Wife Cheating: కుర్రాడితో భార్య రాసలీలలు.. భర్త వద్దన్నా వినలేదు.. చివరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Cheating: వివాహేతర సంబంధాల మోజులో కొందరు మహిళలు దారుణాలకు ఒడిగడుతున్నారు. తమ రాసలీలలకు, సంతోషాలకు అడ్డుగా ఉన్నారన్న నెపంతో.. కట్టుకున్న భర్తలనే కడతేర్చుతున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక వివాహిత కూడా అదే పని చేసింది. కుర్రాడితో తాను పెట్టుకున్న ఎఫైర్కి అడ్డొస్తున్నాడని, గొంతు నులిమి భర్తని చంపింది. అనంతరం ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు పథకాలు రచించింది. చివరికి అడ్డంగా బుక్కైంది, కటకాలపాలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని గుంజాండి ఊరుకు చెందిన సెల్వరాజ్ (31)కు కొంతకాలం క్రితం వనిత అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
కట్ చేస్తే.. సెల్వరాజ్ ఓ ఫైనాన్షియర్ కావడంతో, ఎక్కువ సమయం బయటే గడిపేవాడు. రాత్రి ఇంటికి రావడానికి కూడా ఆలస్యం అయ్యేది. ఈ క్రమంలోనే.. వనిత ఒక కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో, ఆ కుర్రాడిని ఇంటికి పిలిపించుకునేది. భర్త ఇంటికి రావడం ఆలస్యమైతే, ఇద్దరు కలిసి షికారుకు వెళ్లేవారు. అయితే.. వీరి బాగోతం ఎంతోకాలం దాగి ఉండలేదు. ఒకరోజు వీళ్లు సెల్వరాజ్కు అడ్డంగా బుక్కయ్యారు. తన భర్త ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని అనుకోని, ఒకరోజు కుర్రాడిని ఇంటికి రప్పించుకుంది. పని పెద్దగా లేకపోవడంతో సెల్వరాజ్ త్వరగా ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు ఇంట్లో కుర్రాడితో రాసలీలల్లో మునిగితేలుతున్న భార్యని చూసి ఒక్కసారిగా కుంగిపోయాడు. ఆ కుర్రాడు అక్కడినుంచి పారిపోగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇంకోసారి ఆ కుర్రాడితో తిరిగొద్దని వారించాడు.
Also Read
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
అయినా వనిత వినిపించుకోలేదు. మొదట్లో తాను మారినట్లు నాటకమాడి, ఆ తర్వాత మళ్లీ ఈ కుర్రాడ్ని ఇంటికి రప్పించుకోవడం మొదలుపెట్టింది. దీంతో, భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సెప్టెంబర్ 5వ తేదీ కూడా వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఇక మొత్తానికే భర్త అడ్డు తొలగించుకోవాలనుకొని, అదే రోజు రాత్రి సెల్వరాజ్ నిద్రపోతున్న సమయంలో వనిత అతని గొంతు నులిమి చంపింది. ఉదయాన్నే తన భర్త నిద్రలోనే పోయాడంటూ డ్రామాలాడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. భార్యపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. మరో దారి లేక వనిత తన నేరం ఒప్పుకుంది. మంగళవారం ఈ కేసుని కోర్టు విచారించగా.. నేరం నిరూపితం కావడంతో వనితకు యావజ్జీవ శిక్ష విధించింది.
తాజావార్తలు
-
Redmi Turbo 5: రెడ్మీ టర్బో 5 స్మార్ట్ఫోన్ రిలీజ్ కు రెడీ.. 7560mAh బ్యాటరీ, 6.59-అంగుళాల AMOLED డిస్ప్లే
-
Keerthy Suresh: అందుకే మీడియాకు ధూరంగా ఉన్న.. కీర్తి సురేష్ ఎమోషనల్ కామెంట్స్!
-
Drumstick Curry Recipe: మధ్యాహ్న భోజనానికి స్పెషల్.. శనగపిండి – పెరుగు పులుసుతో టేస్టీ మునగకాయ కూర..
-
Kishan Reddy: రైతు హామీలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే.. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి ఫైర్..
-
NEET UG 2026 Paper Leak: నీట్ పేపర్ ఇలా లీక్ అయ్యిందన్నమాట! కోర్టులో సంచలన రహస్యాలు వెల్లడించిన సీబీఐ..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..