Bhimavaram Double Murder: తల్లి, తమ్ముడి దారుణ హత్య.. ఫోన్ చేసిన పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు..
- పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం..
- తల్లిని, తమ్ముడిపై కత్తితో దాడి చేసి చంపిన వ్యక్తి..
- 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగుబాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhimavaram Double Murder: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. మన్నా చర్చ్ ఎదురుగా ఉండే ఇంటిలో తల్లిని, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు దాడి చేశాడు గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఈ ఘటనలో తల్లి గునుపూడి మహాలక్ష్మి, రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వివరాలు సేకరించారు.. అయితే, మతిస్థిమితం కోల్పోయిన శ్రీనివాస్.. తల్లిని, తమ్ముడిని కత్తితో హత్య చేసి నేరుగా పోలీసులకే సమాచారం ఇచ్చి లొంగిపోయాడని చెబుతున్నారు..
Read Also: Revolver Rita :ఫైనల్గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన కీర్తీ సురేష్ మూవీ!
Also Read
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Ketan Agarwal Case: కేతన్ పాస్పోర్ట్ పోయినప్పుడు జరిగిందిదే.. క్యాబ్ డ్రైవర్ సంచలన వ్యాఖ్యలు
భీమవరం సుంకర పద్దయ్య వీధిలో వీధిలో నివాసముంటున్న గునుపూడి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజను కత్తితో నరికి హత్య చేశాడు. అంతేకాకుండా తల్లిని, తమ్ముడిని కత్తితో హత్య చేసానని ఇప్పుడు తాను వచ్చి లొంగిపోవాలని నేరుగా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు నిందితుడు శ్రీనివాస్. ఈ సమాచారంతో అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, డీఎస్పీ జై సూర్య, వన్టౌన్ సీఐ నాగరాజులు పరిశీలించారు. ఈ ఘటనపై ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్ తల్లిని, తమ్ముడిని హత్య చేశానని పోలీసులకి నేరుగా సమాచారం ఇవ్వడం జరిగిందని, అయితే కరోనా సమయంలో శ్రీనివాస్ తండ్రి మరణించడంతో అప్పటినుండి శ్రీనివాస్ మతిస్థిమితం లేకుండా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ ఈ ఘాతాకానికి పాల్పడ్డాడని, ప్రస్తుతం శ్రీనివాస్ కు మెంటల్ కండిషన్ బాగోలేదని, ఆసుపత్రిలో చెక్ చేస్తున్నామని అన్నారు. శ్రీనివాస్ సిస్టర్ బెంగళూరు నుండి వస్తున్నారని, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు ఎస్పీ..
తాజావార్తలు
-
Yash: ‘టాక్సిక్’ లేడీస్ వచ్చే టైం ఫిక్స్ చేసిన రాకింగ్ స్టార్.. యష్ సంచలన ట్వీట్ వైరల్!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Ketan Agarwal Case: తొలిసారి మీడియా ముందు నోరు విప్పిన సియా సోదరుడు.. ఏం చెప్పాడంటే..!
-
Pakistan: పాకిస్థాన్లో హై అలర్ట్.. ఇమ్రాన్ ఖాన్ ఉన్న జైలు నుంచి 14 మంది ఖైదీలు పరార్! అసలేం జరిగిందంటే?
-
TG Bharath: రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 10 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.!
ట్రెండింగ్
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!