Crime: మదర్సాలో షాకింగ్ ఘటన.. సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారి హత్య!.. నిందితులు 11, 9ఏళ్ల చిన్నారులే..
- దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు
- సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారి హత్య
- ఇద్దరు 11 ఏళ్ల చిన్నారులు.. 9 ఏళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలోని ఓ మదర్సాలో షాకింగ్ కేసు వెలుగు చూసింది. ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. దయాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిమ్ ఉల్ ఖురాన్ అనే మదర్సాలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నారి హత్య కేసులో ఇద్దరు 11 ఏళ్ల చిన్నారులు, 9 ఏళ్ల చిన్నారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సమాచారం ప్రకారం.. 5 ఏళ్ల చిన్నారి రుహాన్ మదర్సాలో అపస్మారక స్థితికి చేరాడు. దీంతో మదర్సా డైరెక్టర్ తల్లికి ఫోన్ చేసి, చిన్నారి ఆరోగ్యం గురించి తెలియజేశారు. తల్లి మదర్సాకు చేరుకుని రుహాన్ను ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లింది. అక్కడ డాక్టర్ బిడ్డను పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. చిన్నారి మృతి చెందడంతో మదర్సా బయట నిరసనలు వ్యక్త మయ్యాయి.
READ MORE: Rahul Gandhi: మిస్ ఇండియా జాబితాలో దళిత, గిరిజన, ఓబీసీ మహిళలు ఎందుకు లేరు?
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని గురు తేగ్ బహదూర్ ఆసుపత్రి మార్చురీలో భద్రంగా ఉంచి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు పోస్టుమార్టం నివేదికలో చిన్నారి హత్యకు గురైనట్లు తేలింది. దీని తర్వాత.. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా.. పోలీసులు అదే మదర్సాలో చదువుతున్న ముగ్గురు పిల్లలను హత్య ఆరోపణలపై అరెస్టు చేశారు. జిల్లా డీసీపీ డాక్టర్ జాయ్ టిర్కీ తెలిపిన వివరాల ప్రకారం.. రుహాన్ 5 నెలల క్రితం ఈ మదర్సాలో చదువుకోవడానికి వచ్చింది. ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో రుహాన్ కుటుంబం నివసిస్తోంది. చిన్నారి తండ్రి ఉత్తరప్రదేశ్లో నివసిస్తున్నాడు. భార్య, పిల్లలను కలవడానికి నెలకు ఒకసారి ఢిల్లీకి వస్తాడు. అదే మదర్సాలో చదువుతున్న మరో ముగ్గురు చిన్నారులు రుహాన్ అనే చిన్నారిని అసభ్యంగా ప్రవర్తించి హత్య చేసినట్లు విచారణలో తేలింది. మరణానంతరం మదర్సాలో ఒకరోజు సెలవు ఉంటుందని, ఆ తర్వాత ఇంటికి వెళ్లవచ్చని వారు భావించారు. నిందితులైన చిన్నారులను పోలీసులు పట్టుకున్నారు. మదర్సాలో 250 మంది పిల్లలు మత విద్యను అభ్యసిస్తున్నారు. ఈ ఘటన తర్వాత సమీపంలో నివసిస్తున్న తల్లిదండ్రులు ఈ మదర్సా నుంచి తమ పిల్లలను సురక్షితంగా వారి ఇళ్లకు తిరిగి తీసుకువెళ్లారు.
తాజావార్తలు
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
-
India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!