Crime: మదర్సాలో షాకింగ్ ఘటన.. సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారి హత్య!.. నిందితులు 11, 9ఏళ్ల చిన్నారులే..
- దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు
- సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారి హత్య
- ఇద్దరు 11 ఏళ్ల చిన్నారులు.. 9 ఏళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. దయాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిమ్ ఉల్ ఖురాన్ అనే మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి హత్య కేసులో ఇద్దరు 11 ఏళ్ల చిన్నారులు, 9 ఏళ్ల చిన్నారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం.. 5 ఏళ్ల చిన్నారి రుహాన్ మదర్సాలో అపస్మారక స్థితికి చేరాడు. దీంతో మదర్సా డైరెక్టర్ తల్లికి ఫోన్ చేసి, చిన్నారి ఆరోగ్యం గురించి తెలియజేశారు. తల్లి మదర్సాకు చేరుకుని రుహాన్ను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ డాక్టర్ బిడ్డను పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. చిన్నారి మృతి చెందడంతో మదర్సా బయట నిరసనలు వ్యక్త మయ్యాయి.
READ MORE: Rahul Gandhi: మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరు?
Also Read
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రి మార్చురీలో భద్రంగా ఉంచి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు పోస్టుమార్టం నివేదికలో చిన్నారి హత్యకు గురైనట్లు తేలింది. దీని తర్వాత.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. పోలీసులు అదే మదర్సాలో చదువుతున్న ముగ్గురు పిల్లలను హత్య ఆరోపణలపై అరెస్టు చేశారు. జిల్లా డీసీపీ డాక్టర్ జాయ్ టిర్కీ తెలిపిన వివరాల ప్రకారం.. రుహాన్ 5 నెలల క్రితం ఈ మదర్సాలో చదువుకోవడానికి వచ్చింది. ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో రుహాన్ కుటుంబం నివసిస్తోంది. చిన్నారి తండ్రి ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్నాడు. భార్య, పిల్లలను కలవడానికి నెలకు ఒకసారి ఢిల్లీకి వస్తాడు. అదే మదర్సాలో చదువుతున్న మరో ముగ్గురు చిన్నారులు రుహాన్ అనే చిన్నారిని అసభ్యంగా ప్రవర్తించి హత్య చేసినట్లు విచారణలో తేలింది. మరణానంతరం మదర్సాలో ఒకరోజు సెలవు ఉంటుందని, ఆ తర్వాత ఇంటికి వెళ్లవచ్చని వారు భావించారు. నిందితులైన చిన్నారులను పోలీసులు పట్టుకున్నారు. మదర్సాలో 250 మంది పిల్లలు మత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఘటన తర్వాత సమీపంలో నివసిస్తున్న తల్లిదండ్రులు ఈ మదర్సా నుంచి తమ పిల్లలను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకువెళ్లారు.
తాజావార్తలు
-
Minister Narayana: అందువల్లే ఖర్చు ఎక్కువ.. అమరావతి నిర్మాణాలపై మంత్రి నారాయణ వివరణ
-
Allu Arjun Happy: హ్యాపీ రీ రిలీజ్’తో కేరళలో అల్లు అర్జున్ సెన్సేషన్.!
-
Devara : ట్రోల్స్పై మౌనం వీడిన ‘దేవర’ డీఓపీ… హీరోల హైట్ పై షాకింగ్ కామెంట్స్
-
Tirumala: అత్యంత అరుదైన దర్శనం.. ‘వ్యూహ లక్ష్మి అచ్చు’ గురించి తెలుసా.?
-
Telangana High Court: హైడ్రా కమిషనర్కు హైకోర్టు షాక్.. రంగనాథ్కు భారీ జరిమానా విధింపు..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!