Crime: పరువు హత్య..కుమార్తెను దారుణంగా చంపిన తండ్రి..అవాక్కైన పోలీసులు
- ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో పరువు హత్య
- మైనర్ కుమార్తెను గొంతు నులిమి చంపిన తండ్రి
- పోలీసుల ఎదుట లొంగిపోయిన తండ్రి
ఉత్తరప్రదేశ్లోని బరేలీ జిల్లాలో పరువు హత్య ఘటన వెలుగు చూసింది. సీబీ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి తన మైనర్ కుమార్తెను గొంతు కోసి చంపేశాడు. ఘటన అనంతరం పర్సఖేడా పోస్టు వద్దకు చేరుకుని పోలీసుల ఎదుట లొంగిపోయాడు. శుక్రవారం ఉదయం పోస్టు వద్దకు చేరుకున్న వ్యక్తి తన కుమార్తెను గొంతుకోసి హత్య చేసినట్లు పోలీసులకు తెలిపాడు. అతను చెప్పిన మాటలు విని పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీస్స్టేషన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించే ప్రక్రియను ప్రారంభించారు.
READ MORE: NTRNeel : బాక్సాఫీస్ విధ్వంసానికి పూజ మొదలెట్టిన తారక్ – నీల్
Also Read
- Pickleball Players' Plane Crash: టెక్సాస్లో ఘోర విమాన ప్రమాదం.. క్రీడాకారులతో వెళ్తున్న ఫ్లైట్ కూలి ఐదుగురు మృతి
- Drugs Seize: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం.. రూ. 1,745 కోట్ల విలువైన కొకైన్ సీజ్.!
- Student Suicide: నిండు ప్రాణాన్ని బలితీసుకున్న నిరుద్యోగం.. కలల కొలువు దక్కకపోవడంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య
- Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
సిబిగంజ్ పోలీసుల సమాచారం ప్రకారం..పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన అమ్మాయి, ఫతేగంజ్ వెస్ట్లో నివసించే విజేంద్ర అలియాస్ బడాను ప్రేమించింది. ఇద్దరూ ఇల్లు వదిలి పారిపోయారు. దీంతో ఆ యువకుడిపై బాలిక తండ్రి గురువారం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. బాలిక వాంగ్మూలం ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పోలీసులు జైలుకు పంపారు. బాలికను ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమాజంలో చెడ్డపేరు రావడంతో తండ్రి గురువారం రాత్రి తన కుమార్తె గొంతు కోసి హత్య చేశాడు. సిబిగంజ్ ఠాణాకు వెళ్లి లొంగిపోయాడు.
READ MORE:Uttarpradesh : షాకింగ్.. ఏడో తరగతి విద్యార్థినిని గర్భవతిని చేసిన పదో తరగతి విద్యార్థి
స్టేషన్ కు వెళ్లి తన కూతురుని తానే హత్య చేసి వచ్చానని పోలీసులకు చెప్పాడు. మృతదేహం ఇంట్లో పడి ఉందని తెలిపాడు. అతను చెప్పిన మాటలు విని పోలీసులు ఉలిక్కిపడ్డారు. పర్సఖేడా ఔట్పోస్టు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు గ్రామానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. శవపరీక్ష అనంతరం కుటుంబీకులకు అప్పగిస్తారు.
తాజావార్తలు
-
IPL 2026 Centuries: ‘వంద’ కొడితే ఓటమే.. ఐపీఎల్ 2026లో ఆసక్తికర ట్రెండ్!
-
Govt Employee Turns Chain Snatcher: షేర్ మార్కెట్ నష్టాలు.. ప్రభుత్వ ఉద్యోగి దొంగగా మారిన షాకింగ్ ఘటన..!
-
Vivo S50t 5G: 50MP ట్రిపుల్ కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్తో.. వివో S50t 5G విడుదల
-
Cucumber Chutney Recipe: మండుటెండలో చల్లని టేస్టీ రెసిపీ.. దోసకాయ చట్నీ ఇలా తయారు చేయండి..
-
Emergency Alert: మీ మొబైల్స్ పెద్ద శబ్దంతో మోగాయా? కంగారు పడకండి.. మేటరేంటంటే..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!