Suicide : భార్య మందలించిందన్న మనస్తాపంతో భర్త ఆత్మహత్య
- భార్య మందలించిందన్న మనస్తాపంతో కిషోర్ ఆత్మహత్య
- మద్యం వ్యసనం వల్ల కుటుంబంలో ఘర్షణలు
- మామిడి తోటలో గడ్డి మందు తాగి విషాదాంతం
- కుటుంబాన్ని కుదిపేసిన దారుణ ఘటనపై విచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Suicide : పార్వతీపురం జిల్లా కొమరాడ మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం బానిసైన ఓ యువకుడు భార్య మందలించిందన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోటవాని వలస గ్రామానికి చెందిన కిషోర్ (30) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అయితే గత కొంతకాలంగా మద్యం వ్యసనానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు పలుమార్లు హెచ్చరించినా అలవాటు విడిచిపెట్టలేకపోయాడు.
ఇటీవలి రోజుల్లో పనులు కూడా మానేసి మద్యం మత్తులోనే రోజులు గడిపేవాడు. ఈ కారణంగా అప్పుల పాలయ్యాడు. మద్యం మానుకోవాలనే విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ వాగ్వాదాలు జరిగేవి. తాజాగా కూడా చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకోగా భార్య భార్గవి కోపంతో పుట్టింటికి వెళ్లిపోయింది. ఆమె వెళ్లిపోవడంతో కిషోర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
Also Read
- Hyderabad Crime : మల్కాజ్గిరిలో కలకలం.. భార్యపై కాల్పులు జరిపి పారిపోయిన భర్త.!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
గురువారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరిన కిషోర్ విక్రాంపురం సమీపంలోని ఓ మామిడి తోటకు వెళ్లి గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కొంతసేపటికి అతడు అపస్మారక స్థితిలో పడిపోయినట్టు గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు అతడిని పార్వతీపురం మన్యం జిల్లా ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
భర్త మరణవార్త తెలుసుకున్న భార్య భార్గవి, తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒక్క క్షణికావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం ఆ కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలో ముంచింది. మద్య వ్యసనం అనేక కుటుంబాలను దుఃఖంలోకి నెడుతోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Justice Surya Kant: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్..
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!