Crime: మదర్సాలో షాకింగ్ ఘటన.. సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారి హత్య!.. నిందితులు 11, 9ఏళ్ల చిన్నారులే..
- దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు
- సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారి హత్య
- ఇద్దరు 11 ఏళ్ల చిన్నారులు.. 9 ఏళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. దయాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిమ్ ఉల్ ఖురాన్ అనే మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి హత్య కేసులో ఇద్దరు 11 ఏళ్ల చిన్నారులు, 9 ఏళ్ల చిన్నారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం.. 5 ఏళ్ల చిన్నారి రుహాన్ మదర్సాలో అపస్మారక స్థితికి చేరాడు. దీంతో మదర్సా డైరెక్టర్ తల్లికి ఫోన్ చేసి, చిన్నారి ఆరోగ్యం గురించి తెలియజేశారు. తల్లి మదర్సాకు చేరుకుని రుహాన్ను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ డాక్టర్ బిడ్డను పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. చిన్నారి మృతి చెందడంతో మదర్సా బయట నిరసనలు వ్యక్త మయ్యాయి.
READ MORE: Rahul Gandhi: మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరు?
Also Read
- Bareilly Viral Video: బురఖాలో ప్రియుడితో పట్టుబడిన భార్య.. నడిరోడ్డుపై భర్త వీరంగం..
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రి మార్చురీలో భద్రంగా ఉంచి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు పోస్టుమార్టం నివేదికలో చిన్నారి హత్యకు గురైనట్లు తేలింది. దీని తర్వాత.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. పోలీసులు అదే మదర్సాలో చదువుతున్న ముగ్గురు పిల్లలను హత్య ఆరోపణలపై అరెస్టు చేశారు. జిల్లా డీసీపీ డాక్టర్ జాయ్ టిర్కీ తెలిపిన వివరాల ప్రకారం.. రుహాన్ 5 నెలల క్రితం ఈ మదర్సాలో చదువుకోవడానికి వచ్చింది. ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో రుహాన్ కుటుంబం నివసిస్తోంది. చిన్నారి తండ్రి ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్నాడు. భార్య, పిల్లలను కలవడానికి నెలకు ఒకసారి ఢిల్లీకి వస్తాడు. అదే మదర్సాలో చదువుతున్న మరో ముగ్గురు చిన్నారులు రుహాన్ అనే చిన్నారిని అసభ్యంగా ప్రవర్తించి హత్య చేసినట్లు విచారణలో తేలింది. మరణానంతరం మదర్సాలో ఒకరోజు సెలవు ఉంటుందని, ఆ తర్వాత ఇంటికి వెళ్లవచ్చని వారు భావించారు. నిందితులైన చిన్నారులను పోలీసులు పట్టుకున్నారు. మదర్సాలో 250 మంది పిల్లలు మత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఘటన తర్వాత సమీపంలో నివసిస్తున్న తల్లిదండ్రులు ఈ మదర్సా నుంచి తమ పిల్లలను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకువెళ్లారు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!