Rahul Gandhi: మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరు?
- మిస్ ఇండియా జాబితాలో దళిత.. గిరిజన.. ఓబీసీ మహిళలు ఎందుకు లేరు?
- ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన రాజ్యాంగ గౌరవ సదస్సులో రాహుల్ ప్రశ్న
- కుల గణనల ప్రాముఖ్యతను పునరుద్ఘాటించిన ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన రాజ్యాంగ గౌరవ సదస్సులో ఆయన ప్రసంగించారు. కుల గణనల ప్రాముఖ్యతను పునరుద్ఘాటిస్తూ… ఇది కేవలం జనాభా గణన మాత్రమే కాదని, విధాన రూపకల్పనకు ప్రాతిపదిక అన్నారు. “90 శాతం మంది ప్రజలు వ్యవస్థలో భాగం కాలేదు. వీరికి నైపుణ్యాలు, ప్రతిభ, విజ్ఞానం ఉన్నా వ్యవస్థతో సంబంధం లేకుండా జీవిస్తున్నారు. అందుకే కుల గణన కోరుతున్నాం. కుల గణన తర్వాత ఓబీసీ సెక్షన్ ఇస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మాకు వివిధ సంఘాల జాబితా కావాలి. మనకు కుల గణన అనేది కేవలం జనాభా గణన మాత్రమే కాదు. విధాన రూపకల్పనకు ఆధారం. కేవలం కుల గణన చేస్తే సరిపోదు.. దేశంలో సంపద ఎలా పంపిణీ అవుతుందో అర్థం చేసుకోవాలి.” అని ఆయన ఉద్ఘాటించారు. బ్యూరోక్రసీ, న్యాయవ్యవస్థ, మీడియాలో ఓబీసీలు, దళితులు, కార్మికుల భాగస్వామ్యం ఎంత ఉందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమన్నారు.
READ MORE:Unified Pension Scheme: ప్రభుత్వ ఉద్యోగులకు యూపీఎస్ పథకంపై ప్రధాని మోడీ హర్షం..
Also Read
- US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
మిస్ ఇండియా జాబితాను పరిశీలించగా అందులో దళిత, గిరిజన, ఓబీసీ మహిళ లేరన్న విషయం స్పష్టమైందని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పటికీ మీడియా డ్యాన్స్, మ్యూజిక్, క్రికెట్, బాలీవుడ్ గురించి మాట్లాడుతుంది కానీ రైతులు, కూలీల గురించి మాట్లాడదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే కులాలు, ఉపకులాలు, వారి సామాజిక-ఆర్థిక పరిస్థితులను లెక్కించేందుకు దేశవ్యాప్తంగా సామాజిక-ఆర్థిక కుల గణనను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో కూడా పొందుపరిచినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!