మాదక ద్రవ్యాల సరఫరాపై రాష్ట్ర పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. స్మగ్లర్లు పోలీసుల కళ్ళు గప్పి గంజాయి తరలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన పోలీసులు వారి ప్లాన్లను బ్రేక్ చేస్తున్నారు. తాజాగా భారీగా గంజాయి సరఫరా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. సైబరాబాద్ పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 265 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ 55,03,200 ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక లారీలో సీక్రెట్ గా అమర్చి ఉన్న క్యాబిన్ లో గంజాయి ని తరలిస్తుండగా అరెస్ట్ చేశామన్నారు పోలీసులు. ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసామని పోలీసులు తెలిపారు. ఒక వ్యక్తి పరారీ లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుండి 1 వాహనాన్ని, నగదు 32 వేలు, మొబైల్స్ 2, సీజ్ చేసామని పోలీసులు వెల్లడించారు. నిందితుల పైన ఎన్డీపీఎస్ యాక్ట్ తో పాటు పిడీ యాక్ట్ కూడా నమోదు చేస్తామన్నారు.