Wife Cheating: కుర్రాడితో భార్య రాసలీలలు.. భర్త వద్దన్నా వినలేదు.. చివరికి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wife Cheating: వివాహేతర సంబంధాల మోజులో కొందరు మహిళలు దారుణాలకు ఒడిగడుతున్నారు. తమ రాసలీలలకు, సంతోషాలకు అడ్డుగా ఉన్నారన్న నెపంతో.. కట్టుకున్న భర్తలనే కడతేర్చుతున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన ఒక వివాహిత కూడా అదే పని చేసింది. కుర్రాడితో తాను పెట్టుకున్న ఎఫైర్కి అడ్డొస్తున్నాడని, గొంతు నులిమి భర్తని చంపింది. అనంతరం ఈ కేసుని తప్పుదోవ పట్టించేందుకు పథకాలు రచించింది. చివరికి అడ్డంగా బుక్కైంది, కటకాలపాలైంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. సేలం జిల్లా మేట్టూరు సమీపంలోని గుంజాండి ఊరుకు చెందిన సెల్వరాజ్ (31)కు కొంతకాలం క్రితం వనిత అనే మహిళతో వివాహం అయ్యింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.
కట్ చేస్తే.. సెల్వరాజ్ ఓ ఫైనాన్షియర్ కావడంతో, ఎక్కువ సమయం బయటే గడిపేవాడు. రాత్రి ఇంటికి రావడానికి కూడా ఆలస్యం అయ్యేది. ఈ క్రమంలోనే.. వనిత ఒక కుర్రాడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో, ఆ కుర్రాడిని ఇంటికి పిలిపించుకునేది. భర్త ఇంటికి రావడం ఆలస్యమైతే, ఇద్దరు కలిసి షికారుకు వెళ్లేవారు. అయితే.. వీరి బాగోతం ఎంతోకాలం దాగి ఉండలేదు. ఒకరోజు వీళ్లు సెల్వరాజ్కు అడ్డంగా బుక్కయ్యారు. తన భర్త ఇంటికి రావడం ఆలస్యం అవుతుందని అనుకోని, ఒకరోజు కుర్రాడిని ఇంటికి రప్పించుకుంది. పని పెద్దగా లేకపోవడంతో సెల్వరాజ్ త్వరగా ఇంటికి చేరుకున్నాడు. అప్పుడు ఇంట్లో కుర్రాడితో రాసలీలల్లో మునిగితేలుతున్న భార్యని చూసి ఒక్కసారిగా కుంగిపోయాడు. ఆ కుర్రాడు అక్కడినుంచి పారిపోగా.. భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇంకోసారి ఆ కుర్రాడితో తిరిగొద్దని వారించాడు.
Also Read
- Car Malware Alert: కార్లకు సైబర్ షాక్.. ప్రపంచంలోనే తొలి ‘కార్ మాల్వేర్’ గుర్తింపు!
- Balloon Stuck in Throat: బెలూన్ ఊదుతుండగా విషాదం.. గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల బాలుడు మృతి
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Vijayawada Crime: స్నాప్లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
అయినా వనిత వినిపించుకోలేదు. మొదట్లో తాను మారినట్లు నాటకమాడి, ఆ తర్వాత మళ్లీ ఈ కుర్రాడ్ని ఇంటికి రప్పించుకోవడం మొదలుపెట్టింది. దీంతో, భార్యాభర్తల మధ్య గొడవలు జరిగేవి. సెప్టెంబర్ 5వ తేదీ కూడా వీరి మధ్య ఘర్షణ జరిగింది. ఇక మొత్తానికే భర్త అడ్డు తొలగించుకోవాలనుకొని, అదే రోజు రాత్రి సెల్వరాజ్ నిద్రపోతున్న సమయంలో వనిత అతని గొంతు నులిమి చంపింది. ఉదయాన్నే తన భర్త నిద్రలోనే పోయాడంటూ డ్రామాలాడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. భార్యపై అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించారు. మరో దారి లేక వనిత తన నేరం ఒప్పుకుంది. మంగళవారం ఈ కేసుని కోర్టు విచారించగా.. నేరం నిరూపితం కావడంతో వనితకు యావజ్జీవ శిక్ష విధించింది.
తాజావార్తలు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
-
OTR: టీడీపీకి మింగుడుపడని ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాలు
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..