AP Crime: మంత్రి నారా లోకేష్ ఫొటో వాట్సాప్ డీపీగా పెట్టి మోసం..
- మంత్రి నారా లోకేష్ ఫోటో వాట్సప్ డీపీగా పెట్టుకుని మోసాలు..
- ఇద్దరిని అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు...
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని అమాయకులను మోసం చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది.. తాజాగా, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫోటోను తమ వాట్సాప్ డీపీగా పెట్టుకుని.. తాము ఎన్.ఆర్.ఐ.లమని చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు కీలక నిందితులను అరెస్ట్ చేసింది సీఐడీ.. ఈ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న సాయి శ్రీనాథ్ (గచ్చిబౌలి, హైదరాబాద్), సుమంత్ (పఠాన్ చెరువు) లను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ మరో నిందితుడు రాజేష్ తో కలిసి ఒక ముఠాగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు..
Read Also: Off The Record : జూబ్లీ హిల్స్ పోరులో మైనార్టీల ఓట్లు ఎవరికి?
Also Read
- Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
- Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
- Family: రూ.2వేలు అద్దె చెల్లించలేక.. యజమాని వద్దకు భార్య, కూతుర్ని పంపి..
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
నిందితుల ట్రాప్లో పడ్డారు పలువురు సోషల్ మీడియా యూజర్లు… ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై చురుకుగా ఉంటూ… వైద్య సహాయం అవసరం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకునేవారు. తాము విదేశాల్లో స్థిరపడిన భారతీయులమని పరిచయం చేసుకుని, సాయం చేస్తామని నమ్మబలికేవారు. ఈ విధంగా ప్రజల నుంచి సులభంగా డబ్బులు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. మంత్రి నారా లోకేష్ ఫోటోను డీపీగా పెట్టడం వల్ల, వారిపై జనంలో విశ్వసనీయత పెరిగిందని, దీనినే అడ్డం పెట్టుకుని మోసాలకు పాల్పడ్డారని తెలుస్తోంది. ఇక, అరెస్ట్ అయిన సాయి శ్రీనాథ్, సుమంత్ లపై ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో మొత్తం 9 కేసులు నమోదై ఉన్నట్లు సీఐడీ వెల్లడించింది. ఇక, నిందితుల నుంచి రూ. 2.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు సీఐడీ పోలీసులు..
తాజావార్తలు
-
Gold Smuggling: స్మగ్లింగ్లో ‘నయా ట్రెండ్’.. ప్యాంటు విప్పి చూడగానే అధికారులు షాక్..
-
Binance : బినాన్స్ యూజర్లకు అలర్ట్.. ఈ 7 సెక్యూరిటీ సెట్టింగ్స్ ఆన్ చేయకపోతే రిస్క్!
-
New Bank: ఇండియాలోనే తొలిసారిగా.. ఆ బ్యాంక్ తెచ్చిన సరికొత్త విప్లవం.. సీఎం చేతుల మీదుగా ప్రారంభం..
-
Indian Economy : పెట్రోల్ సేవ్ చేస్తే దేశానికి జాక్పాట్..! ఫారెక్స్ మ్యాజిక్ ఇదేనా!
-
CBSE: త్రిభాషా విధానంపై సీబీఎస్ఈ సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..