Arunachalam : అరుణాచలంలో అనుమానాస్పద మృతి.. నవీన్ ది హత్యా? ఆత్మహత్యా?
- నవీన్ అనే యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి
- అరుణాచలంలో జరిగిన ఘటన
- పరువు కోసం హత్య చేశారనే ఆరోపణలు
- మాజీ సర్పంచ్ కూతురును ప్రేమించిన నవీన్
- ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందకు తోసేసి దారుణంగా హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arunachalam : అనకాపల్లి జిల్లాలో పరువు హత్య జరిగిందా? కులమతాలకు అతీతంగా నడిచిన ప్రేమ వ్యవహారం చివరకు హత్యకు దారి తీసిందా? తమతో పాటే యువకున్ని తీసుకెళ్లిన తల్లి, బిడ్డ అతన్ని ఏం చేశారు? ప్రేమించిన యువకుడు ఎలా చనిపోయాడు? ఆత్మహత్య చేసుకున్నాడా? హత్య చేశారా? అసలు అరుణాచలంలో ఏం జరిగింది? అనకాపల్లి జిల్లాలో పరువు హత్య ఓ గ్రామాన్ని విషాదంలో నింపింది. రాంబిల్లి మండలం వెంకటాపురానికి చెందిన యువకుడు నవీన్.. అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ప్రియురాలు, ఆమె తల్లితో కలిసి అరుణాచలం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రియురాలి కుటుంబ సభ్యులే తమ పరువు కోసం హత్య చేసి ఉంటారని నవీన్.. కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఫలితంగా నవీన్ మృతిపై అనుమానాలు రేకెత్తుతున్నాయి..
Anil Sunkara : భోళా శంకర్.. చిరంజీవిని బ్లేమ్ చేయడానికే అలా చేశారు..
Also Read
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
- Home Delivery Tragedy: యూట్యూబ్ వీడియోలు చూసి ఇంట్లో ప్రసవం.. భర్తపై కేసు..!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
వెంకటాపురం మాజీ సర్పంచ్ కూతురును నవీన్ ప్రేమించాడు. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య కులచిచ్చు రేగింది. దీంతో ఇద్దరి ప్రేమను అంగీకరించలేదు. ఐతే ప్రియురాలి తల్లి చిన్నమ్ములు ఇద్దరినీ అరుణాచలంకు తీసుకు వెళ్లింది. అక్కడ ఓ లాడ్జిలో బంధించి.. అతనిపై తీవ్రంగా దాడి చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగానే చిన్నమ్ములు సుఫారీ.. ఇచ్చి తీసుకుని వెళ్లిన గ్యాంగ్తో నవీన్ గొంతు కోసి ఆ తరువాత మొదటి అంతస్తు నుంచి కిందకు తోసేసి అత్యంత దారుణంగా హతమార్చారని చెబుతున్నారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఓ నాటకానికి తెర లేపారంటున్నారు. కానీ నవీన్ ఒంటిపై గాయాలు చూసిన పోలీసులకు బంధువులకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి..
నవీన్ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నైలోని కే -10 పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చేతికి అందిన కొడుకును కోల్పోయిన ఆ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. నిజంగా ప్రేమించుకుంటే ఆ విషయాన్ని తనకి చెప్పినట్లయితే తన కుమారుడిని ఆ ప్రేమకు దూరం పెట్టే వారమంటున్నారు తల్లితండ్రులు. ప్రేమిస్తే చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు లోతైన దర్యాఫ్తు చేయాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మృతికి కారణమైన వారిని కటినంగా శిక్షించాలని కోరుతున్నారు…
Vijay: బీజేపీ, డీఎంకేలను వదిలిపెట్టం, దళపతి విజయ్ వార్నింగ్..
తాజావార్తలు
-
Jaggareddy: రామ మందిరంలో దొంగతనం చిన్న విషయమా..? బీజేపీపై జగ్గారెడ్డి ఫైర్..
-
SKN: కెరీర్ మన క్రష్ అయినప్పుడు ఏ క్రష్ అయినా మన వెంట రావాల్సిందే
-
IMD Warning: జూలైలో వర్షాలు నిరాశాజనకంగా ఉంటాయి.. ద్రవ్యోల్బణంపై బిగ్ అలర్ట్
-
Central Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే!
-
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. 3 ఎకరాల లోపు రైతులకు ‘రైతు భరోసా’ నిధులు విడుదల!
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!