Shocking Crimes: డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. దొపిడీ..దొంగతనాలు చేయడమే కాకుండా అవసరమైతే చంపేసేందుకు ఏ మాత్రం వెనుకాడడం లేదు. అంతే కాదు కొంత మంది ఈజీగా డబ్బు సంపాదించేందుకు కొత్త తరహా మార్గాలు వెతుకుతున్నారు. ఏకంగా బీమా చేయించి.. వ్యక్తిని హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించి బీమా సొమ్ము కొట్టేసేందుకు ప్లాన్ చేశారంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మొత్తానికి నెల్లూరు జిల్లా, ఖమ్మం జిల్లాల్లో జరిగిన రెండు ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి.…
వందల ఎకరాల భూమి.. ఆ భూమికి సంబంధించిన వాళ్ళు చనిపోయారు.. వారసులు లేరు.. అయితే తామే వారసులమంటూ ఒక వీలునామ పట్టుకొని ఇద్దరు వచ్చారు. 126 ఎకరాల భూమి తమ పేరు మీద వీలునామా రాసి మా వాళ్లు చనిపోయారంటూ పత్రాలు చూపెట్టారు. పేపర్లు చూసి అధికారులు నమ్మారు.. ఏకంగా 126 ఎకరాల భూమిని వాళ్లకు కట్టబెట్టారు. కానీ వీలునామా పత్రాలు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపడంతో అసలు నిజం వెలుగు చూసింది. దీంతో దంపతులిద్దరూ కటకటాలపాలయ్యారు. నకిలీ…