Bhimavaram Double Murder: తల్లి, తమ్ముడి దారుణ హత్య.. ఫోన్ చేసిన పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు..
- పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం..
- తల్లిని, తమ్ముడిపై కత్తితో దాడి చేసి చంపిన వ్యక్తి..
- 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చి లొంగుబాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhimavaram Double Murder: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటు చేసుకుంది. మన్నా చర్చ్ ఎదురుగా ఉండే ఇంటిలో తల్లిని, తమ్ముడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు దాడి చేశాడు గునుపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి.. ఈ ఘటనలో తల్లి గునుపూడి మహాలక్ష్మి, రవితేజ అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిని తమ్ముడిని హత్య చేసిన అనంతరం నిందితుడు 112 కాల్ ద్వారా పోలీసులకు సమాచారం అందించడం. ఘటన స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ నయీమ్ అస్మి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది వివరాలు సేకరించారు.. అయితే, మతిస్థిమితం కోల్పోయిన శ్రీనివాస్.. తల్లిని, తమ్ముడిని కత్తితో హత్య చేసి నేరుగా పోలీసులకే సమాచారం ఇచ్చి లొంగిపోయాడని చెబుతున్నారు..
Read Also: Revolver Rita :ఫైనల్గా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన కీర్తీ సురేష్ మూవీ!
Also Read
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
భీమవరం సుంకర పద్దయ్య వీధిలో వీధిలో నివాసముంటున్న గునుపూడి శ్రీనివాస్ ఈరోజు తెల్లవారుజామున తల్లి మహాలక్ష్మి, తమ్ముడు రవితేజను కత్తితో నరికి హత్య చేశాడు. అంతేకాకుండా తల్లిని, తమ్ముడిని కత్తితో హత్య చేసానని ఇప్పుడు తాను వచ్చి లొంగిపోవాలని నేరుగా 112 కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు నిందితుడు శ్రీనివాస్. ఈ సమాచారంతో అలెర్ట్ అయిన పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి, డీఎస్పీ జై సూర్య, వన్టౌన్ సీఐ నాగరాజులు పరిశీలించారు. ఈ ఘటనపై ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ శ్రీనివాస్ తల్లిని, తమ్ముడిని హత్య చేశానని పోలీసులకి నేరుగా సమాచారం ఇవ్వడం జరిగిందని, అయితే కరోనా సమయంలో శ్రీనివాస్ తండ్రి మరణించడంతో అప్పటినుండి శ్రీనివాస్ మతిస్థిమితం లేకుండా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీనివాస్ ఈ ఘాతాకానికి పాల్పడ్డాడని, ప్రస్తుతం శ్రీనివాస్ కు మెంటల్ కండిషన్ బాగోలేదని, ఆసుపత్రిలో చెక్ చేస్తున్నామని అన్నారు. శ్రీనివాస్ సిస్టర్ బెంగళూరు నుండి వస్తున్నారని, వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు ఎస్పీ..
తాజావార్తలు
-
Jayam Ravi Divorce Case : మళ్ళీ కోర్టు మెట్లెక్కిన జయంరవి భార్య… ఈసారి ఏమైందంటే ?
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Blaupunkt QLED TV: థియేటర్ లాంటి అనుభవం.. Google TV 5.0తో బ్లాపంక్ట్ కొత్త QLED స్మార్ట్ టీవీలు.. చౌక ధరకే
-
RC 17 : సుకుమార్ సినిమాలో చరణ్ ఇలా ఉంటాడా?
-
Arjun Tendulkar: అచ్చు తండ్రి మాదిరే.. అర్జున్ టెండూల్కర్ గొప్ప మనసు.. వీడియో వైరల్!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?