Drunken Man: మత్తులో విద్యార్థి వీరంగం.. మూడు వాహనాల్ని ఢీ.. ట్విస్ట్ ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Medical Student Collided Three Vehicles With His Car In Hyderabad: మంగళవారం (03-01-23) రాత్రి ఓ విద్యార్థి మత్తులో రోడ్డుపై వీరంగం సృష్టించాడు. అతివేగంతో నిర్లక్ష్యంగా కారుని నడుపుతూ.. మూడు వాహనాల్ని ఢీ కొట్టాడు. అంతేకాదు.. వారితో దురుసుగా వ్యవహరించాడు. హైలైట్ ట్విస్ట్ ఏమిటంటే.. ఇతనికి డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తే, రిజల్ట్ ఏమీ రాలేదు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్పోర్టు పరిధిలోని ఎయిర్పోర్టు రోడ్డులో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..
Twitter: రాజకీయ ప్రకటనలపై నిషేధాన్ని సడలించనున్న ట్విట్టర్
Also Read
- Viral: లైకుల కోసం యూట్యూబ్లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క 'APK' ఫైల్తో రూ.95,100 మాయం..
- Cockfight: కోడిపందాలపై ఎస్ఓటీ పంజా.. ఎనిమిది మంది అరెస్ట్, పరారీలో కింగ్ పిన్..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
బంజారాహిల్స్కి చెందిన గౌతమ్ మెహతి (25) అనే వైద్య విద్యార్థి నిన్న రాత్రి మత్తు పదార్థాల్ని సేవించాడు. అనంతరం అర్థరాత్రి తన కారేసుకొని బయలుదేరాడు. తొలుత 1:20 గంటల సమయంలో ఎయిర్పోర్టు రెండో రోటరీ వద్ద మద్యం మత్తులో ముందుగా వెళ్తోన్న ఆటోని వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్ తాజుద్దీన్ తలకు తీవ్ర గాయలయ్యాయి. అయినా అతనికి సహాయం చేయకుండా, రివర్స్లో అతనితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే ఎయిర్పోర్టు వైపు వెళుతున్న స్విఫ్ట్ కారుని ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారు వెనక భాగంతో పాటు ఎడమవైపు బాగం పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి నుంచి ఉడాయించిన గౌతమ్.. దారిలో మరో ద్విచక్రవాహనదారుడ్ని సైతం ఢీ కొట్టాడు.
ATM Technical Problem: ఏటీఎంలో సాంకేతిక లోపం.. కురిసిన నోట్ల వర్షం
ఇలా మద్యం మత్తులో మూడు వాహనాల్ని ఢీకొట్టడంతో.. గౌతమ్పై బాధితులు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి, గౌతమ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. డ్రంక్ & డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తే మాత్రం, అతడు మద్యం తాగినట్లు తేలలేదు. దీంతో అతడ్ని పోలీస్ స్టేషన్లో ఉంచకుండా, వదిలేశారు. కానీ.. మరే ఇతర మత్తు పదార్థాలేమైనా సేవించాడా? అనే అనుమానంతో రక్తనమూనాల్ని తీసుకొని, పరిశీలన కోసం ల్యాబ్కు పంపించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కానీ, గౌతమ్పై చర్యలు తీసుకోకుండా వదిలిపెట్టడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!