Faridabad: కోడలు పారిపోయిందని అత్తమామలు ఆరోపణ.. 10 అడుగుల గుంతలో మృతదేహం లభ్యం
- హర్యానాలోని ఫరీదాబాద్లో వెలుగులోకి దారుణమైన ఘటన..
- అదనపు కట్నం కోసం వివాహితను హత్య చేసిన భర్త, అత్తమామలు..
- 10 అడుగుల గుంతలో లభ్యమై మహిళ మృతదేహం.. నలుగురు అరెస్ట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Faridabad: హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలతో కలిసి ఓ మహిళను దారుణంగా చంపేశారు. మురుగు కాల్వ కోసమని గొయ్యి తవ్వి కోడలు శవాన్నీ అందులో పూడ్చి పెట్టేశారు. ఆపై కోడలు ఎవరితోనో లేచిపోయిందని అసత్య ప్రచారం చేసారు. అయితే, రెండేళ్ల క్రితం అరుణ్ తో వివాహం జరగగా.. అదనపు కట్నం కోసం వేధించడంతో ఏడాది పాటు సదరు వివాహిత తనూ పుట్టింట్లోనే ఉండిపోయింది. ఆ తర్వాత కొంత డబ్బు అప్పజెప్పి అత్తింట్లో దిగబెట్టగా.. అత్తింటి వారు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఇక, మృతురాలి సోదరి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో రెండు నెలల తర్వాత ఈ దారుణమై ఘటన వెలుగులోకి వచ్చింది.
Read Also: Harsha Kumar: బనకచర్ల ప్రాజెక్టుపై హర్షకుమార్ సంచలన ఆరోపణలు..
Also Read
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
- Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
- Teacher Murder: 30 సెకన్లలో 30సార్లు పొడిచి హత్య చేశాడు..రక్తపు మరకలతో నిండిపోయిన టీచర్ శరీరం!
అయితే, ఈ ఘటనలో దారుణ హత్యకు గురైన వివాహిత ‘తనూ’ మృతదేహాన్ని శుక్రవారం నాడు 10 అడుగుల గుంతలో నుంచి పోలీసులు బయటకు తీశారు. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో హత్య జరిగి సుమారు రెండు నెలలకు పైనే కావొచ్చని పేర్కొన్నారు. ఈ సంఘటనకు సంబంధించి తనూ భర్త, అత్తమామలు, మరో దగ్గరి బంధువుతో సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనూ అత్తింటి వారితో నివసించిన ఇంటి పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో కొత్తగా వేసిన కాంక్రీట్ కింద ఈ మృతదేహాన్ని ఉన్నట్లు కనిపెట్టారు. అయితే, గత రెండు నెలల క్రితం మురుగు నీటి కాలువ నిర్మాణం కోసం ఆ ప్రాంతంలో ఓ గుంతను తవ్వినట్లు స్థానికులు పోలీసులకు వెల్లడించారు.
Read Also: CM Omar Abdullah: పాక్ ఆర్మీ చీఫ్- డొనాల్డ్ ట్రంప్ భేటీపై జమ్ముకాశ్మీర్ సీఎం సంచలన వ్యాఖ్యలు
ఇక, ఫరీదాబాద్లోని రోషన్ నగర్ కు చెందిన అరుణ్కు, షికోహాబాద్ కు చెందిన తనూకు 2023లో పెళ్లైంది. వివాహం జరిగిన తర్వాత కొద్ది నెలలకే అత్తింట్లో వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె సోదరి ఆరోపించింది. తన సోదరిని అత్తింటి వారు బంగారం, డబ్బు కోసం మానసికంగా, శారీరకంగా హింసించారని తెలిపింది. తమ కుటుంబం శక్తి మేర వారి డిమాండ్లను కొంతమేర తీర్చినా, వేధింపులు ఆగలేదని బోరున విలపించింది. అయితే, ఏప్రిల్ 9వ తేదీన తన సోదరికి ఫోన్ చేసినప్పుడు కలవకపోవడంతో.. అనుమానం వచ్చింది, ఏప్రిల్ 23న అత్తింటివారు తనూ ఇంటి నుంచి ఎవరితోనో పారిపోయిందని తమకు చెప్పారని ప్రీతి వెల్లడించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. చాలా రోజుల పాటు వారు కూడా ఈ కేసును పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తిం చేసింది.
తాజావార్తలు
-
Spirit: స్పిరిట్ షూటింగ్’కి నెల రోజుల బ్రేక్
-
Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!