Crime: మదర్సాలో షాకింగ్ ఘటన.. సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారి హత్య!.. నిందితులు 11, 9ఏళ్ల చిన్నారులే..
- దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు
- సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారి హత్య
- ఇద్దరు 11 ఏళ్ల చిన్నారులు.. 9 ఏళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. దయాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిమ్ ఉల్ ఖురాన్ అనే మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి హత్య కేసులో ఇద్దరు 11 ఏళ్ల చిన్నారులు, 9 ఏళ్ల చిన్నారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం.. 5 ఏళ్ల చిన్నారి రుహాన్ మదర్సాలో అపస్మారక స్థితికి చేరాడు. దీంతో మదర్సా డైరెక్టర్ తల్లికి ఫోన్ చేసి, చిన్నారి ఆరోగ్యం గురించి తెలియజేశారు. తల్లి మదర్సాకు చేరుకుని రుహాన్ను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ డాక్టర్ బిడ్డను పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. చిన్నారి మృతి చెందడంతో మదర్సా బయట నిరసనలు వ్యక్త మయ్యాయి.
READ MORE: Rahul Gandhi: మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరు?
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రి మార్చురీలో భద్రంగా ఉంచి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు పోస్టుమార్టం నివేదికలో చిన్నారి హత్యకు గురైనట్లు తేలింది. దీని తర్వాత.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. పోలీసులు అదే మదర్సాలో చదువుతున్న ముగ్గురు పిల్లలను హత్య ఆరోపణలపై అరెస్టు చేశారు. జిల్లా డీసీపీ డాక్టర్ జాయ్ టిర్కీ తెలిపిన వివరాల ప్రకారం.. రుహాన్ 5 నెలల క్రితం ఈ మదర్సాలో చదువుకోవడానికి వచ్చింది. ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో రుహాన్ కుటుంబం నివసిస్తోంది. చిన్నారి తండ్రి ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్నాడు. భార్య, పిల్లలను కలవడానికి నెలకు ఒకసారి ఢిల్లీకి వస్తాడు. అదే మదర్సాలో చదువుతున్న మరో ముగ్గురు చిన్నారులు రుహాన్ అనే చిన్నారిని అసభ్యంగా ప్రవర్తించి హత్య చేసినట్లు విచారణలో తేలింది. మరణానంతరం మదర్సాలో ఒకరోజు సెలవు ఉంటుందని, ఆ తర్వాత ఇంటికి వెళ్లవచ్చని వారు భావించారు. నిందితులైన చిన్నారులను పోలీసులు పట్టుకున్నారు. మదర్సాలో 250 మంది పిల్లలు మత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఘటన తర్వాత సమీపంలో నివసిస్తున్న తల్లిదండ్రులు ఈ మదర్సా నుంచి తమ పిల్లలను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకువెళ్లారు.
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్ ఉద్యమం హైజాక్.. మత ఉద్యమంగా మారిందా.?
-
Nandamuri Balakrishna: అభిమానులకు గుడ్ న్యూస్.. బాలకృష్ణ మోకాలి ఆపరేషన్ సక్సెస్!
-
Kadambari Jethwani : సీఐడీ ఛార్జ్షీట్పై కాదంబరి జెత్వానీ ఫైర్.!
-
CJP Protest: ప్రధాని మోడీకి అభిజిత్ దీప్కే తాజా హెచ్చరిక..
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?