Bengaluru: మహిళపై బైక్-టాక్సీ డ్రైవర్ లైంగిక వేధింపులు.. రూట్ మార్చి, కోపరేట్ చేయాలంటూ..
- మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న బైక్-టాక్సీ డ్రైవర్లు..
- బెంగళూర్లో మహిళపై రాపిడో డ్రైవర్ లైంగిక వేధింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bengaluru: ఇటీవల కాలంలో బైక్-ట్యాక్సీ రైడర్ల వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. రాత్రి సమయాల్లో గమ్యస్థానం వెళ్లేందుకు బైక్స్, ఆటో, కార్లు బుక్ చేసుకుంటున్న మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. బెంగళూర్లో 28 ఏళ్ల మహిళపై ఓ ర్యాపిడో డ్రైవర్ అర్ధరాత్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూలై 5న రాత్రి 11.40 గంటల నుంచి అర్ధరాత్రి 12.00 గంటల మధ్య జరిగిందిన బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది.
Read Also: MP High Court: భార్య వంట చేయకపోవడం, భర్తను బట్టలు ఉతకమనడం.. ఆత్మహత్యకు కారణాలు కావు..
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
సర్జాపూర్ రోడ్లోని రాధారెడ్డి లేఅవుట్లో నివాసం ఉంటున్న మహిళ ఓ హోటల్లో స్టోర్ సూపర్వైజర్గా పనిచేస్తోంది. అదే హోటల్లో ఆమె భర్త కూడా పనిచేస్తున్నట్లు బెల్లందూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాత్రి 11.20 గంటలకు ఇంటికి వెళ్లేందుకు బైక్ టాక్సీని బుక్ చేసుకున్నట్లు చెప్పారు. 20 ఏళ్ల బిస్వజిత్ నాథ్ బైక్ డ్రైవర్గా చెప్పింది. ఇంటికి వెళ్తున్న సమయంలో వర్షపు నీరు ఎక్కువగా ఉందని వేరే రహదారి తీసుకుంటున్నట్లు పేర్కొంటూ బిస్వజిత్ తన మార్గాన్ని మార్చాడని, ఆ సమయంలో తాను తన స్నేహితురాలితో బెంగాలీలో మాట్లాడానని, బిస్వజిత్ తనను బెంగాలీ అని అడిగి మాట కలిపినట్లు చెప్పింది. ఇంతలోనే ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అసభ్యంగా తాకుతూ కోపరేట్ చేయాలని కోరాడని, తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే చెంప కొట్టాడని మహిళ పేర్కొంది.
తన మొబైల్ ఫోన్, నగదు తీసుకున్నాడని, తనను ఏం చేయొద్దని అతడిని వేడుకున్నట్లు చెప్పింది. దాదాపుగా 30 నిమిషాల పాటు ఎంతకీ లొంగలేదని, తనను ఇంటి వద్ద లేకపోతే ఏదైనా లోకేషన్ వద్ద డ్రాప్ చేయాలని కోరానని చెప్పారు. నిందితుడు తనను ఆర్ఎంజెడ్ ఎకో వరల్డ్ వద్ద దించేసి, మొబైల్ ఫోన్ ఇచ్చేసి రూ. 800 తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. అయితే, అతడి బైక్ నెంబర్ నోట్ చేయలేదని, రాపిడోకి ఫిర్యాదు చేసి, అతడి పేరు బిశ్వజిత్గా చెప్పానని, వారు నిందితుడిని తొలగిస్తామని చెప్పారని పేర్కొంది. అతడి పేరు, నంబర్ ఇతర వివరాలు ఇవ్వడంతో అతడిపై ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.
తాజావార్తలు
-
Vizag: స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. తొమ్మిదికి చేరిన మృతుల సంఖ్య.! దర్యాప్తులో సంచలన విషయాలు..
-
Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు సుస్సు పడింది.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
-
UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
-
Story Board : ప్రధాని మోడీ సక్సెస్ సీక్రెట్ ఏంటి? నెహ్రూ రికార్డు ఎలా బద్దలు కాబోతుంది?
-
Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!
ట్రెండింగ్
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!
-
WWDCలో పొరపాటున ‘ఫోల్డబుల్ ఐఫోన్’ వివరాలు లీక్ చేసుకున్న Apple.!
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి