Haryana: అమ్మాయిల వేధింపులు.. 9వ తరగతి బాలుడు ఆత్మహత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Haryana: ప్రస్తుత కాలంలో ప్రతీ చిన్న సమస్యకు ఆత్మహత్యనే పరిష్కారం అనుకుంటున్నారు. నేటి తరం చిన్న కష్టాన్ని కూడా తట్టుకోవడం లేదు. యువత కష్టాలతో ధైర్యంగా పోరాడలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే మైనర్లు కూడా ఆత్మహత్యలకు పాల్పడటం కలవరపరుస్తోంది. చిన్న చిన్న కారణాలకే తనువు చాలిస్తున్నారు.
హర్యానాలో ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. 14 ఏళ్ల వయసున్న 9వ తరగతి బాలుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కారణం ఏంటంటే.. తన క్లాసులోని ఇద్దరు అమ్మాయిలు వేధించడమే. హర్యానా హిస్సార్ లోని ఓ ప్రైవేట్ స్కూలులో చదువుతున్న విద్యార్థిని ఇద్దరు విద్యార్థినులు వేధింపులకు గురిచేశారు. వేధింపులకు తాళలేకే బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ఈ రోజు తెలిపారు.
Also Read
Read Also: Sharad Pawar: బీజేపీతో వెళ్లే ప్రసక్తే లేదు.. శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..
శనివారం బాలుడు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరు విద్యార్థినులు పదేపదే వేధింపులకు గురిచేయడంతో బాలుడు కలత చెందాడని, ఈ విషయాన్ని టీచర్ దృష్టికి తీసుకెళ్లాడని పోలీసులు వెల్లడించారు. టీచర్ చర్యలు తీసుకోకపోవడంతో ఈ ఘోరం జరిగింది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు ఇద్దరు అమ్మాయిలతో పాటు పాఠశాల ఉపాధ్యాయుడిపై అధికారులు కేసు నమోదు చేశారు.
ఐపీసీ సెక్షన్లు 305 (పిల్లల ఆత్మహత్యకు ప్రేరేపించడం), 34 ప్రకారం కేసులు నమోదు చేశారు. సంఘటన జరిగిన సమయంలో బాలుడి తల్లి వేరే చోట ఉందని, తాత ముందుగా మృతదేహాన్ని చూశాడని పోలీసులు వెల్లడించారు. బాధిత కుటుంబం కేసు నమోదు చేసిందని ఈ ఘటనలో దర్యాప్తు జరుగుతోందని స్థానిక స్టేషన్ హౌజ్ ఆఫీసర్ కుల్దీప్ సింగ్ తెలిపారు.
తాజావార్తలు
-
Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ స్ఫూర్తిగా ముందుకు సాగాలి.. యువ క్యాడెట్లకు రక్షణ మంత్రి పిలుపు
-
Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
-
Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్’తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
-
Devara : ట్రోల్స్పై మౌనం వీడిన ‘దేవర’ డీఓపీ… హీరోల హైట్ పై షాకింగ్ కామెంట్స్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!