Chennai: చెన్నైలో బీకామ్ విద్యార్థి ఆత్మహత్య.. ఓ మహిళ ఏం చేసిందంటే..!
- చెన్నైలో బీకామ్ విద్యార్థి ఆత్మహత్య
- మహిళ తిట్లకు మనస్తాపం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొంత మంది విద్యార్థులు చదువుతో పాటు పార్ట్టైమ్ జాబ్లు చేస్తుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా తమ కాళ్ల మీద నిలబడుతుంటారు. తల్లిదండ్రులకు భారం కాకూడదని చాలా మంది పిల్లలు ఖాళీ సమయాల్లో ఏదొక పని చేసుకుంటూ చదువుకుంటారు. కానీ అదే ఒక విద్యార్థి ప్రాణాల మీదకు తెచ్చింది. మంచి ఉద్దేశంతో కష్టపడుతుంటే.. ఒక మహిళ మాటలు కారణంగా అర్ధాంతరంగా ప్రాణాలే పోయాయి. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో చోటుచేసుకుంది.

Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
జె.పవిత్రన్ (19) అనే యువకుడు చెన్నైలోని కొలత్తూరు ప్రాంతంలో ఉంటాడు. బీకాం చదువుతున్నాడు. చదువుకుంటూనే పాకెట్ మనీ కోసం కిరాణా సరుకులు డెలివరీ చేస్తుంటాడు. అయితే ఒక మహిళ అడ్రస్ తెలియక.. లేటుగా వస్తువులు డెలివరీ చేశాడు. అతగాడి ఇబ్బందులేమీ పట్టించుకోకుండా మహిళ చెడామడా.. నోటికొచ్చినట్లు తిట్లు పురాణం అందుకుంది. దీంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇది కూడా చదవండి: Ambati Rambabu: చంద్రబాబు వచ్చారు.. జనాన్ని వరదల్లో ముంచారు
సూసైడ్ నోట్..
సూసైడ్ నోట్లో తన మరణానికి కారణం డెలివరీ సమయంలో బూతులు తిట్టిన మహిళనే కారణమని చెప్పాడు. ఆమె తిట్టడంతో డిప్రెషన్లోకి వెళ్లినట్లు తెలిపాడు. అలాంటి మహిళలు ఉన్నంత వరకు మరిన్ని మరణాలు సంభవిస్తాయి అంటూ పవిత్రన్ సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పవిత్రన్కు మహిళ ఇల్లు దొరకకపోవడంతో డెలివరీ ఆలస్యమైందని పోలీసులు తెలిపారు. లేటుగా కిరాణా సరుకులు డెలివరీ చేశాడని కస్టమర్ అయిన మహిళ యువకుడితో గొడవ పెట్టుకుందని పోలీసులు చెప్పారు. కస్టమర్.. కంపెనీకి ఫోన్ చేసి డెలివరీ బాయ్పై కంప్లెంట్ చేసింది. పవిత్రన్ను మళ్లి పంపించొద్దని కోరింది. రెండో రోజుల తర్వాత యువకుడు మహిళ ఇంటిపై రాయి విసరడంతో కిటికీ అద్దం పగిలిందని.. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో యువకుడిని మందలించి వదిలేసినట్లు పోలీసులు తెలిపారు. ఇంతలో పవిత్రన్ ప్రాణాలు తీసుకున్నాడని వెల్లడించారు. కంపెనీ ఎలా స్పందిస్తుందో చూడాలి. పవిత్రన్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Ridhi Bedi: వలపు వల విసిరి.. న్యూడ్ వీడియో కాల్ కి రమ్మంటాడు.. జాగ్రత్త బాసూ!
తాజావార్తలు
-
Amaravati Development: అమరావతికి కేంద్రం భారీ శుభవార్త.. రాజధాని రూపురేఖలు మారనున్నాయా..?
-
Team India: టీం ఇండియాలో భగ్గుమన్న విభేదాలు.. కోచ్ గంభీర్ను పక్కనబెట్టి నేరుగా బీసీసీఐ పెద్దల వద్దకు సీనియర్లు!
-
Begger Role Movies: కోలీవుడ్ హీరోల ‘బిచ్చగాడు’ సెంటిమెంట్ పూరీకి ప్లస్సేనా?
-
Cabinet: అహ్మదాబాద్ మెట్రో విస్తరణ, అమరావతిలో సెంట్రల్ కాంప్లెక్స్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
-
Congress-TMC: కాంగ్రెస్లో విలీనం దిశగా టీఎంసీ.. సోనియా, రాహుల్తో మమత, అభిషేక్ వరుస భేటీలు! ఏం జరుగుతోంది!?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!