Human Sacrifice: సవతి తల్లి ఘాతుకం.. 4 ఏళ్ల బాలుడి నరబలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Human Sacrifice: కన్నబిడ్డగా చూసుకోవాల్సిన సవితి తల్లే బాలుడి పట్ల దారుణంగా వ్యవహరించింది. తన ఆరోగ్య సమస్యలు తగ్గిపోవడానికి ఓ క్షుద్రపూజారి చెప్పిన విధంగా నాలుగేళ్ల బాలుడిని బలిచ్చింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అమేథిలోని జామో ప్రాంతంలోని రెహ్సీ అనే గ్రామంలో జరిగింది. నరబలికి పాల్పడిన సవతి తల్లితో పాటు నలుగురిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సోమవారం గ్రామంలోని చెరువులో 4 ఏళ్ల బాలుడు సత్యేంద్ర శవమై కనిపించాడు. ఆదివారం ఆడుకోవడానికి బయటకు వెళ్లిన తర్వాత సత్యేంద్ర తిరిగి రాలేదు. అతని తండ్రి జితేంద్ర ప్రజాపతి కొడుకు కనిపించడం లేదని సోమవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్ర సత్యేంద్ర మృతదేహం చెరువులో కనిపించింది.
Read Also: Prabhas Dubbing: ప్రభాస్ పాత్రకి డబ్బింగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ విలన్.. ఎవరో తెలుసా?
Also Read
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
- Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
అయితే తన భార్య రేణుపై అనుమానం వ్యక్తం చేశాడు ప్రజాపతి. దీంతో విచారణ చేయగా మొత్తం నరబలి వ్యవహారం బయటకు వచ్చిందని అమేథి ఎస్పీ ఎలమారన్ జి తెలిపారు. భార్య రేణుతో పాటు ఆమె తండ్రి మంగ్రుప్రజాతి, తల్లి ప్రేమాదేవి, క్షుద్రపూజారి దయారావ్ యాదవ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో మంగ్రు, ప్రేమాదేవి అసలు కారణాన్ని చెప్పారు. ఏడాదిన్నర క్రితం తమ కుమార్తె రేణుకు జితేంద్రతో వివాహం జరిపించామని, మొదటి భార్య జితేంద్రను విడిచివెళ్లిపోవడంతో తమ కూతురిని ఇచ్చి పెళ్లి చేశామని తెలిపారు. పిల్లాడు సత్యేంద్ర మొదటి భార్య కుమారుడని పోలీసులు తెలిపారు. అయితే రేణు జితేంద్రతో వివాహం తర్వాత అనారోగ్యంతో, గర్భస్రావంతో బాధపడుతోందని, ఆమె సమస్యపై క్షుద్రపూజారి దయారామ్ యాదవ్ సంప్రదిస్తే.. రేణు గర్భం దాల్చాలంటే జితేంద్ర మొదటి బిడ్డను బలివ్వాలని చెప్పాడని అందుకే పిల్లాడిని చంపినట్లు నిందితులు ఒప్పుకున్నారు. క్షుద్రపూజలు జరిగిన ప్రదేశంలో నిమ్మకాయలు, టవల్, జాజికాయలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం హత్య నేరం ఫైల్ చేశారు.
తాజావార్తలు
-
RBI New Loan Rules: లోన్ తీసుకునేవారికి RBI గుడ్న్యూస్.. కొత్త నిబంధనలతో భారీ మార్పులు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!