Scam : మాజీ ఐపీఎస్ భార్యకు WhatsApp మెసేజ్… తర్వాత జరిగినది షాకింగ్!
- వాట్సాప్ గ్రూప్తో స్టార్ట్ అయిన మోసం
- నకిలీ SEBI సర్టిఫికెట్లతో నమ్మకం పొందిన నేరగాళ్లు
- 19 లావాదేవీల్లో ₹2.58 కోట్లు బదిలీ
- బెదిరింపుల తర్వాత పోలీసులను ఆశ్రయించిన కుటుంబం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సైబర్ నేరగాళ్లు ఎంతటి వారినైనా బురిడీ కొట్టించగలరని నిరూపించే మరో చేదు సంఘటన వెలుగులోకి వచ్చింది. అధిక లాభాల ఆశ చూపి స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యను, తద్వారా ఆ అధికారిని మోసగించి ఏకంగా రూ. 2.58 కోట్లు కొల్లగొట్టారు. ఈ మోసం ఒక చిన్న వాట్సాప్ సందేశంతో ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో అద్భుతమైన చిట్కాలు ఇస్తామని, తక్కువ సమయంలోనే ఊహించని లాభాలు గడించవచ్చని బాధితురాలికి సందేశం అందింది. తనకు ట్రేడింగ్పై పూర్తి అవగాహన లేకపోవడంతో, ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె తన భర్తను (మాజీ ఐపీఎస్ అధికారి) సదరు వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయించింది.
Bhogi 2026: ఈ ఏడాది భోగి ఎప్పుడంటే..? భోగి మంటల అసలు విశిష్టత ఇదే.!
Also Read
- Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
- Karnataka: కర్ణాటకలో దారుణం.. డాక్టర్ భర్తను చంపిన భార్య.. కుమారుడిపై కూడా కత్తితో దాడి
- West Bengal: లవ్ ప్రపోజల్ రిజెక్ట్ చేసిందని, 16 ఏళ్ల బాలిక హత్య..
- Doctor Murder Case: రక్తపు మడుగులో భర్త.. 8ఏళ్ల పిల్లాడిని చావబాదింది.. తర్వాత మంచంపై పడుకొని ఫోన్లో రీల్స్ చూస్తూ...
ఆ గ్రూప్లో ఉన్న సైబర్ నేరగాళ్లు తాము సెబి (SEBI) సర్టిఫైడ్ వెబ్సైట్ నడుపుతున్నామని నమ్మబలికారు. బాధితులకు అనుమానం రాకుండా ఉండేందుకు వాట్సాప్ ద్వారా కొన్ని నకిలీ సెబి సర్టిఫికెట్లను కూడా పంపారు. పెట్టుబడి పెట్టిన మొత్తానికి 500 శాతం లాభాలు వస్తాయని నమ్మించడంతో, ఆ దంపతులు పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. గత ఏడాది డిసెంబర్ 24 నుంచి ఈ నెల 5వ తేదీ వరకు మొత్తం 19 విడతలుగా (Transactions) వివిధ బ్యాంక్ ఖాతాలకు రూ. 2.58 కోట్లు బదిలీ చేశారు. కొంత కాలం తర్వాత పెట్టుబడులు ఆపేయడంతో నేరగాళ్లు అసలు రూపం బయటపెట్టారు. మరింత డబ్బు ఇన్వెస్ట్ చేయాలని, లేకపోతే ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి మొత్తం పోతుందని బాధితులను తీవ్రంగా ఒత్తిడి చేస్తూ బెదిరింపులకు దిగారు.
దీంతో తాము మోసపోయామని గ్రహించిన మాజీ ఐపీఎస్ అధికారి కుటుంబం వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నేరగాళ్లు వాడిన బ్యాంక్ ఖాతాలు , వాట్సాప్ నంబర్ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఇలాంటి గుర్తుతెలియని వాట్సాప్ గ్రూపుల ద్వారా వచ్చే ట్రేడింగ్ చిట్కాలను నమ్మి నగదు పంపవద్దని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
HYDRAA : హైడ్రా భారీ ఆపరేషన్.. మియాపూర్లో రూ. 3,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి స్వాధీనం..!
తాజావార్తలు
-
Rajasthan: అమానుషం.. రూ.500 నోటు పోయిందని బాలికల బట్టలు విప్పి తనిఖీ చేసిన టీచర్
-
Aishwarya Rajesh: సైకో క్యారెక్టర్లు చేయాలని ఉంది
-
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
-
Harish Rao : ‘కరెంట్ ఉంటేనే వార్త’.. హరీష్ ఫైర్.!
-
Aishwarya Rajesh : భయపడి 50 సినిమాలు చేశ .. ఐశ్వర్య రాజేష్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!