Mumbai Crime: తెలంగాణలో విషం కొంది.. ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Crime: భరిస్తున్నారు కదా అని బాధపెడితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే విసిగిపోయిన మనసు మనిషి ఆలోచలను వికృతంగా మారుస్తుంది. ముంబయి లోని ఓ కుటుంబంలో జరిగిన వరుస హత్యలే ఇందుకు నిదర్శనం. వివరాలలోకి వెళ్తే.. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో శంకర్ కుంభరే, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు రోషన్ సంఘమిత్ర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా 5 నెలల క్రితం సంఘమిత్ర తండ్రి ఆత్మ హత్య చేసుకుని మరణించారు . తండ్రి మరణంతో తీవ్ర దుఃఖంలో ఉన్న సంఘమిత్రకి అత్తింటి వేధింపులు ఎక్కువైయ్యాయి. ఓ వైపు తండ్రిని కోల్పోయిన బాధ. మరో వైపు అంతింటి వేధింపులతో విసిగిపోయిన సంఘమిత్ర క్రూరంగా మారిపోయింది. ఎంతగా అంటే భర్తతో సహా అంతింటి వాళ్ళందరిని చంపెయ్యాలని నిర్ణయించుకుంది. ఇంతలో తనకి రోసా అనే మహిళతో స్నేహం ఏర్పడింది.
Read also:Israeli–Palestinian Conflict: గాజాకు ఈజిప్ట్ సహాయం..
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
ఈ నేపథ్యంలో తెలంగాణ నుండి విషం కొనుగోలు చేసింది సంఘమిత్ర. ఆ విషాన్ని నీటిలో కలిపి అత్తింటి వారికి ఇచ్చింది. మొదట సెప్టెంబర్ 20వ తేదీన శంకర్ కుంభరే, అతని భార్య విజయ అనారోగ్యం పాలయ్యారు. కాగా సెప్టెంబర్ 26వ తేదీన శంకర్ మరణించగా మరుసటి రోజు అతని భార్య విజయ మృతి చెందింది. అనంతరం శంకర్ కుమార్తెలు కోమల్, ఆనంద , కుమారుడు రోషన్ ఆరోగ్యం విషమించింది. ఈ నేపథ్యంలో ఆక్టోబర్ 8వ తేదీన కోమల్, 14వ తేదీన ఆనంద, 15వ తేదీన రోషన్ మరణించారు. తల్లిదండ్రులను చూడడానికి ఢిల్లీ నుండి వచ్చిన శంకర్ పెద్ద కుమారుడు సాగర్ కూడా అనారోగ్యం పాలయ్యాడు, అలానే సాగర్ కార్ డ్రైవర్, శంకర్ వాళ్ళని చూడడానికి వచ్చిన బంధువు కూడా అనారోగ్యానికి గురైయ్యారు. దీనితో ఈ వార్త చుట్టుపక్కల గ్రామాలల్లో కలకలం రేపింది.
Read also:Off The Record: సీఎం జగన్ తో ఆ మాజీ మంత్రి మీట్ అయ్యేది అందుకేనా…?
ఈ నేపథ్యంలో పోలీసులు 4 బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా అసలు నిజం వెలుగు చూసింది. అత్తింటి వాళ్ళ ఆరళ్లకు విసుగ్గు చెందిన ఆయింటి చిన్న కోడలు సంఘమిత్ర, స్నేహితురాలు రోసా తో కలిసి అత్తింటివారిని హతమార్చింది. అయితే ప్లాన్ ప్రకారమే తన భర్తకు రావాల్సిన ఆస్థిని ముందుగానే తన పేరు మీద రాయించుకుంది. అనంతరం హత్యలు చేయడం ప్రారంభించింది. కోడలి కక్షకు 3 వారాలలో 5 మంది పండుటాకుల్లా రాలిపోయారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!