Delhi: 25 ఏళ్ల మహిళకు మత్తుమందు ఇచ్చి, అత్యాచారం చేసిన డ్రైవర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. భర్తను కలుసుకునేందుకు వెళ్తున్న మహిళపై ఈ-రిక్షా డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆమెకు మత్తుమందు ఇచ్చి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. నిందితుడు మహమ్మద్ ఉమర్(24)ని ఉత్తర ఢిల్లీలోని కోట్వాలీ ఏరియా నుంచి అరెస్ట్ చేశారు. ‘‘ 26 మే రోజున దోపిడి గురించి పోలీస్ కంట్రోల్ రూంకి ఓ కాల్ వచ్చింది.’’ అని పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన స్థలానికి పోలీసులు వెళ్లే సమయానికి మహిళ రక్తమోడుతూ ఉందని, పక్కనే ఆమె మూడేళ్ల కుమారుడు ఉన్నట్లు డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్(నార్త్) మనోజ్ కుమార్ మీనా తెలిపారు.
Read Also: Anand Deverakonda: అందుకే ఆనంద్ కరెక్ట్ ఆప్షన్ అనిపించింది: దర్శకుడు ఉదయ్ ఇంటర్వ్యూ
Also Read
- Tirupati Crime: వారంలో ప్రియుడు వివాహం..! ప్రియురాలు ఆత్మహత్య
- Child S*exual Abuse Content: ఇన్స్టాగ్రామ్లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
- Shocking Murder Case: ఆస్తి కోసం సొంత బామ్మర్దినే చంపిన బావ.. 27 రోజుల తర్వాత బయటపడ్డ అసలు నిజం!
- Drunk and Drive: స్పీడ్.. డ్రింక్.. డెత్! హైదరాబాద్లో ఒకే రోజు ముగ్గురు బలి!
మహిళని వెంటనే మెడికల్ పరీక్షలు నిర్వహించినట్లు పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే, మే 26న బాధిత మహిళ బీహార్ నుంచి తన మూడేళ్ల కొడుకుతో కలిసి పంజాబ్లో ఉన్న తన భర్తను కలిసేందుకు వెళ్తోంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి సర్దార్ మార్కెట్ వెళ్లింది. ఈ-రిక్షా ద్వారా తిరిగి మళ్లీ స్టేషన్ వచ్చే క్రమంలో, దాని డ్రైవర్ మహ్మద్ ఉమర్ మహిళకు కూల్డ్రింక్ అందించాడు. అది తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఆమెపై అత్యాచారం చేశాడు. ప్రతిఘటించినందుకు తలపై రాయితో దాడి చేసినట్లు ఆమె పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఆ తర్వాత తాను స్పృహ కోల్పోయినట్లు, మెలుకువ వచ్చిన తర్వాత తన మొబైల్ ఫోన్, రూ.3000 దొంగలించబడినట్లు చెప్పింది. దాదాపుగా 500 సీసీటీపీ ఫుటేజీలను పరిశీలించి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 150 వరకు ఆటో రిక్షా డ్రైవర్లను విచారించిన తర్వాత అతడిని అదుపులోకి తీసుకుని హత్యయత్నం, అత్యాచారం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
తాజావార్తలు
-
Rohit Sharma: ఇక నేను ఆడను.. అదే చివరిది.. రోహిత్ శర్మ భావోద్వేగం!
-
Minister Narayana: హైదరాబాద్, బెంగళూరుకు దీటుగా అమరావతి.. ప్రపంచ టాప్-5 నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతాం..
-
Hyderabad: మహిళపైకి దూసుకెళ్లిన ప్రొడ్యూసర్ కారు.. “డ్రైవర్నే చంపుకోండి” అంటూ బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు..
-
Scam 2010: రూ.24 వేల కోట్ల భారీ స్కామ్.. ఓటీటీలోకి మరో అవినీతి బాంబ్ తో వస్తున్న హన్సల్ మెహతా
-
Parliament Monsoon Session: 18 రోజులు.. చర్చ కంటే వాయిదాలే ఎక్కువ! ముగిసిన పార్లమెంట్ సమావేశాలు..
ట్రెండింగ్
-
HONOR Robot Phone లాంచ్.. 200MP డ్యూయల్ కెమెరాలు, 200x జూమ్, 7,060mAh బ్యాటరీ, 120W ఛార్జింగ్..
-
Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ పోస్ట్ సేఫ్.. ఆ రెండు కారణాల వల్లే!
-
40 గంటల బ్యాటరీ, 3,000 నిట్స్ స్క్రీన్.. Google Pixel Watch 5 ధర, ఫీచర్లు ఇవే!
-
IND Playing 11: ఆరుగురి మధ్య తీవ్ర పోటీ.. గుర్నూర్ అరంగేట్రం ఖాయం.. శ్రీలంకతో తొలి టెస్టుకు భారత్ జట్టు ఇదే!
-
నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) మరింత స్మార్ట్గా.. కొత్త ఫీచర్లు, Olive కలర్లో Google Pixel Buds 2a, Pro 2..!