Land Scam: 126 ఎకరాల భూ యజమానులందరూ మృతి.. సమీప బంధువుల భారీ స్కెచ్
- ప్రతాపరెడ్డి తల్లి తరఫు బంధువులు మోహన్రెడ్డి, సురేఖ
- తనను దత్తత తీసుకున్నారని ఆధార్, రేషన్ కార్డుల సృష్టి
- డిసెంబరు 3న ఒక వీలునామా రాశారని చెప్పిన మోహన్ రెడ్డి
- భూములు, ఆస్తులన్నీ తనవేనని ప్రకటించుకున్న మోహన్ రెడ్డి
- 50కి పైగా ఎకరాలను మోహన్రెడ్డి, సురేఖ పేరు మీద రిజిస్ట్రేషన్
- మిగతా భూమిని ఇతర నిందితుల పేర్ల మీదకు బదిలీ
- ప్రతాప్రెడ్డి బ్యాంకు ఖాతాలోని 19 లక్షలు విత్డ్రా
- కోర్టును ఆశ్రయించిన ప్రతాప్రెడ్డి తండ్రి తరపు బంధువు
- వీలునామా అసలైందో కాదో తేల్చాలన్న న్యాయస్థానం
- ఫోరెన్సిక్ ల్యాబ్కు మోహన్ రెడ్డి ఇచ్చిన వీలునామా
- రేషన్, ఆధార్ కార్డుల్లో తండ్రి పేరు హనుమంతరెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందల ఎకరాల భూమి.. ఆ భూమికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు.. వారసులు లేరు.. అయితే తామే వారసులమంటూ ఒక వీలునామ పట్టుకొని ఇద్దరు వచ్చారు. 126 ఎకరాల భూమి తమ పేరు మీద వీలునామా రాసి మా వాళ్లు చనిపోయారంటూ పత్రాలు చూపెట్టారు. పేపర్లు చూసి అధికారులు నమ్మారు.. ఏకంగా 126 ఎకరాల భూమిని వాళ్లకు కట్టబెట్టారు. కానీ వీలునామా పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడంతో అసలు నిజం వెలుగు చూసింది. దీంతో దంపతులిద్దరూ కటకటాలపాలయ్యారు. ఈ కేసులో మరో ఆరుగురు పరారీలో ఉన్నారు..
READ MORE: Tirupati: భార్యను కిరాతకంగా హత్య చేసి.. తానూ ఆత్మహత్య చేసుకున్న భర్త.. కారణం ఏంటి..?
Also Read
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
చేవెళ్ల మండలం పామెనకి చెందిన పట్లోళ్ల ప్రతాప్రెడ్డి ఓ భూస్వామి. ఇతనికి 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ప్రతాప్రెడ్డికి వివాహమైనా సంతానం లేదు. పదేళ్ల కిందట భార్య అనసూయ, 2018 అక్టోబరు 9న ప్రతాప్రెడ్డి మరణించారు. దూరపు బంధువులు, రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం ఫిరోజ్గూడకు చెందిన గుమ్మల జగన్మోహన్రెడ్డి అలియాస్ మోహన్రెడ్డి, అతని భార్య సురేఖ, వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన పట్లోళ్ల రామకృష్ణారెడ్డి, యాదాద్రి జిల్లా తంగడపల్లి గ్రామానికి చెందిన ఇందిరాదేవి, గుమ్మళ్ల ప్రసన్న, గుమ్మల అనంత్రెడ్డి, గుమ్మల సత్యానారాయణరెడ్డి, గుమ్మల మధుసూదన్రెడ్డికి ప్రతాప రెడ్డి భూమిపై కన్ను పడింది. అంతా కలిసి పథకం వేశారు. మోహన్రెడ్డి, సురేఖ దంపతులు ప్రతాప్రెడ్డికి తల్లి తరఫు బంధువులు. ప్రతాప్రెడ్డి తనను దత్తత తీసుకున్నారని, ఆధార్, రేషన్ కార్డులు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ సృష్టించాడు. 2018 అక్టోబరు 9న ప్రతాప్రెడ్డి మరణించగా.. అంతకు ఏడాది ముందు డిసెంబరు 3న ఆయన ఒక వీలునామా రాశారని.. దాని ప్రకారం మరణాంతరం భూములు, ఆస్తులన్నీ తనకే చెందుతాయని ఇందుకు రామకృష్ణారెడ్డి, ఇందిరాదేవి సాక్ష్యమని నకిలీ పత్రం సృష్టించాడు.
READ MORE: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్లో 40 మంది నిందితులు.. మొత్తం లిస్ట్ ఇదే..
వారసుడినంటూ రెవెన్యూ అధికారులను నమ్మించి.. 50 కిపైగా ఎకరాలను మోహన్రెడ్డి, సురేఖ పేరు మీదికి.. మిగిలిన భూమిని ఇతర నిందితుల పేర్ల మీదకు బదలాయించుకున్నారు. ప్రతాప్రెడ్డి బ్యాంకు ఖాతాలోని 19 లక్షలు విత్డ్రా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ప్రతాప్రెడ్డి తండ్రి తరపు బంధువు పట్లోళ్ల రామేశ్వర్రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పరిశీలించిన కోర్టు.. కేసు నమోదు చేసి వీలునామా అసలైందో కాదో తేల్చాలని పోలీసులను ఆదేశించింది.. పోలీసులు మోహన్రెడ్డి సమర్పించిన వీలునామాను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. అది నకిలీదని తేలింది. ప్రతాప్రెడ్డి ఇతర సంతకాలతో పోల్చగా ఫోర్జరీ చేసినట్లు బయటపడింది. దీనికితోడు మోహన్రెడ్డి 2017కు ముందు తీసుకున్న రేషన్, ఆధార్ కార్డుల్లో తండ్రి పేరు హనుమంతరెడ్డిగా ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు. దీంతో పోలీసులు మోహన్రెడ్డి ఆయన భార్య సురేఖను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మిగిలిన నిందితులు పరారీలో ఉన్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!