Delhi Crime: 12 ఏళ్ల బాలికను మోసగించిన మహిళ.. టీ సెల్లర్తో పాటు ముగ్గురు మైనర్ల అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Crime: ఢిల్లీలో దారుణం జరిగింది. సదర్ బజార్ ప్రాంతంలో ఓ మహిళ 12 ఏళ్ల బాలికను ప్రలోభపెట్టి, నలుగురు వ్యక్తులతో అత్యాచారం చేయించింది. ఓ టీ సెల్లర్తో పాటు ముగ్గురు మైనర్లతో సహా మొత్తం ఐదుగురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. ఓల్డ్ ఢిల్లీలోని సదర్ బజార్ లోని ఓ వ్యక్తి టీస్టార్లో సదరు మహిళ కస్టమర్ అని పోలీసులు తెలిపారు. అత్యాచారానికి పాల్పడిన మైనర్ల వయసు 12, 14, 15 ఏళ్లు అని వీరంతా టీ స్టాల్లో పనిచేస్తునట్లు వెల్లడించారు.
Read Also: Hardik Pandya: మాల్దీవుల వివాదంపై స్పందించిన హర్దిక్ పాండ్యా.. ‘‘ తర్వాతి హాలిడే లక్షదీవుల్లోనే’’
Also Read
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Ketan Agarwal Case: కేతన్ హత్య కేసులో క్రికెట్ ట్విస్ట్.. సియా సోదరుడు బయటపెట్టిన షాకింగ్ నిజాలు
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
జనవరి 1న టీ స్టాల్ యజమాని ఆ ప్రాంతంలో చెత్త ఏరుకుని పనిచేస్తే మహిళను కొత్త సంవత్సర వేడుకలు జరపుకునేందుకు అమ్మాయిని ఏర్పాటు చేయాలని కోరాడు. బాలికను తమ వద్దకు తీసుకువస్తే బదులుగా కొంత డబ్బు ఇస్తానని సదరు మహిళకు చెప్పాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత రోజు మహిళ 12 ఏళ్ల బాలికను ప్రలోభపరుచుకుని నిందితులు ఉన్న ఖుర్షీద్ మార్కెట్లోని భవనం వద్ద పైకప్పు నుంచి చెత్త ఏరాలని చెప్పింది. నలుగురు నిందితులు బాలిక రాకకోసం చూసి, ఆమె రాగానే అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
బాలిక నార్త్ ఢిల్లీలోని తన ఇంటికి వచ్చి రెండు రోజులు మౌనంగా ఉంది. జనవరి 5న సదర్ బజార్ లో చెత్తతీయడానికి తిరిగి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలోని నివసించే బంధువుతో విషయం చెప్పింది. బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులను ఫిర్యాదు చేశారు. నిందితులపై గ్యాంగ్ రేప్ కేసు నమోదు చేశారు. టీ దుకాణం యజమాని ఛత్తీస్గఢ్ వాసి కాగా.. అతని దుకాణంలో పనిచేసే ముగ్గురు మైనర్లు ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
KTR: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు, గులాబీ జెండా ఎగరడం ఖాయం
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..