Duplicate CM Arrest: సీఎం వేషధారణలో మోసం..! డూప్లికేట్ సీఎం అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనిషిని పోలిన మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఏడుగురు ఉంటారని చెబుతుంటారు.. అక్కడక్కడ కొందరినీ చూస్తుంటాం.. ఇంకా కొందరు కొన్ని పోలికలున్నా.. ప్రముఖులైనవారిని వేషధారణలో కనిపిస్తూ ఉంటారు.. అంత వరకు బాగానే ఉంటుంది.. కానీ, అదే అదునుగా భావించి మోసాలకు పాల్పడితే.. చట్టం తన పని తాను చేసుకుపోతోంది.. ఓ వ్యక్తి ఏకంగా ముఖ్యమంత్రి వేషధారణలో కనిపిస్తున్నాడు.. ప్రజల్లో తిరిగేస్తున్నాడు.. ఫొటోలు దిగుతున్నాడు.. ఆటో గ్రాఫ్లు ఇచ్చేస్తున్నాడు.. ఇది సీఎంకే ఇబ్బంది తెచ్చిపెట్టేలా మారింది.. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ డూప్లికేట్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు.. మహారాష్ట్రలో జరిగిన సీఎం.. డూప్లికేట్ సీఎంకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
Read Also: Chiranjeevi: మళ్లీ రాజకీయాల్లోకి చిరు.. దూరం కాలేదు అంటూ ట్వీట్
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే వేషధారణలో ప్రజలను మోసం చేసిన పుణెకు చెందిన విజయ్ మానే అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేలా కనిపించి, ఆయన తరహాలోనే వేషధారణలో విజయ్ మానే బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతూ.. సీఎంగా చెప్పుకుంటున్నాడు.. ఈ మధ్య విజయ్ మానే.. పాత నేరస్థుడు శరద్ మోహోల్తో కలిసి ఫొటోలు దిగాడు.. అయితే, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి.. దీంతో, అతడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి వేషధారణతో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన అతడిపై ఐపీసీ 419-511, 469, 500, 501 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద కేసు నమోదు చేశారు. గూండా శరద్ మోహోల్తో కలిసి ఫోటో తీసి వైరల్ చేయడంతో.. సీఎం ఏక్నాథ్ షిండే పరువు తీశారని విజయ్ మానెపై అభియోగాలు మోపారు.
అయితే, విజయ్ మానే ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. ఇది పౌరుల మధ్య అపార్థానికి దారితీస్తుంది. ఈ వ్యవహారంలో విజయ్ మానెపై ఫిర్యాదు నమోదైంది. అందులో ‘విజయ్ మనే ఎప్పుడూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే లాగా డ్రెస్లు వేసుకుని వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. పబ్లిక్ ప్లేస్కి వెళ్తూ జనం అపార్థం చేసుకునేలా ప్రవర్తించేవాడు. విజయ్ మానె ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ముఖ్యమంత్రి షిండే ప్రతిష్టను దిగజార్చుతోందని ఫిర్యాదు అందింది.. దీంతో, కేసు నమోదు చేయడం.. అరెస్ట్ చేయడం జరిగిపోయాయి. కాగా, శివసేనలో తిరుగుబాటు జెండా ఎత్తిన ఏక్నాథ్ షిండే.. మహావికాస్ అఘాడి ప్రభుత్వాన్ని కూల్చివేశారు.. ఆ తర్వాత బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. తానే ముఖ్యమంత్రి అయిన విషయం తెలిసిందే..
తాజావార్తలు
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
-
Ameer Log: ‘అమీర్ లోగ్’ను రెండు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్న రానా
-
Kayadu Lohar: “రాయితో కొట్టి తల పగలగొట్టా”.. క్రేజీ బ్యూటీ కాయాదు లోహర్! ఎవరి తలో తెలుసా?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!