Bengaluru: సోషల్ మీడియాలో వివాహితకు ఉద్యోగి బెదిరింపులు.. కంపెనీ ఏం చేసిందంటే..!
- సోషల్ మీడియాలో వివాహితకు ఉద్యోగి బెదిరింపులు
- జాబ్ నుంచి తొలగించిన ఎటియోస్ సర్వీసెస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో.. అక్కడ దైవత్వం వికసిస్తుందని అంటారు. అలాంటిది ఓ కంపెనీ ఉద్యోగి సోషల్ మీడియా వేదికగా వివాహిత దుస్తులపై కామెంట్స్ చేయడమే కాకుండా.. యాసిడ్ పోస్తానని బెదిరించాడు. ఈ వ్యవహారం కంపెనీ దృష్టికి వెళ్లడంతో ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: ARM: సినిమా పైరసీ.. ఇద్దరు అరెస్ట్!
Also Read
- Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
- Nayeem Mu*rder: నాగోల్లో రౌడీషీటర్ నయీమ్ హత్య.. అదుపులో ఆరుగురు నిందితులు.!
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
- Mother Murder Case: గుంటూరులో దారుణం.. ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసిన కూతురు..! డబ్బుల కోసమేనా..?
నికిత్ శెట్టి అనే యువకుడు బెంగళూరులోని ఎటియోస్ సర్వీసెస్లో పనిచేస్తున్నాడు. ఇతడు సోషల్ మీడియాలో ఒక వివాహిత దుస్తుల ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేయడమే కాకుండా యాసిడ్ పోసి చంపేస్తానని బెదిరించాడు. ఇందుకు సంబంధించిన స్క్రీన్షాట్ను మహిళ భర్త ప్రభుత్వాధికారులకు షేర్ చేశాడు. కర్ణాటక డీజీపీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లకు ట్యాగ్ చేస్తూ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ఇన్స్టాగ్రామ్లో భార్యకు పంపిన బెదిరింపు సందేశం స్క్రీన్షాట్ కంపెనీ దృష్టికి వెళ్లడంతో వెంటనే చర్యలకు దిగింది. ఇది ఆమోదయోగ్యం కాదని.. అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Nobel Peace Prize 2024: నోబెల్ శాంతి బహుమతి విజేత ప్రకటన..
‘‘ఇది చాలా తీవ్రమైనది. @DgpKarnataka, @CMofKarnataka, @DKShivakumar. బట్టల ఎంపికపై నా భార్య ముఖంపై యాసిడ్ పోస్తానని ఈ వ్యక్తి బెదిరిస్తున్నాడు. ఎలాంటి సంఘటన జరగకుండా ఈ వ్యక్తిపై వెంటనే చర్య తీసుకోండి’’ అని షాబాజ్ అన్సార్ ట్వీట్ చేశాడు. కర్ణాటక డీజీపీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను ట్యాగ్ చేస్తూ జర్నలిస్ట్ ట్వీట్ చేశాడు. ‘‘నా భార్యను యాసిడ్ దాడితో బెదిరిస్తున్న వ్యక్తి ఎటియోస్ డిజిటల్ సర్వీస్లో పనిచేస్తున్నాడు. ఈ సంస్థలో మహిళలు సురక్షితంగా ఉన్నారని నేను అనుకోను’’ అని షాబాజ్ అన్సార్ పేర్కొన్నాడు.
ఈ సంఘటనపై ఎటియోస్ సర్వీసెస్ ఇన్స్టాగ్రామ్లో ఒక ప్రకటనను విడుదల చేసింది. నికిత్ రెడ్డి చర్య ఆమోదయోగ్యం కాదని.. తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. అవసరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది. మేము చాలా బాధపడ్డాము. ఈ ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు మరియు ఎటియోస్ సర్వీసెస్లో మేము పాటించే ప్రధాన విలువలకు విరుద్ధంగా ఉంది.’’ అని కంపెనీ తెలిపింది. ఈ ఘటనపై నికిత్ శెట్టిపై కేసు నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది. ఐదు సంవత్సరాల పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇది కూడా చదవండి: Nayab Singh Saini: అక్టోబర్ 15న హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారం..
తాజావార్తలు
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్తో రాబోతున్నాడా?
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!