Delhi : దారుణం..బాలికపై టీచర్ లైంగిక దాడి.. చివరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళలకు సమాజంలో ఎక్కడ రక్షణ లేకుండా పోయింది.. ప్రభుత్వం ఎన్నో రకాల చట్టాలను అమలు చేస్తున్నా కూడా కామాంధుల ఆగడాలు ఆడవాళ్ల పై తగ్గడం లేదు.. పోలీసులు ఇలాంటి ఘటనల పై కఠినంగా వ్యవరిస్తున్న మృగాల్లో మార్పులు రావడం లేదు..ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. ఇప్పుడు చిన్నారిని దారుణంగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది..తాజాగా ఓ పదేళ్ల బాలికపై ఓ ట్యూషన్ టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది..
తూర్పు ఢిల్లీలోని న్యూ అశోక్ నగర్ ప్రాంతంలోని 30 ఏళ్ల వ్యక్తి ప్రైవేటుగా ట్యూషన్ క్లాసులు చెబుతున్నారు. అతడి వద్దకు స్థానికంగా నివసించే పదేళ్ల బాలిక 15 రోజుల నుంచి ట్యూషన్ కు వెళ్తోంది. ప్రతీ రోజు ఆ బాలికతో పాటు మరి కొందరు విద్యార్థినులు ట్యూషన్ కు వస్తుంటారు. అయితే శనివారం సాయంత్రం కూడా ఎప్పటిలాగే ఆ బాలిక ట్యూషన్ కు వెళ్లింది.. కానీ ఆ రోజు మిగితా పిల్లలెవరూ ట్యూషన్ కు రాలేదు. అయితే బాలిక ఒంటరిగా ఉందని గమనించిన ఆ టీచర్ కు దుర్భుద్ధి కలిగింది. వెంటనే ఆ బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. కొంత సమయం తరువాత బాలిక తన ఇంటికి వచ్చింది. తరువాత తల్లిదండ్రులకు తనపై ట్యూషన్ టీచర్ చేసిన దారుణాన్ని చెప్పి ఏడ్చింది..
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లి దండ్రులు షాక్ అయ్యారు.. అదే రోజు సాయంత్రం సమయంలో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూతురుపై జరిగిన లైంగిక దాడిని వివరిస్తూ, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) అమృత గుగులోత్ ఆదివారం వెల్లడించారు. మైనర్ ను కౌన్సిలింగ్, వైద్య పరీక్షలకు పంపినట్లు గుగులోత్ తెలిపారు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షనలతో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యార్థుల యూనిఫాంల నాణ్యతపై రాజీపడేది లేదు
-
OTR : విశ్వేశ్వర్ రెడ్డి ఒక్క మాటతో వైసీపీ ఇరుక్కుందా?
-
Covid 19: కోవిడ్పై కేంద్రం క్లారిటీ.. భయపడాల్సిన అవసరం లేదట..!
-
Mehbooba Mufti: ‘దేశంలో పిల్లల కంటే ఆవులే సురక్షితం’.. మెహబూబా ముఫ్తీ సంచలన వ్యాఖ్యలు
-
Story Board : ఎల్నినో నుంచి యుద్ధాల వరకు.. సామాన్యుడిపై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?