Chennai: ఏడేళ్ల నాటి మర్డర్ మిస్టరీ వీడింది.. చంపిందెవరంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనుమానం పెనుభూతమైంది.. తరచూ జరుగుతున్న గొడవలతో భార్యను చంపేశాడు.. డెడ్బాడీ మాయం చేశాడు. కానీ డంపింగ్ యార్డ్లో బయటపడ్డ శరీర భాగాలు కేసు వెలుగులోకి వచ్చింది. కానీ అప్పటికీ కేసులో మిస్టరీ వీడలేదు. ఇంతకీ ఆ మహిళ ఎవరు? అనేది తేల్చేందుకు పోలీసులు శ్రమించారు. ఏడేళ్లు కష్టపడి భర్తే హత్య చేసినట్లు తేల్చారు.
2019 జనవరిలో చెన్నైలో నటి సంధ్య హత్య జరిగింది. ఆమె భర్తే అతి కిరాతకంగా హతమార్చి, శరీరాన్ని ముక్కలుగా నరికేశాడు. అంతే కాదు ఆ శరీర భాగాలను చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ యార్డులలో పారేశాడు. ఈ ఘటన అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసును మృతురాలి చేతిపై ఉన్న రెండు టాటూల ఆధారంగా ఛేదించారు పోలీసులు.
Also Read
- BE ALERT: అమ్మాయికి మొగుడు.. అత్తకు యముడు..!
- Workplace Harassment: 4 నెలలుగా వీక్లీ ఆఫ్ లేదు.. ఉద్యోగ వేధింపులతో మహిళ సూసైడ్..
- Kakinada: కాలేజ్ యాజమాన్యం వేధింపులకి విద్యార్థి బలి.. మనస్దాపంతో ఉరి వేసుకుని విద్యార్ది ఆత్మహత్య.!
- Delhi: ఘోరం.. వెబ్ సిరీస్ చూసి భార్యను చంపిన టెకీ.. ఆ తర్వాత ఏం చేశాడంటే..!
ఏడేళ్ల కిందట.. చెన్నైలోని పళ్లికరనై డంపింగ్ యార్డ్లో ఓ ప్లాస్టిక్ సంచిలో మనుషుల వేళ్లు బయటపడటంతో ఈ కేసు బయటకు వచ్చింది. ఆ సంచిని ఓపెన్ చేసి చూడగా.. తెగిపడిన కాళ్లు, చేయి కనిపించాయి. ఆ తర్వాత నగరంలోని ఓ నది పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో ఇలాంటి ప్లాస్టిక్ సంచులు మరికొన్ని లభ్యమయ్యాయి. వాటిలో ఎముకలు, అంతర్గత అవయవాలు వంటివి ఉన్నాయి. అయితే.. మృతురాలిని గుర్తించేందుకు వీలుగా తల, ఎడమ చేయి మాత్రం కనిపించలేదు. ఈ కేసును పోలీసులు ఛేదించారు కానీ ఆమె తలను మాత్రం కనిపెట్టలేకపోయారు. దీంతో ఆ మృతదేహం ఆమెదేనని కచ్చితంగా నిర్ధారించేందుకు ముఖం లేకుండా పోయింది. కొన్ని మిస్సింగ్ కేసులతో పోల్చిచూసినా సరైన పోలిక లేదు. దీంతో పళ్లికరనై డంపింగ్ యార్డ్లో ఏకంగా 11,700 టన్నుల చెత్తను జల్లెడ పట్టారు. అయినప్పటికీ తల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.
పోలీసులకు దొరికిన కుడి చేతిపై 2 ప్రత్యేకమైన టాటూలు ఉన్నాయి. వాటిని శివపార్వతుల రూపం, డ్రాగన్గా గుర్తించారు పోలీసులు. అదే సమయంలో తూత్తుకుడికి చెందిన ఓ మహిళ తన కూతురు కనిపించడం లేదని పోలీసులు ఆశ్రయించారు. కనిపించకుండా పోయిన ఆమె చెన్నైలో నివసించే 37 ఏళ్ల నటి సంధ్యగా తేలింది. దీంతో ఆ మృతదేహాన్ని తల్లి పరిశీలించి.. చేతిపై ఉన్న టాటూలు, గాజుల ఆధారంగా ఆమె తన కూతురేనని గుర్తించారు. ఆ తర్వాత డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆమె చెప్పింది నిజమేనని తేలింది.
ఈ కేసులో సంధ్య భర్త సినీ నిర్మాత బాలకృష్ణన్ను పోలీసులు విచారణ చేశారు. ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర బంధం ఉందన్న అనుమానంతో రోజూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవని.. అందుకే ఆమెను గొడ్డలితో నరికి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నాడు. కేసు నుంచి తప్పించుకునేందుకు డెడ్బాడీని ముక్కలు చేసి ప్లాస్టిక్ సంచుల్లో వేసి పడేసినట్లు చెప్పాడు. నిందితుడి ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దీన్ని నిర్ధారించారు.
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!