Delhi Crime: 12 ఏళ్ల బాలికను మోసగించిన మహిళ.. టీ సెల్లర్తో పాటు ముగ్గురు మైనర్ల అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Crime: ఢిల్లీలో దారుణం జరిగింది. సదర్ బజార్ ప్రాంతంలో ఓ మహిళ 12 ఏళ్ల బాలికను ప్రలోభపెట్టి, నలుగురు వ్యక్తులతో అత్యాచారం చేయించింది. ఓ టీ సెల్లర్తో పాటు ముగ్గురు మైనర్లతో సహా మొత్తం ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఓల్డ్ ఢిల్లీలోని సదర్ బజార్ లోని ఓ వ్యక్తి టీస్టార్లో సదరు మహిళ కస్టమర్ అని పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన మైనర్ల వయసు 12, 14, 15 ఏళ్లు అని వీరంతా టీ స్టాల్లో పనిచేస్తునట్లు వెల్లడించారు.
Read Also: Hardik Pandya: మాల్దీవుల వివాదంపై స్పందించిన హర్దిక్ పాండ్యా.. ‘‘ తర్వాతి హాలిడే లక్షదీవుల్లోనే’’
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
జనవరి 1న టీ స్టాల్ యజమాని ఆ ప్రాంతంలో చెత్త ఏరుకుని పనిచేస్తే మహిళను కొత్త సంవత్సర వేడుకలు జరపుకునేందుకు అమ్మాయిని ఏర్పాటు చేయాలని కోరాడు. బాలికను తమ వద్దకు తీసుకువస్తే బదులుగా కొంత డబ్బు ఇస్తానని సదరు మహిళకు చెప్పాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత రోజు మహిళ 12 ఏళ్ల బాలికను ప్రలోభపరుచుకుని నిందితులు ఉన్న ఖుర్షీద్ మార్కెట్లోని భవనం వద్ద పైకప్పు నుంచి చెత్త ఏరాలని చెప్పింది. నలుగురు నిందితులు బాలిక రాకకోసం చూసి, ఆమె రాగానే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
బాలిక నార్త్ ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి రెండు రోజులు మౌనంగా ఉంది. జనవరి 5న సదర్ బజార్ లో చెత్తతీయడానికి తిరిగి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలోని నివసించే బంధువుతో విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులను ఫిర్యాదు చేశారు. నిందితులపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు. టీ దుకాణం యజమాని ఛత్తీస్గఢ్ వాసి కాగా.. అతని దుకాణంలో పనిచేసే ముగ్గురు మైనర్లు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు.
తాజావార్తలు
-
Silver Price Hike: ఇక సామాన్యుడికి వెండి కూడా అందదా? ఆ ఒక్క నిర్ణయంతో ఇక సిల్వర్ ధరలు కొండెక్కి కూర్చోవాల్సిందేనా!
-
Nothing Phone 3: పిచ్చెక్కించే డీల్ బ్రో.. సగం ధరకే నథింగ్ ఫోన్ 3.. ఏకంగా రూ. 40,000 తగ్గింపు, 5,500mAh బ్యాటరీ
-
Pakistan: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను గద్దె దించేందుకు అమెరికా కుట్ర.. బయటపడ్డ సంచలన రహస్యాలు!
-
Preity Zinta-Shreyas Iyer: ఇది ఆటేనా అసలు.. శ్రేయస్ అయ్యర్పై ప్రీతి జింటా ఫైర్!
-
Stock Market Crash: స్టాక్ మార్కెట్ కొంప ముంచిన ట్రంప్ ప్రకటన.. ప్రారంభంలోనే సెన్సెక్స్ 800, నిఫ్టీ 250 పాయింట్లు డౌన్!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..