UP: ఇన్స్టాలో వివాహితతో ప్రేమ.. హోటల్కు పిలిచి ప్రియుడు ఏం చేశాడంటే…!
- ఇన్స్టాలో వివాహితతో ప్రేమ
- పెళ్లి చేసుకోమనడంతో హోటల్కు పిలిచి హత్య
భారతీయ సాంప్రదాయంలో వైవాహిక జీవితం చాలా ప్రత్యేకమైంది. భార్యాభర్తల బంధాన్ని చాలా పవిత్రంగా చూస్తారు. అలాంటి బంధాన్ని కొందరు క్షణిక సుఖం కోసం పచ్చని సంసారాలను కూల్చుకుంటున్నారు. ప్రియుడి మోజులో పడి కట్టుకున్నవాళ్లనే కడతేర్చేస్తున్నారు. ఇక కొందరైతే కామంతో కళ్లు మూసుకుపోయి.. వయసు పైబడిన వారు కూడా అడ్డదారులు తొక్కుతున్నారు. సోషల్ మీడియా ప్రభావమో.. లేదంటే పరిస్థితుల ప్రభావమో తెలియదు గానీ.. లేటు వయసులో ఒక మహిళ ప్రేమలో పడి ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: మధ్యాహ్నం కవిత ప్రెస్మీట్.. బీఆర్ఎస్ నేతలే టార్గెటా?, ఫ్యూచర్ ప్లాన్స్ చెప్పేనా?
Also Read
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Anantapur Honey Trap Case: అనంతపురం హనీ ట్రాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్..!
- TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
- IRS Officer Daughter Murder: నిందితుడి నేర చరిత్ర తెలిసి షాకైన పోలీసులు.. బ్యాగ్రౌండ్ ఎంత ఘోరమంటే..!
ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో ఫరూఖాబాద్కు చెందిన రాణి అనే మహిళ (52).. ఇన్స్టాగ్రామ్లో 26 ఏళ్ల అరుణ్ రాజ్పుత్తో ప్రేమలో పడింది. వయసును దాచిపెట్టి అతడితో లవ్లో పడింది. తొలుత ఆన్లైన్లో సంభాషణలు కొనసాగించారు. అనంతరం ఫరూఖాబాద్లో హోటళ్లలో కలుస్తుండేవారు. నలుగురు పిల్లలు ఉన్నారన్న విషయాన్ని దాచిపెట్టి రాజ్పుత్తో సంబంధాన్ని కొనసాగించింది. ఈ క్రమంలోనే రాజ్పుత్కు రూ.1.5 లక్షలు సాయం చేసింది.
ఇది కూడా చదవండి: Kadapa: వినాయకుడి విగ్రహంపై రప్పా.. రప్పా..!
ఇక ఇద్దరి మధ్య బంధం బలపడుతుండగా పెళ్లి చేసుకోవాలంటూ రాజ్పుత్పై రాణి ఒత్తిడి తెస్తోంది. అంతేకాకుండా తీసుకున్న డబ్బు కూడా తిరిగి ఇచ్చేయాలని కోరుతోంది. దీంతో ప్రియుడు ఒత్తిడికి గురయ్యాడు. ఆమెను అడ్డుతొలగించుకోవాలని ప్రణాళిక రచించాడు. ఆగస్టు 10న రాణిని మైన్పురికి పిలిచాడు. మళ్లీ అదే విషయాన్ని ఆమె ప్రస్తావించింది. పెళ్లి చేసుకోవాలని కోరింది. అంతేకాకుండా డబ్బు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచింది. దీంతో కోపోద్రేకుడైన రాజ్పుత్.. రాణి గొంతు కోసి పరారయ్యాడు.
ఇది కూడా చదవండి: Trump: భారత్ టారిఫ్లపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. వైట్హౌస్లో మీడియా ప్రశ్నకు సమాధానమిదే!
ఇక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మహిళ ఎవరనేది గుర్తించేందుకు పోస్టర్లను అతికించారు. అనంతరం ఫరూఖాబాద్లో తప్పిపోయిన ఫిర్యాదుతో పోల్చగా.. రాణి అని తేలింది. ఇక రాణి మొబైల్, సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా ప్రేమ వ్యవహారం బయటపడింది. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తుండగా బుధవారం అరెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణలు జరిగాయని.. ఫొటోలు, చాట్లు ఉన్నాయని చెప్పారు.
ఏడాదిన్నర క్రితం ఇద్దరి మధ్య ఇన్స్టాలో పరిచయం ఏర్పడిందని.. అనంతరం హోటళ్లలో కలుస్తుండడంతో ఇద్దరి మధ్య బంధం ఏర్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రియుడికి సాయం చేసిందని.. అలాగే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ప్రియుడు చంపేసినట్లుగా వెల్లడించారు. నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!