Bengaluru: సోషల్ మీడియాలో వివాహితకు ఉద్యోగి బెదిరింపులు.. కంపెనీ ఏం చేసిందంటే..!
- సోషల్ మీడియాలో వివాహితకు ఉద్యోగి బెదిరింపులు
- జాబ్ నుంచి తొలగించిన ఎటియోస్ సర్వీసెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో.. అక్కడ దైవత్వం వికసిస్తుందని అంటారు. అలాంటిది ఓ కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా వివాహిత దుస్తులపై కామెంట్స్ చేయడమే కాకుండా.. యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఈ వ్యవహారం కంపెనీ దృష్టికి వెళ్లడంతో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: ARM: సినిమా పైరసీ.. ఇద్దరు అరెస్ట్!
Also Read
- Inder kaur: పంజాబ్ గాయని ఇందర్ కౌర్ హత్య.. కాలువలో శవం లభ్యం
- Hyderabad: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
నికిత్ శెట్టి అనే యువకుడు బెంగళూరులోని ఎటియోస్ సర్వీసెస్లో పనిచేస్తున్నాడు. ఇతడు సోషల్ మీడియాలో ఒక వివాహిత దుస్తుల ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్ను మహిళ భర్త ప్రభుత్వాధికారులకు షేర్ చేశాడు. కర్ణాటక డీజీపీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లకు ట్యాగ్ చేస్తూ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో భార్యకు పంపిన బెదిరింపు సందేశం స్క్రీన్షాట్ కంపెనీ దృష్టికి వెళ్లడంతో వెంటనే చర్యలకు దిగింది. ఇది ఆమోదయోగ్యం కాదని.. అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Nobel Peace Prize 2024: నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రకటన..
‘‘ఇది చాలా తీవ్రమైనది. @DgpKarnataka, @CMofKarnataka, @DKShivakumar. బట్టల ఎంపికపై నా భార్య ముఖంపై యాసిడ్ పోస్తానని ఈ వ్యక్తి బెదిరిస్తున్నాడు. ఎలాంటి సంఘటన జరగకుండా ఈ వ్యక్తిపై వెంటనే చర్య తీసుకోండి’’ అని షాబాజ్ అన్సార్ ట్వీట్ చేశాడు. కర్ణాటక డీజీపీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను ట్యాగ్ చేస్తూ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ‘‘నా భార్యను యాసిడ్ దాడితో బెదిరిస్తున్న వ్యక్తి ఎటియోస్ డిజిటల్ సర్వీస్లో పనిచేస్తున్నాడు. ఈ సంస్థలో మహిళలు సురక్షితంగా ఉన్నారని నేను అనుకోను’’ అని షాబాజ్ అన్సార్ పేర్కొన్నాడు.
ఈ సంఘటనపై ఎటియోస్ సర్వీసెస్ ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రకటనను విడుదల చేసింది. నికిత్ రెడ్డి చర్య ఆమోదయోగ్యం కాదని.. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. అవసరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. మేము చాలా బాధపడ్డాము. ఈ ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు మరియు ఎటియోస్ సర్వీసెస్లో మేము పాటించే ప్రధాన విలువలకు విరుద్ధంగా ఉంది.’’ అని కంపెనీ తెలిపింది. ఈ ఘటనపై నికిత్ శెట్టిపై కేసు నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Nayab Singh Saini: అక్టోబర్ 15న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం..
తాజావార్తలు
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Telangana Jobs : మెడికల్ జాబ్స్ అలర్ట్.. 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.!
-
PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
-
Virat Kohli: SRH మ్యాచ్కు ముందు కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఈ స్థితికి కారణం వారే అంటూ..
-
Peddi: ‘పెద్ది’కి లైన్ క్లియర్.. పర్సంటేజ్ విధానంపై గుడ్ న్యూస్
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!