ డ్యురబిలిటీ.. చౌక ధర
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
ట్రెండింగ్
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!