Cyber Criminals: ఎత్తుకు పైఎత్తు వేస్తున్న కేటుగాళ్లు… టెక్నాలజీతోపాటే… సైబర్ నేరగాళ్లూ అప్డేట్
- 8 నెలలలో 606 కోట్లు లూటీ చేసిన సైబర్ నేరగాళ్లు
- రకరకాలుగా ట్రాప్ చేస్తూ.. 15వేల మందిని మోసం చేసిన కేటుగాళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్నాలజీతోపాటే… సైబర్ నేరగాళ్లూ అప్డేట్ అవుతున్నారు. ఎన్నిరకాలుగా చెక్ పెడుతున్నా.. వాటికి పైఎత్తులు వేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. కేవలం 8 నెలల వ్యవధిలో ఏకంగా 606 కోట్ల రూపాయలు లూటీ చేశారు సైబర్ క్రిమినల్స్. రకరకాలుగా ట్రాప్ చేస్తూ 8 నెలల్లో దాదాపు 15 వేల మందిని మోసం చేశారు. బాధితుల్లో అధికంగా టెక్కీలు, వ్యాపారస్తులు, గృహిణులు ఉంటున్నారు. అందరూ చదువుకున్నోళ్లే.. ఐనాసరే అంత ఈజీగా ఎలా ట్రాప్ అవుతున్నారు..? కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న సైబర్ నేరగాళ్లను పట్టుకోలేమా..?
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీతో… టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రకరకాల ఇన్నోవేషన్స్ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్టు జనాలు కూడా టెక్నాలజీని ఈజీగా అడాప్ట్ చేసుకుంటున్నారు. సందట్లో సడేమియా అన్నట్లు.. ఇదే ఫ్లో లో సైబర్ నేరగాళ్లు కూడా ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. టెక్నాలజీతోపాటు సైబర్ నేరగాళ్లూ అప్డేట్ అవుతున్నారు. రకరకాల పేర్లతో జనాలను బురిడీ కొట్టిస్తూ.. కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. కేవలం ఈ 8 నెలల్లోనే ఏకంగా 600 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
సైబర్ క్రైమ్ పోలీసుల లెక్కల ప్రకారం… గత 8 నెలల్లో 14 వేల 739 మంది బాధితుల నుంచి 606 కోట్ల రూపాయలు కాజేశారు. ముఖ్యంగా వాట్సప్, టెలిగ్రామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ను అడ్డాగా చేసుకుని.. వీటి యూజర్స్ను టార్గెట్ చేస్తూ మోసం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు… సందర్భానికి అనుగుణంగా ట్రాప్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
పీఎం కిసాన్ నిధులు విడుదలయ్యే రోజులు సమీపిస్తే.. పీఎం కిసాన్ నిధుల వివరాల కోసం ఈ లింక్పై క్లిక్ చేయండి అంటూ లింక్ పంపుతున్నారు. గత నెల రోజులుగా AI, గూగుల్ జెమినీ ఫొటోల ట్రెండ్ నడుస్తోంది !! మీ ఫొటోను కూడా త్రీడీలో, జెమిని ఏఐ బనానా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్పై క్లిక్ చేయండని మెసేజ్ లు పంపుతున్నారు. క్రికెట్ ఆసియా కప్ జరుగుతోంది. క్రికెట్ స్కోర్ వివరాలు, ఇండియా పాక్ మ్యాచ్ టికెట్ల కోసం క్లిక్ చేయండి అంటూ లింకులు పంపుతున్నారు. మీ బ్యాంక్ ఖాతా కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటూ కాల్స్ చేసి ట్రాప్ చేస్తున్నారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పేరుతో… ఇలా ఎప్పటికప్పుడు తమ రూట్ మార్చుకుంటూ.. ట్రెండ్ కి తగ్గట్టుగా మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు.
వాట్సప్ నెంబర్ కి వచ్చే లింకులు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో కనిపించే లింకులపై గుడ్డిగా క్లిక్ చేయొద్దని సూచిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ముఖ్యంగా ఓటీపీలు చెప్పడం, బ్యాంక్ ఖాతాల వివరాలు, యూపీఐ ఐడీ డీటెయిల్స్ చెప్పడం వంటివి చేయొద్దని హెచ్చిరిస్తున్నారు. ఇలాంటి చిన్నచిన్న లాజిక్స్ తో ట్రాప్ చేస్తూ… అకౌంట్ లో డబ్బునంతా ఊడ్చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. మోసపోతున్న వారిలో అధికంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ఐటీ ఉద్యోగులు, ప్రైవేట్ ఎంప్లాయిస్ ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. వీళ్లంతా చదువుకున్న వాళ్లే ఐనా.. తమకు విషయ పరిజ్ఞానం ఉన్నా.. ఈజీగా బోల్తా కొడుతున్నారు. సైబర్ క్రిమినల్స్ మాటలకు ట్రాప్ అవుతూ… డబ్బులు పోగొట్టుకుని బకరా అవుతున్నారు. పోలీసులమని చెప్పి చేసే చర్యలపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!