Cyber Criminals: ఎత్తుకు పైఎత్తు వేస్తున్న కేటుగాళ్లు… టెక్నాలజీతోపాటే… సైబర్ నేరగాళ్లూ అప్డేట్
- 8 నెలలలో 606 కోట్లు లూటీ చేసిన సైబర్ నేరగాళ్లు
- రకరకాలుగా ట్రాప్ చేస్తూ.. 15వేల మందిని మోసం చేసిన కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీతోపాటే… సైబర్ నేరగాళ్లూ అప్డేట్ అవుతున్నారు. ఎన్నిరకాలుగా చెక్ పెడుతున్నా.. వాటికి పైఎత్తులు వేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. కేవలం 8 నెలల వ్యవధిలో ఏకంగా 606 కోట్ల రూపాయలు లూటీ చేశారు సైబర్ క్రిమినల్స్. రకరకాలుగా ట్రాప్ చేస్తూ 8 నెలల్లో దాదాపు 15 వేల మందిని మోసం చేశారు. బాధితుల్లో అధికంగా టెక్కీలు, వ్యాపారస్తులు, గృహిణులు ఉంటున్నారు. అందరూ చదువుకున్నోళ్లే.. ఐనాసరే అంత ఈజీగా ఎలా ట్రాప్ అవుతున్నారు..? కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లను పట్టుకోలేమా..?
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో… టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల ఇన్నోవేషన్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్టు జనాలు కూడా టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు.. ఇదే ఫ్లో లో సైబర్ నేరగాళ్లు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. టెక్నాలజీతోపాటు సైబర్ నేరగాళ్లూ అప్డేట్ అవుతున్నారు. రకరకాల పేర్లతో జనాలను బురిడీ కొట్టిస్తూ.. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. కేవలం ఈ 8 నెలల్లోనే ఏకంగా 600 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
సైబర్ క్రైమ్ పోలీసుల లెక్కల ప్రకారం… గత 8 నెలల్లో 14 వేల 739 మంది బాధితుల నుంచి 606 కోట్ల రూపాయలు కాజేశారు. ముఖ్యంగా వాట్సప్, టెలిగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను అడ్డాగా చేసుకుని.. వీటి యూజర్స్ను టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు… సందర్భానికి అనుగుణంగా ట్రాప్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యే రోజులు సమీపిస్తే.. పీఎం కిసాన్ నిధుల వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి అంటూ లింక్ పంపుతున్నారు. గత నెల రోజులుగా AI, గూగుల్ జెమినీ ఫొటోల ట్రెండ్ నడుస్తోంది !! మీ ఫొటోను కూడా త్రీడీలో, జెమిని ఏఐ బనానా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్పై క్లిక్ చేయండని మెసేజ్ లు పంపుతున్నారు. క్రికెట్ ఆసియా కప్ జరుగుతోంది. క్రికెట్ స్కోర్ వివరాలు, ఇండియా పాక్ మ్యాచ్ టికెట్ల కోసం క్లిక్ చేయండి అంటూ లింకులు పంపుతున్నారు. మీ బ్యాంక్ ఖాతా కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ కాల్స్ చేసి ట్రాప్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో… ఇలా ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటూ.. ట్రెండ్ కి తగ్గట్టుగా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు.
వాట్సప్ నెంబర్ కి వచ్చే లింకులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో కనిపించే లింకులపై గుడ్డిగా క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ముఖ్యంగా ఓటీపీలు చెప్పడం, బ్యాంక్ ఖాతాల వివరాలు, యూపీఐ ఐడీ డీటెయిల్స్ చెప్పడం వంటివి చేయొద్దని హెచ్చిరిస్తున్నారు. ఇలాంటి చిన్నచిన్న లాజిక్స్ తో ట్రాప్ చేస్తూ… అకౌంట్ లో డబ్బునంతా ఊడ్చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. మోసపోతున్న వారిలో అధికంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయిస్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వీళ్లంతా చదువుకున్న వాళ్లే ఐనా.. తమకు విషయ పరిజ్ఞానం ఉన్నా.. ఈజీగా బోల్తా కొడుతున్నారు. సైబర్ క్రిమినల్స్ మాటలకు ట్రాప్ అవుతూ… డబ్బులు పోగొట్టుకుని బకరా అవుతున్నారు. పోలీసులమని చెప్పి చేసే చర్యలపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!