కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జగన్నాథ్పల్లి గేట్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 గురు మృతి చెందడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు బండి సంజయ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతున్నాయని బండి సంజయ్ ఆందోళన వ్యక్తం చేశారు.