Drunken Man: మత్తులో విద్యార్థి వీరంగం.. మూడు వాహనాల్ని ఢీ.. ట్విస్ట్ ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Medical Student Collided Three Vehicles With His Car In Hyderabad: మంగళవారం (03-01-23) రాత్రి ఓ విద్యార్థి మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించాడు. అతివేగంతో నిర్లక్ష్యంగా కారుని నడుపుతూ.. మూడు వాహనాల్ని ఢీ కొట్టాడు. అంతేకాదు.. వారితో దురుసుగా వ్యవహరించాడు. హైలైట్ ట్విస్ట్ ఏమిటంటే.. ఇతనికి డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తే, రిజల్ట్ ఏమీ రాలేదు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలోని ఎయిర్పోర్టు రోడ్డులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Twitter: రాజకీయ ప్రకటనలపై నిషేధాన్ని సడలించనున్న ట్విట్టర్
Also Read
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్య కేసులో ట్విస్ట్.. మొదటి ప్లాన్ హత్య కాదట.!
- Tripura DGP Anurag Dhankar: పోలీసు శాఖలో తీవ్ర విషాదం.. డీజీపీ అనురాగ్ ధన్ఖడ్ ఆత్మహత్య!
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
బంజారాహిల్స్కి చెందిన గౌతమ్ మెహతి (25) అనే వైద్య విద్యార్థి నిన్న రాత్రి మత్తు పదార్థాల్ని సేవించాడు. అనంతరం అర్థరాత్రి తన కారేసుకొని బయలుదేరాడు. తొలుత 1:20 గంటల సమయంలో ఎయిర్పోర్టు రెండో రోటరీ వద్ద మద్యం మత్తులో ముందుగా వెళ్తోన్న ఆటోని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ తాజుద్దీన్ తలకు తీవ్ర గాయలయ్యాయి. అయినా అతనికి సహాయం చేయకుండా, రివర్స్లో అతనితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే ఎయిర్పోర్టు వైపు వెళుతున్న స్విఫ్ట్ కారుని ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు వెనక భాగంతో పాటు ఎడమవైపు బాగం పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి నుంచి ఉడాయించిన గౌతమ్.. దారిలో మరో ద్విచక్రవాహనదారుడ్ని సైతం ఢీ కొట్టాడు.
ATM Technical Problem: ఏటీఎంలో సాంకేతిక లోపం.. కురిసిన నోట్ల వర్షం
ఇలా మద్యం మత్తులో మూడు వాహనాల్ని ఢీకొట్టడంతో.. గౌతమ్పై బాధితులు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, గౌతమ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తే మాత్రం, అతడు మద్యం తాగినట్లు తేలలేదు. దీంతో అతడ్ని పోలీస్ స్టేషన్లో ఉంచకుండా, వదిలేశారు. కానీ.. మరే ఇతర మత్తు పదార్థాలేమైనా సేవించాడా? అనే అనుమానంతో రక్తనమూనాల్ని తీసుకొని, పరిశీలన కోసం ల్యాబ్కు పంపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ, గౌతమ్పై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!