Crime: పరువు హత్య..కుమార్తెను దారుణంగా చంపిన తండ్రి..అవాక్కైన పోలీసులు
- ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో పరువు హత్య
- మైనర్ కుమార్తెను గొంతు నులిమి చంపిన తండ్రి
- పోలీసుల ఎదుట లొంగిపోయిన తండ్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన మైనర్ కుమార్తెను గొంతు కోసి చంపేశాడు. ఘటన అనంతరం పర్సఖేడా పోస్టు వద్దకు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. శుక్రవారం ఉదయం పోస్టు వద్దకు చేరుకున్న వ్యక్తి తన కుమార్తెను గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అతను చెప్పిన మాటలు విని పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్స్టేషన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించే ప్రక్రియను ప్రారంభించారు.
READ MORE: NTRNeel : బాక్సాఫీస్ విధ్వంసానికి పూజ మొదలెట్టిన తారక్ – నీల్
Also Read
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
- Be Alert: కొండపై దొంగల ముఠా.. ఆదమరిస్తే అంతే..
సిబిగంజ్ పోలీసుల సమాచారం ప్రకారం..పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయి, ఫతేగంజ్ వెస్ట్లో నివసించే విజేంద్ర అలియాస్ బడాను ప్రేమించింది. ఇద్దరూ ఇల్లు వదిలి పారిపోయారు. దీంతో ఆ యువకుడిపై బాలిక తండ్రి గురువారం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పోలీసులు జైలుకు పంపారు. బాలికను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమాజంలో చెడ్డపేరు రావడంతో తండ్రి గురువారం రాత్రి తన కుమార్తె గొంతు కోసి హత్య చేశాడు. సిబిగంజ్ ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు.
READ MORE:Uttarpradesh : షాకింగ్.. ఏడో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన పదో తరగతి విద్యార్థి
స్టేషన్ కు వెళ్లి తన కూతురుని తానే హత్య చేసి వచ్చానని పోలీసులకు చెప్పాడు. మృతదేహం ఇంట్లో పడి ఉందని తెలిపాడు. అతను చెప్పిన మాటలు విని పోలీసులు ఉలిక్కిపడ్డారు. పర్సఖేడా ఔట్పోస్టు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్ష అనంతరం కుటుంబీకులకు అప్పగిస్తారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..