భాగ్యనగరం నకిలీ దందాలకు అడ్డాగా మారుతోంది. తాజాగా చదువు సంధ్యలు లేకపోయినా ఏకంగా డాక్టర్ అవతారమెత్తి, గత రెండు దశాబ్దాలుగా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక నకిలీ డెంటల్ డాక్టర్ను మల్కాజ్గిరి ఎస్ఓటీ (SOT) పోలీసులు అరెస్ట్ చేశారు. పదో తరగతి కూడా పాస్ కాని వ్యక్తి, ఏకంగా బీడీఎస్ (BDS) చదివినట్లు సర్టిఫికెట్లు సృష్టించి వైద్యం చేస్తుండటం స్థానికంగా కలకలం రేపింది.
Puri Jagannadh : పూరీకి ‘బిగిసిన ఉచ్చు’..సినిమాలు బ్యాన్?
ఉత్తరప్రదేశ్కు చెందిన రమేష్ అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం హైదరాబాద్కు వలస వచ్చాడు. సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో తప్పుడు సర్టిఫికెట్లను సృష్టించి, తాను డెంటల్ డాక్టర్నని నమ్మబలికాడు. నేరేడ్మెట్ ప్రాంతంలో ఒక క్లినిక్ ఏర్పాటు చేసి గత 20 ఏళ్లుగా దంత వైద్య సేవలు అందిస్తున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు రమేష్ ఒక వింత పద్ధతిని పాటించేవాడు. కేవలం రాత్రి 10 గంటల నుండి ఉదయం వరకు మాత్రమే క్లినిక్ నడుపుతూ రోగులకు చికిత్స చేసేవాడు.
10th Result: టెన్త్ ఫలితాల్లో అదరగొట్టిన బాలిక.. 600కు గాను 594 మార్కులు
రమేష్ అందిస్తున్న చికిత్స విధానంపై అనుమానం వచ్చిన కొందరు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు సదరు క్లినిక్పై మెరుపు దాడి చేసి సోదాలు నిర్వహించారు. పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. రమేష్ కనీసం పదో తరగతి కూడా ఉత్తీర్ణులు కాలేదని, అతను చూపిస్తున్న బీడీఎస్ సర్టిఫికెట్లు అన్నీ నకిలీవని తేలింది.
ఎటువంటి వైద్య పరిజ్ఞానం లేకపోయినా 20 ఏళ్లుగా ప్రజలకు దంత చికిత్స చేస్తూ వారి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టిన రమేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న నకిలీ సర్టిఫికెట్లు, వైద్య పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇటువంటి నకిలీ వైద్యుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తక్కువ ధరకే వైద్యం అందిస్తున్నారని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని పోలీసులు హెచ్చరించారు.