Bengaluru: సోషల్ మీడియాలో వివాహితకు ఉద్యోగి బెదిరింపులు.. కంపెనీ ఏం చేసిందంటే..!
- సోషల్ మీడియాలో వివాహితకు ఉద్యోగి బెదిరింపులు
- జాబ్ నుంచి తొలగించిన ఎటియోస్ సర్వీసెస్
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో.. అక్కడ దైవత్వం వికసిస్తుందని అంటారు. అలాంటిది ఓ కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా వివాహిత దుస్తులపై కామెంట్స్ చేయడమే కాకుండా.. యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఈ వ్యవహారం కంపెనీ దృష్టికి వెళ్లడంతో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: ARM: సినిమా పైరసీ.. ఇద్దరు అరెస్ట్!
Also Read
నికిత్ శెట్టి అనే యువకుడు బెంగళూరులోని ఎటియోస్ సర్వీసెస్లో పనిచేస్తున్నాడు. ఇతడు సోషల్ మీడియాలో ఒక వివాహిత దుస్తుల ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్ను మహిళ భర్త ప్రభుత్వాధికారులకు షేర్ చేశాడు. కర్ణాటక డీజీపీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లకు ట్యాగ్ చేస్తూ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో భార్యకు పంపిన బెదిరింపు సందేశం స్క్రీన్షాట్ కంపెనీ దృష్టికి వెళ్లడంతో వెంటనే చర్యలకు దిగింది. ఇది ఆమోదయోగ్యం కాదని.. అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Nobel Peace Prize 2024: నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రకటన..
‘‘ఇది చాలా తీవ్రమైనది. @DgpKarnataka, @CMofKarnataka, @DKShivakumar. బట్టల ఎంపికపై నా భార్య ముఖంపై యాసిడ్ పోస్తానని ఈ వ్యక్తి బెదిరిస్తున్నాడు. ఎలాంటి సంఘటన జరగకుండా ఈ వ్యక్తిపై వెంటనే చర్య తీసుకోండి’’ అని షాబాజ్ అన్సార్ ట్వీట్ చేశాడు. కర్ణాటక డీజీపీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను ట్యాగ్ చేస్తూ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ‘‘నా భార్యను యాసిడ్ దాడితో బెదిరిస్తున్న వ్యక్తి ఎటియోస్ డిజిటల్ సర్వీస్లో పనిచేస్తున్నాడు. ఈ సంస్థలో మహిళలు సురక్షితంగా ఉన్నారని నేను అనుకోను’’ అని షాబాజ్ అన్సార్ పేర్కొన్నాడు.
ఈ సంఘటనపై ఎటియోస్ సర్వీసెస్ ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రకటనను విడుదల చేసింది. నికిత్ రెడ్డి చర్య ఆమోదయోగ్యం కాదని.. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. అవసరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. మేము చాలా బాధపడ్డాము. ఈ ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు మరియు ఎటియోస్ సర్వీసెస్లో మేము పాటించే ప్రధాన విలువలకు విరుద్ధంగా ఉంది.’’ అని కంపెనీ తెలిపింది. ఈ ఘటనపై నికిత్ శెట్టిపై కేసు నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Nayab Singh Saini: అక్టోబర్ 15న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం..
తాజావార్తలు
-
Donald Trump: ఎఫ్బీఐ చీఫ్ కాష్ పటేల్ను టార్గెట్ చేసిన ట్రంప్..!
-
Top 3 Scooters: 51 లక్షల యూనిట్ల అమ్మకాలు.. జనం ఎగబడి కొంటున్న టాప్ 3 స్కూటర్లు ఇవే.. ధరలు, మైలేజ్ & ఫీచర్లు
-
Paranormal Activity: పెట్టింది రూ.12 లక్షలు.. కొల్లగొట్టింది రూ.16 వేల కోట్లు! సినిమా చరిత్రలోనే అతిపెద్ద మిరాకిల్..
-
Green Moong Dal Laddu: ప్రోటీన్ పుష్కలంగా ఉండే పెసరపప్పు బెల్లం లడ్డు.. పిల్లల కోసం అదిరిపోయే హెల్దీ స్నాక్.!
-
CSK Vs GT: ఒంటరి పోరాటం చేసిన రుతురాజ్ గైక్వాడ్.. చెపాక్లో కెప్టెన్ వీరోచిత ఇన్నింగ్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!