Nellore Crime: నెల్లూరులో సీపీఎం నేత దారణ హత్య.. అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై నిందితుల దాడి..
- నెల్లూరులో రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్..
- తమకు అడ్డుగా ఉన్నాడని స్థానిక సీపీఎం నేత హత్య..
- అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపై దాడి..
- కాల్పులు జరిపిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nellore Crime: నెల్లూరులో గంజాయి బ్యాచ్ బరితెగించింది. విక్రయాలకు అడ్డుగా ఉన్నాడంటూ స్థానిక సీపీఎం కార్యకర్త పెంచలయ్యను అత్యంత కిరాతకంగా హతమార్చింది. కొడుకును స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తున్న క్రమంలో.. వేటాడి వెంటాడి 9 మంది వ్యక్తులు పెంచలయ్యను అత్యంత కిరాతకంగా కత్తులతో హతమార్చారు. హౌసింగ్ బోర్డు ఆర్చి వద్ద జరిగిన ఈ ఘటన కలకలం రేపుతుంది.. అయితే, నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులు పై కూడా గంజాయి బ్యాచ్ ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో పోలీసులు ఒకరిపై కాల్పులు జరపడంతో.. జేమ్స్ అనే నిందితుడి మోకాలికి గాయమైంది..
Read Also: Renu Desai : నన్ను వదిన అని పిలవద్దు.. జానీ మాస్టర్కి రేణు దేశాయ్ సీరియస్ వార్నింగ్
Also Read
- Wife Kills Husband: ఇన్స్ట్రాగ్రామ్ ప్రియుడుతో కలిసి భర్తను హత్య చేసిన భార్య..
- Vijayawada: రౌడీషీటర్ మృతి కేసులో కొత్త ట్విస్ట్.. వెలుగులోకి వచ్చిన సెల్ఫీ వీడియో
- Black Magic: చేతబడి అనుమానం.. పనిమనిషిని దారుణంగా చంపిన డాక్టర్..
- Dowry Harassment: తల్లికి ఫోన్.. తర్వాత గదిలో ఉరి.. పెళ్లయిన 45రోజులకే భార్య ఆత్మహత్య!
నెల్లూరులోని కల్లూరిపల్లిలో RDT కాలనీలో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆర్డీటీ కాలని గంజాయి కి అడ్డాగా మారింది.. దీంతో సీపీఎం కార్యకర్తగా ఉన్న పెంచలయ్య.. గంజాయి కి వ్యతిరేకంగా పోలీసులను కలుపుకొని అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వ్యవహారం గంజాయి బ్యాచ్ కి నచ్చలేదు. దీంతో అతనికి ఎలాగైనా స్పాట్ పెట్టాలని భావించారు. గంజాయి సప్లయర్ గా ఉన్న ఓ మహిళ ఆధ్వర్యంలో పెంచలయ్యను చంపేందుకు రిక్కీ నిర్వహించారు. నిన్న కొడుకును స్కూల్ నుంచి తీసుకొస్తుండగా.. హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆర్చి వద్ద కాపు గాసిన తొమ్మిది మంది గంజాయి బ్యాచ్.. పెంచలయ్య పై కత్తులతో విరుచుకుపడ్డారు. 9 మంది అతనిపై కత్తులతో దాడి చేసి పరారయ్యారు. స్థానికులు పెంచలైన ప్రభుత్వాసుపత్రికి తరలించే లోపే ఆయన మృతి చెందాడు.
Read Also: Body Changes After 30: ముప్పై ఏళ్లు దాటిన తర్వాత మీలో ఇవి కనిపిస్తున్నాయా? అయితే జాగ్రత్త…
ఈ విషయంపై పోలీసులు కూడా స్పందించారు. పెంచలేను హత్య చేసింది గంజాయి బ్యాచ్ అంటూ ప్రకటించారు. నిందితుల కోసం వేట ప్రారంభించిన పోలీసులు.. తెల్లవారుజాము సమయంలో నిందితుడు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్నారని సమాచారం రావడంతో అక్కడికి వెళ్లారు. నిందితుల కోసం గాలిస్తున్న క్రమంలో జేమ్స్ అనే నిందితుడు కనిపించడంతో అతని పట్టుకోబోయారు. అతను పోలీసులపై కత్తితో దాడి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆదినారాయణ అనే కానిస్టేబుల్ కి గాయం అయింది. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జేమ్స్ మోకాలికి గాయమైంది.. మిగిలిన నిందితులు పరారయ్యారు. గాయపడిన జేమ్స్ తో పాటు కానిస్టేబుల్ ఆదినారాయణ పోలీసులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తాజావార్తలు
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
-
IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?