Uttar Pradesh: యూపీలో దారుణం.. విద్యార్థిపై మూత్ర విసర్జన చేసి, దాడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్ ప్రాంతంలో దారుణం జరిగింది. 12 తరగతి చదువుతున్న విద్యార్థిపై కొందరు యువకుల గుంపు దాడి చేసింది, అంతటితో ఆగకుండా అతనిపై మూత్రవిసర్జన చేశారు. ఈ దాడికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో వైరల్గా మారాయి. డార్క్ గ్రే కలర్ జాకెట్ ధరించిన వ్యక్తి బాధిత యువకుడిని కొట్టి, అతనిపై మూత్ర విసర్జన చేయడం వీడియోలో కనిపిస్తోంది. మరో ఇద్దరు ఈ ఉదంతాన్ని వీడియో తీశారు. దాడి ఆపాలని విద్యార్థి ప్రాధేయపడుతున్నా కనికరించలేదు. విద్యార్థి తలపై, వీపుపై ఆ వ్యక్తి పదేపదే దాడి చేయడం కనిపిస్తుంది.
ఈ వీడియో వైరల్ కావడంతో యూపీ పోలీసులు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఇందులో ఒకర్ని అరెస్ట్ చేశారు. నిందితులను అవిశర్మ, ఆశిష్ మాలిక్, రాజన్, మోహిత్ ఠాకూర్లుగా గుర్తించారు. నవంబర్ 13న ఈ ఘటన జరిగింది. దాడిలో పాల్గొన్న ఆశిష్ మాలిక్ని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత యువకుడి తండ్రి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశామని పోలీస్ అధికారి పీయూష్ సింగ్ తెలిపారు.
Also Read
- Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
- AP Crime: ప్రేమ పేరుతో వివాహితకు వేధింపులు.. యువకుడికి గుండు కొట్టి ఊరేగించిన స్థానికులు..!
- Social Boycott: ఏపీలో దారుణం.. ప్రేమ పెళ్లి చేసుకున్న జంటను వెలివేసిన గ్రామ పెద్దలు.. ధిక్కరిస్తే రూ.2 లక్షల జరిమానా..!?
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
Read Also: PM Modi: రేపు కోటి దీపోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోడీ
నగరంలోని తన బంధువు ఇంటికి వెళ్లి వస్తుండగా తన కొడుకును కిడ్నాప్ చేశారని బాధితుడి తండ్రి చెప్పారు. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి దాడి చేశారని తెలిపారు. అతను తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా వెతకగా.. మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకుని, తనపై జరిగిన దాడి గురించి కుటుంబ సభ్యులకు చెప్పాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మొదట్లో ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడి తండ్రి ఆరోపించారు. పోలీసులు నవంబర్ 16 కేసు నమోదు చేశారని, కిడ్నాప్ సెక్షన్లను తప్పించారని కుటుంబీకులు ఆరోపించారు. దాడి చేసిన వారిలో కొందరు బాధిత విద్యార్థి స్నేహితులని, అయితే వీరి మధ్య ఎలాంటి వివాదాలు లేవని కుటుంబీకులు చెబుతున్నారు. నిందితులపై అల్లర్లు, స్వచ్ఛందంగా గాయపరచడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశ్యపూర్వకంగా అవమానించడం, నేరపూరిత బెదిరింపుల కింద అభియోగాలు మోపారు.
తాజావార్తలు
-
OPPO Find X9s: ఒప్పో ఫైండ్ X9s వచ్చేసింది.. 50MP కెమెరా, 7025mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Workers Salary Hike: తెలంగాణ కార్మికులకు భారీ శుభవార్త.. కనీస వేతనాల పెంపుపై కీలక నిర్ణయం
-
PMO Official Gifts: మెలోడీ చాక్లెట్ వివాదం.. విదేశీ పర్యటనల్లో ప్రధాని ఇచ్చిన కానుకల వివరాలు వెల్లడించిన పీఎంఓ
-
YS Jagan: చంద్రబాబు చెప్పిన ప్రకారం పెట్రోల్, డీజిల్పై రూ.8 తగ్గించాలి కదా..? జగన్ డిమాండ్
-
OPPO Find X9 Ultra: 200MP కెమెరా, 7050mAh బ్యాటరీతో.. ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా రిలీజ్
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!